ETV Bharat / sports

'ఆ 35 పరుగులే నాకు అత్యుత్తమం'- 11 ఏళ్లు వెనక్కి వెళ్లిన కోహ్లీ

author img

By

Published : Apr 2, 2022, 12:19 PM IST

Updated : Apr 2, 2022, 12:26 PM IST

Virat Kohli Recalls 2011 World Cup: టీమ్​ఇండియా 2011 వన్డే ప్రపంచకప్ నెగ్గి నేటికి సరిగ్గా పదకొండు సంవత్సరాలు. ఆ జ్ఞాపకాలు మాత్రం నేటికీ మన మనసుల్లో కదలాడుతున్నాయి. ఈ సందర్భంగా భారత మాజీ, ప్రస్తుత తరం క్రికెటర్లు ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. ఫైనల్లో తాను చేసిన 35 పరుగులే తన కెరీర్​లో అత్యంత విలువైనవని అన్నాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. యువరాజ్​సింగ్​, హర్భజన్​ సింగ్​ సహా పలువురు సోషల్​ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Virat Kohli recalls final night of 2011 World Cup
Virat Kohli recalls final night of 2011 World Cup

Virat Kohli Recalls 2011 World Cup: టీమ్​ఇండియా 2011 ప్రపంచకప్ గెలుపొంది పదకొండు సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా.. అప్పటి రోజులను గుర్తుచేసుకున్నాడు భారత మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. భారత క్రికెట్​కు సచిన్​ చేసిన సేవలను కొనియాడాడు. 2011 ప్రపంచకప్​లో ప్రతిమ్యాచ్​ ఆడిన కోహ్లీ.. నాలుగో స్థానంలో బ్యాటింగ్​తో రాణించాడు. ఆరంభ మ్యాచ్​లోనే బంగ్లాదేశ్​పై సెంచరీతో అలరించాడు. సచిన్​ 9 మ్యాచ్​ల్లో 53.55 సగటుతో 482 పరుగులు చేసి.. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

ఫైనల్లో శ్రీలంక.. భారత్​ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో ఓపెనర్లు సచిన్​, సెహ్వాగ్​ తక్కువ స్కోరుకే వెనుదిరుగుతారు. అప్పుడు బ్యాటింగ్​కు వచ్చిన విరాట్​.. గంభీర్​తో కలిసి వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు. మూడో వికెట్​కు విలువైన 81 పరుగులు జోడించారు. 35 పరుగులు చేసి కోహ్లీ ఔటవుతాడు. గంభీర్​ 97 పరుగులతో ఫైనల్లో కీలక పాత్ర పోషించాడు. ధోనీ(91), యువరాజ్​ సింగ్​(21*) లాంఛనాన్ని పూర్తి చేసి భారత్​కు రెండో వన్డే ప్రపంచకప్​ను అందించారు. కోట్లాది భారతీయుల కల నెరవేరిన రోజు అది.

ఫైనల్లో ఆ 35 పరుగులే: ఫైనల్లో తాను చేసిన 35 పరుగులు.. తన కెరీర్​లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్​ అని కోహ్లీ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నాడు. అదే తనకు అత్యంత విలువైందని అన్నాడు. సచిన్​ భారత క్రికెట్​కు చేసిన సేవలు వెలకట్టలేనివని, అతడిని అందుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నా.. అది చాలా దూరంలో ఉందని అన్నాడు. క్రికెట్​ ఆడే రోజుల్లో.. సచిన్​పై ఎన్నో అంచనాలు ఉండేవని, ఆ ఒత్తిడిని భరించి గొప్పగా రాణించడం అతడికే చెల్లిందని చెప్పాడు.

ప్రపంచకప్​ గెలిచి 11 ఏళ్లు అయిన సందర్భంగా.. బీసీసీఐ కూడా ట్వీట్​ చేసింది. ప్రపంచకప్​ విజయం.. ఎప్పటికీ జ్ఞాపకాల్లో నిలిచిపోతుందని పేర్కొంది. 2011 ప్రపంచకప్​ హీరో, ప్లేయర్​ ఆఫ్​ ది టోర్నమెంట్​ యువరాజ్​ సింగ్​ కూడా ఆనాటి మరపురాని విశేషాల్ని గుర్తుచేసుకున్నాడు. వరల్డ్​కప్​ మాత్రమే గెలవడం కాకుండా.. అది కోట్లాది భారతీయుల కల నెరవేరిన రోజు అని భావోద్వేగపూరిత ట్వీట్​ చేశాడు. దేశం కోసం, సచిన్​ కోసం వరల్డ్​కప్​ గెలిచిన టీమ్​ఇండియాలో భాగం కావడం గర్వంగా ఉందని అన్నాడు.

