ETV Bharat / sports

IND VS SL: వన్డే సిరీస్​కు భారత్​ రెడీ.. ఆ విషయంపైనే మేనేజ్​మెంట్​ కసరత్తు

శ్రీలంకపై టీ ట్వంటీ సిరీస్‌ నెగ్గి ఊపు మీదున్న టీమిండియా.. వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. టీమిండియా సారధి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ తిరిగి జట్టులో చేరడంతో భారత బ్యాటింగ్ లైనప్‌ పటిష్టంగా కనిపిస్తోంది. స్పీడ్‌ స్టార్‌ బుమ్రా జట్టులోకి వస్తాడని అంతా భావించినా గాయం కారణంగా అతను సిరీస్‌ నుంచి వైదొలగడంతో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టీ ట్వంటీ సిరీస్‌లో టీమిండియాకు పోటీనిచ్చిన లంక.. వన్డే సిరీస్‌లోనూ దాన్ని కొనసాగించాలని వ్యూహాలు రచిస్తోంది.

author img

By

Published : Jan 9, 2023, 10:15 PM IST

IND VS SL ODI series
వన్డే సిరీస్​కు భారత్​ రెడీ.. వ్యూహాలు రచిస్తున్న లంక

శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు రోహిత్‌ సేన సిద్ధమైంది. ఇప్పటికే టీ ట్వంటీ సిరీస్‌ గెలిచి ఉత్సాహంగా ఉన్న భారత జట్టు.... మంగళవారం లంకతో తొలి వన్డే ఆడనుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ తిరిగి జట్టులో చేరడంతో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్ దుర్భేద్యంగా మారింది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడని భావించినా..గాయం కారణంగా దూరం కావడంతో భారత జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆసియా కప్, టీ ట్వంటీ ప్రపంచకప్‌నకు దూరమైన బుమ్రా జనవరి 18 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్‌ పర్యటనకైనా అందుబాటులో ఉంటాడా ఉండడా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

రోహిత్, కోహ్లీ, కేఎల్​ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడంతో భారత్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదని మాజీలు అంచనా వేస్తున్నారు. మరో 10 నెలల్లో ప్రపంచకప్‌ ప్రారంభం కానున్న దృష్ట్యా జట్టు కూర్పుపై మేనేజ్‌మెంట్‌ కసరత్తు చేస్తోంది. ఓపెనర్‌గా. రోహిత్‌కు తోడుగా ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇషాన్‌ కిషన్, శుభ్‌మన్‌ గిల్‌లలో ఒకరు రోహిత్‌తో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. దానికి యువకుడు శుభ్‌మాన్ గిల్‌తో నేరుగా ఘర్షణ పడవచ్చు. తర్వాత కోహ్లీ.. శ్రేయస్స్‌ అయ్యర్‌, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా.... కేఎల్‌ రాహుల్‌లతో భారత జట్టు బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. టీ ట్వంటీల్లో అద్భుతాలు చేస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌... వన్డేల్లోనూ సత్తా చాటాలని భావిస్తున్నాడు. వన్డేల్లో 16 మ్యాచ్‌లు ఆడిన సూర్య రెండు అర్ధ సెంచరీలతో కేవలం 384 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌నకు ముందు వన్డేల్లో తన సత్తా చాటాలని సూర్య పట్టుదలగా ఉన్నాడు. బౌలింగ్‌లో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లకు తుది జట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ భారత్‌కు అదనపు బలాన్ని ఇవ్వనుంది.

వన్డేల్లోనూ సత్తా చాటాలని.. టీ ట్వంటీ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చిన శ్రీలంక జట్టు వన్డేల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది. శ్రీలంక కెప్టెన్ దసున్ షనకపై లంక భారీ ఆశలు పెట్టుకుంది. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ పాతుమ్ నిస్సాంక కూడా రాణిస్తే భారత బౌలింగ్ దళానికి తిప్పలు తప్పకపోవచ్చు. లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే... భారత వికెట్లపై సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇదీ చూడండి: సూర్య భాయ్​.. వందేళ్లకు ఓసారి మాత్రమే ఇలాంటోడు వస్తాడు

శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు రోహిత్‌ సేన సిద్ధమైంది. ఇప్పటికే టీ ట్వంటీ సిరీస్‌ గెలిచి ఉత్సాహంగా ఉన్న భారత జట్టు.... మంగళవారం లంకతో తొలి వన్డే ఆడనుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ తిరిగి జట్టులో చేరడంతో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్ దుర్భేద్యంగా మారింది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడని భావించినా..గాయం కారణంగా దూరం కావడంతో భారత జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆసియా కప్, టీ ట్వంటీ ప్రపంచకప్‌నకు దూరమైన బుమ్రా జనవరి 18 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్‌ పర్యటనకైనా అందుబాటులో ఉంటాడా ఉండడా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

రోహిత్, కోహ్లీ, కేఎల్​ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడంతో భారత్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదని మాజీలు అంచనా వేస్తున్నారు. మరో 10 నెలల్లో ప్రపంచకప్‌ ప్రారంభం కానున్న దృష్ట్యా జట్టు కూర్పుపై మేనేజ్‌మెంట్‌ కసరత్తు చేస్తోంది. ఓపెనర్‌గా. రోహిత్‌కు తోడుగా ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇషాన్‌ కిషన్, శుభ్‌మన్‌ గిల్‌లలో ఒకరు రోహిత్‌తో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. దానికి యువకుడు శుభ్‌మాన్ గిల్‌తో నేరుగా ఘర్షణ పడవచ్చు. తర్వాత కోహ్లీ.. శ్రేయస్స్‌ అయ్యర్‌, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా.... కేఎల్‌ రాహుల్‌లతో భారత జట్టు బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. టీ ట్వంటీల్లో అద్భుతాలు చేస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌... వన్డేల్లోనూ సత్తా చాటాలని భావిస్తున్నాడు. వన్డేల్లో 16 మ్యాచ్‌లు ఆడిన సూర్య రెండు అర్ధ సెంచరీలతో కేవలం 384 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌నకు ముందు వన్డేల్లో తన సత్తా చాటాలని సూర్య పట్టుదలగా ఉన్నాడు. బౌలింగ్‌లో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లకు తుది జట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ భారత్‌కు అదనపు బలాన్ని ఇవ్వనుంది.

వన్డేల్లోనూ సత్తా చాటాలని.. టీ ట్వంటీ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చిన శ్రీలంక జట్టు వన్డేల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది. శ్రీలంక కెప్టెన్ దసున్ షనకపై లంక భారీ ఆశలు పెట్టుకుంది. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ పాతుమ్ నిస్సాంక కూడా రాణిస్తే భారత బౌలింగ్ దళానికి తిప్పలు తప్పకపోవచ్చు. లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే... భారత వికెట్లపై సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇదీ చూడండి: సూర్య భాయ్​.. వందేళ్లకు ఓసారి మాత్రమే ఇలాంటోడు వస్తాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.