ETV Bharat / sports

దక్షిణాఫ్రికా పర్యటనే ఇషాంత్​కు చివరిదా?

Ishant Sharma last Assignment: దక్షిణాఫ్రికా పర్యటన కోసం ప్రకటించిన తుదిజట్టులో సీనియర్ పేసర్ ఇషాంత్​ శర్మతో పాటు రహానే, పుజారాలకు చోటు దక్కింది. అయితే వీరు కొంతకాలంగా సరైన ఫామ్​ కనబర్చడం లేదు. దీంతో వీరికి ఇదే చివరి సిరీస్ కావొచ్చని అందరూ భావిస్తున్నారు. కాగా, ఇదే విషయంపై స్పందించిన ఓ బీసీసీఐ అధికారి.. పరోక్షంగా వారిని హెచ్చరించాడు.

author img

By

Published : Dec 11, 2021, 2:15 PM IST

ishant sharma career, South Africa tour likely last series for Ishant Sharma, ఇషాంత్ శర్మ సౌతాఫ్రికా టూర్, ఇషాంత్ శర్మ లేటెస్ట్ న్యూస్
ishant sharma

Ishant Sharma last Assignment: త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. డిసెంబర్ 26 నుంచి ఈ జట్టుతో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం జట్టును ప్రకటించగా.. అందులో ఇషాంత్ శర్మ, రహానే, పుజారాలకు చోటిచ్చారు. వీరు కొంతకాలంగా సరైన ప్రదర్శన చేయకపోవడం వల్ల ఈ సిరీసే వీరికి చివరి అవకాశమని అంతా భావిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై స్పందించిన ఓ బీసీసఐ అధికారి.. వారి ముగ్గురికి ఇదే చివరి టూర్ కావచ్చొని పరోక్షంగా వెల్లడించాడు.

"వైస్ కెప్టెన్​గా రహానేను తొలగించడం ఇషాంత్​ను కూడా పరోక్షంగా హెచ్చరించడమే. జట్టులో సీనియర్ పేసర్​గా అతడు జట్టుకు మరింత గొప్పగా సేవలందించాలి. పుజారాకు కూడా ఇదే వర్తిస్తుంది. చాలా కాలంగా ఇతడు సరైన ప్రదర్శన చేయట్లేదు. అతడి నుంచి అద్భుత ఇన్నింగ్స్​లను యాజమాన్యం ఆశిస్తోంది. ఒకవేళ ఈ సిరీస్​లో వారు మంచి ప్రదర్శన చేస్తే వారి టెస్టు కెరీర్​ ముందుకు సాగుతుంది. కానీ ఇషాంత్ విషయంలో మాత్రం ఇదే చివరిది కావొచ్చు."

-బీసీసీఐ అధికారి

కాగా.. శార్దూల్ ఠాకూర్, సిరాజ్ లాంటి యువ పేసర్లు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టులో కీలక ఆటగాళ్లుగా మారుతున్నారు. ఇక వీరికి తోడు బుమ్రా, షమీ కూడా ఉండనే ఉన్నారు. ఇషాంత్.. జట్టులో సీనియర్ పేసర్​గా కొనసాగుతున్నాడు. కొంతకాలంగా ఇతడు టెస్టుల్లో మాత్రమే ఆడుతున్నాడు. 12 నెలల్లో 8 టెస్టులాడిన ఇషాంత్ 14 వికెట్లు మాత్రమే సాధించాడు. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్ ఇతడి కీలక పరీక్ష కానుంది.

ఇవీ చూడండి: పది నెలల నిరీక్షణ ఫలించింది.. రికార్డు దక్కింది!

Ishant Sharma last Assignment: త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. డిసెంబర్ 26 నుంచి ఈ జట్టుతో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం జట్టును ప్రకటించగా.. అందులో ఇషాంత్ శర్మ, రహానే, పుజారాలకు చోటిచ్చారు. వీరు కొంతకాలంగా సరైన ప్రదర్శన చేయకపోవడం వల్ల ఈ సిరీసే వీరికి చివరి అవకాశమని అంతా భావిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై స్పందించిన ఓ బీసీసఐ అధికారి.. వారి ముగ్గురికి ఇదే చివరి టూర్ కావచ్చొని పరోక్షంగా వెల్లడించాడు.

"వైస్ కెప్టెన్​గా రహానేను తొలగించడం ఇషాంత్​ను కూడా పరోక్షంగా హెచ్చరించడమే. జట్టులో సీనియర్ పేసర్​గా అతడు జట్టుకు మరింత గొప్పగా సేవలందించాలి. పుజారాకు కూడా ఇదే వర్తిస్తుంది. చాలా కాలంగా ఇతడు సరైన ప్రదర్శన చేయట్లేదు. అతడి నుంచి అద్భుత ఇన్నింగ్స్​లను యాజమాన్యం ఆశిస్తోంది. ఒకవేళ ఈ సిరీస్​లో వారు మంచి ప్రదర్శన చేస్తే వారి టెస్టు కెరీర్​ ముందుకు సాగుతుంది. కానీ ఇషాంత్ విషయంలో మాత్రం ఇదే చివరిది కావొచ్చు."

-బీసీసీఐ అధికారి

కాగా.. శార్దూల్ ఠాకూర్, సిరాజ్ లాంటి యువ పేసర్లు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టులో కీలక ఆటగాళ్లుగా మారుతున్నారు. ఇక వీరికి తోడు బుమ్రా, షమీ కూడా ఉండనే ఉన్నారు. ఇషాంత్.. జట్టులో సీనియర్ పేసర్​గా కొనసాగుతున్నాడు. కొంతకాలంగా ఇతడు టెస్టుల్లో మాత్రమే ఆడుతున్నాడు. 12 నెలల్లో 8 టెస్టులాడిన ఇషాంత్ 14 వికెట్లు మాత్రమే సాధించాడు. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్ ఇతడి కీలక పరీక్ష కానుంది.

ఇవీ చూడండి: పది నెలల నిరీక్షణ ఫలించింది.. రికార్డు దక్కింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.