ETV Bharat / sports

వివాదాస్పద పోస్టులకు శార్దూల్‌ 'లైక్‌'లు.. టీమ్‌ఇండియాలో రాజకీయం జరుగుతోందా?

author img

By

Published : Dec 25, 2022, 10:56 PM IST

బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకొంది. అయితే సిరీస్‌కు ఎంపికైనప్పటికీ శార్దూల్‌ ఠాకూర్‌కు మాత్రం ఆడేందుకు అవకాశం రాలేదు. దీనిపై సోషల్‌ మీడియాలో చర్చ జరిగింది.

shardul likes controversial tweets
shardul likes controversial tweets

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల్లోనూ టీమ్‌ఇండియా బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్ రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితయ్యాడు. తొలి టెస్టులో కుల్‌దీప్‌ యాదవ్‌ కోసం ఆపారు. ఇక రెండో టెస్టులో శార్దూల్‌ని కాదని జయ్‌దేవ్‌ ఉనద్కత్‌కు అవకాశం దక్కింది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో శార్దూల్‌కి మద్దతుగా కొన్ని ట్వీట్లు కనిపిస్తున్నాయి. శార్దూల్‌ జట్టులో ఉండాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో క్రికెట్‌ - రాజకీయం అంటూ కొంతమంది ఘాటుగా ట్వీట్లు చేశారు.

అయితే ఇక్కడ సమస్య ఆ ట్వీట్లు కాదు.. అలాంటి కొన్ని ట్వీట్లకు శార్దూల్‌ ఠాకూర్‌ లైక్‌ కొట్టడమే. 'జట్టు ఎంపికలో రాజకీయాలున్నాయా?' అంటూ నెటిజన్లు ట్వీట్లు చేశారు. మరికొంతమంది ఇవన్నీ వదిలేసి రంజీలకు వెళ్లిపో అంటూ ట్వీటారు. అలాంటి వాటిని శార్దూల్‌ లైక్‌ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కుల్‌దీప్‌ యాదవ్‌ను కాదని జయదేవ్‌ ఉనద్కత్‌ను ఎంచుకోవడంపై ఓ వైపు చర్చ జరుగుతుండగా, ఇలా శార్దూల్‌ విషయం సోషల్‌ మీడియాకి ఎక్కడంతో 'టీమ్‌ ఇండియాలో ఏమవుతోంది' అనే చర్చ సాగుతోంది.

శార్దూల్ లైక్‌ చేసిన ట్వీట్లు
''శార్దూల్‌ను పక్కన పెట్టడంలో రాజకీయాలు కీలక పాత్ర పోషించాయి. అందుకే నువ్వు వెళ్లి రంజీ ట్రోఫీలో ఆడు. అక్కడైతే పెద్దగా రాజకీయాలు ఉండవు. శార్దూల్‌ నువ్వు తప్పకుండా మళ్లీ తిరిగి వస్తావని ఆశిస్తున్నాం''
''భయ్యా.. నువ్వు నీ పబ్లిక్‌ రిలేషన్‌ టీమ్‌లో సరైన వ్యక్తిని పెట్టుకో. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో జట్టు ఎంపికను ట్విట్టర్​ ట్రెండ్స్‌ ప్రభావితం చేస్తున్నాయి''

.

సుదీర్ఘ ఫార్మాట్‌లోకి 2018లో అరంగేట్రం చేసిన శార్దూల్‌ కేవలం 8 టెస్టులు మాత్రమే ఆడి 27 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ తర్వాత జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌ వంటి బౌలర్ల రాకతో తుది జట్టులోకి శార్దూల్‌ రావడం గగనంగా మారింది. తాజాగా బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైనప్పటికీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల్లోనూ టీమ్‌ఇండియా బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్ రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితయ్యాడు. తొలి టెస్టులో కుల్‌దీప్‌ యాదవ్‌ కోసం ఆపారు. ఇక రెండో టెస్టులో శార్దూల్‌ని కాదని జయ్‌దేవ్‌ ఉనద్కత్‌కు అవకాశం దక్కింది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో శార్దూల్‌కి మద్దతుగా కొన్ని ట్వీట్లు కనిపిస్తున్నాయి. శార్దూల్‌ జట్టులో ఉండాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో క్రికెట్‌ - రాజకీయం అంటూ కొంతమంది ఘాటుగా ట్వీట్లు చేశారు.

అయితే ఇక్కడ సమస్య ఆ ట్వీట్లు కాదు.. అలాంటి కొన్ని ట్వీట్లకు శార్దూల్‌ ఠాకూర్‌ లైక్‌ కొట్టడమే. 'జట్టు ఎంపికలో రాజకీయాలున్నాయా?' అంటూ నెటిజన్లు ట్వీట్లు చేశారు. మరికొంతమంది ఇవన్నీ వదిలేసి రంజీలకు వెళ్లిపో అంటూ ట్వీటారు. అలాంటి వాటిని శార్దూల్‌ లైక్‌ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కుల్‌దీప్‌ యాదవ్‌ను కాదని జయదేవ్‌ ఉనద్కత్‌ను ఎంచుకోవడంపై ఓ వైపు చర్చ జరుగుతుండగా, ఇలా శార్దూల్‌ విషయం సోషల్‌ మీడియాకి ఎక్కడంతో 'టీమ్‌ ఇండియాలో ఏమవుతోంది' అనే చర్చ సాగుతోంది.

శార్దూల్ లైక్‌ చేసిన ట్వీట్లు
''శార్దూల్‌ను పక్కన పెట్టడంలో రాజకీయాలు కీలక పాత్ర పోషించాయి. అందుకే నువ్వు వెళ్లి రంజీ ట్రోఫీలో ఆడు. అక్కడైతే పెద్దగా రాజకీయాలు ఉండవు. శార్దూల్‌ నువ్వు తప్పకుండా మళ్లీ తిరిగి వస్తావని ఆశిస్తున్నాం''
''భయ్యా.. నువ్వు నీ పబ్లిక్‌ రిలేషన్‌ టీమ్‌లో సరైన వ్యక్తిని పెట్టుకో. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో జట్టు ఎంపికను ట్విట్టర్​ ట్రెండ్స్‌ ప్రభావితం చేస్తున్నాయి''

.

సుదీర్ఘ ఫార్మాట్‌లోకి 2018లో అరంగేట్రం చేసిన శార్దూల్‌ కేవలం 8 టెస్టులు మాత్రమే ఆడి 27 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ తర్వాత జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌ వంటి బౌలర్ల రాకతో తుది జట్టులోకి శార్దూల్‌ రావడం గగనంగా మారింది. తాజాగా బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైనప్పటికీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.