ఇవీ చూడండి: 200+ లక్ష్యాలూ ఉఫ్​- ఐపీఎల్​లో అత్యుత్తమ ఛేదనలివే..

'మహా' సర్కార్​ కీలక నిర్ణయం.. ఐపీఎల్​ ఫ్యాన్స్​ ఫుల్​ ఖుష్​

Virat Kohli Recalls 2011 World Cup: టీమ్​ఇండియా 2011 ప్రపంచకప్ గెలుపొంది పదకొండు సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా.. అప్పటి రోజులను గుర్తుచేసుకున్నాడు భారత మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. భారత క్రికెట్​కు సచిన్​ చేసిన సేవలను కొనియాడాడు. 2011 ప్రపంచకప్​లో ప్రతిమ్యాచ్​ ఆడిన కోహ్లీ.. నాలుగో స్థానంలో బ్యాటింగ్​తో రాణించాడు. ఆరంభ మ్యాచ్​లోనే బంగ్లాదేశ్​పై సెంచరీతో అలరించాడు. సచిన్​ 9 మ్యాచ్​ల్లో 53.55 సగటుతో 482 పరుగులు చేసి.. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

ఫైనల్లో శ్రీలంక.. భారత్​ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో ఓపెనర్లు సచిన్​, సెహ్వాగ్​ తక్కువ స్కోరుకే వెనుదిరుగుతారు. అప్పుడు బ్యాటింగ్​కు వచ్చిన విరాట్​.. గంభీర్​తో కలిసి వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు. మూడో వికెట్​కు విలువైన 81 పరుగులు జోడించారు. 35 పరుగులు చేసి కోహ్లీ ఔటవుతాడు. గంభీర్​ 97 పరుగులతో ఫైనల్లో కీలక పాత్ర పోషించాడు. ధోనీ(91), యువరాజ్​ సింగ్​(21*) లాంఛనాన్ని పూర్తి చేసి భారత్​కు రెండో వన్డే ప్రపంచకప్​ను అందించారు. కోట్లాది భారతీయుల కల నెరవేరిన రోజు అది.

ఫైనల్లో ఆ 35 పరుగులే: ఫైనల్లో తాను చేసిన 35 పరుగులు.. తన కెరీర్​లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్​ అని కోహ్లీ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నాడు. అదే తనకు అత్యంత విలువైందని అన్నాడు. సచిన్​ భారత క్రికెట్​కు చేసిన సేవలు వెలకట్టలేనివని, అతడిని అందుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నా.. అది చాలా దూరంలో ఉందని అన్నాడు. క్రికెట్​ ఆడే రోజుల్లో.. సచిన్​పై ఎన్నో అంచనాలు ఉండేవని, ఆ ఒత్తిడిని భరించి గొప్పగా రాణించడం అతడికే చెల్లిందని చెప్పాడు.

ప్రపంచకప్​ గెలిచి 11 ఏళ్లు అయిన సందర్భంగా.. బీసీసీఐ కూడా ట్వీట్​ చేసింది. ప్రపంచకప్​ విజయం.. ఎప్పటికీ జ్ఞాపకాల్లో నిలిచిపోతుందని పేర్కొంది. 2011 ప్రపంచకప్​ హీరో, ప్లేయర్​ ఆఫ్​ ది టోర్నమెంట్​ యువరాజ్​ సింగ్​ కూడా ఆనాటి మరపురాని విశేషాల్ని గుర్తుచేసుకున్నాడు. వరల్డ్​కప్​ మాత్రమే గెలవడం కాకుండా.. అది కోట్లాది భారతీయుల కల నెరవేరిన రోజు అని భావోద్వేగపూరిత ట్వీట్​ చేశాడు. దేశం కోసం, సచిన్​ కోసం వరల్డ్​కప్​ గెలిచిన టీమ్​ఇండియాలో భాగం కావడం గర్వంగా ఉందని అన్నాడు.

ఇవీ చూడండి: 200+ లక్ష్యాలూ ఉఫ్​- ఐపీఎల్​లో అత్యుత్తమ ఛేదనలివే..

'మహా' సర్కార్​ కీలక నిర్ణయం.. ఐపీఎల్​ ఫ్యాన్స్​ ఫుల్​ ఖుష్​

Last Updated : Apr 2, 2022, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.