నాలుగుసార్లు ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్గా నిలిచిన ఇవాండర్ హోలీఫీల్డ్.. 57 ఏళ్ల వయసులో మళ్లీ బాక్సింగ్ రింగ్లో అడుగుపెడతానంటున్నాడు. కరోనా మహమ్మారిపై పోరుకు అండగా నిలవడం కోసం ఛారిటీ బౌట్లో పాల్గొనున్నట్లు తెలిపాడు. వైరస్ వల్ల నిలిచిపోయిన చిన్నారుల విద్యాభ్యాసానికి తిరిగి ఊతమిచ్చేందుకే ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ల్లో బరిలోకి దిగనున్నట్లు పేర్కొన్నాడు.
"మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న సమయం రాబోతుంది. ఛాంపియన్ తిరిగి బాక్సింగ్ ఆడనున్నాడు. ఓ మంచిపని కోసం ఎగ్జిబిషన్ మ్యాచ్ల్లో తలపడబోతున్నా"
- హోలీఫీల్డ్, ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్
ఇప్పటికే దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్.. ఎగ్జిబిషన్ మ్యాచ్ల్లో పాల్గొనేందుకు సాధన మొదలెట్టాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య దాదాపు 20 ఏళ్ల తర్వాత పోరు జరిగే అవకాశం ఉంది.
ఇదీ చూడండి : ఆకాశ్ 'ప్రపంచకప్ ఎలెవన్'లో ధోనీకి దక్కని స్థానం!