ETV Bharat / sports

'నిన్న మన రోజు కాదు- మేము మళ్లీ పుంజుకుంటాం'- షమీ ఎమోషనల్ పోస్ట్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2023, 4:30 PM IST

Updated : Nov 20, 2023, 5:13 PM IST

Shami On India World Cup loss : ఆదివారం వరల్డ్​ కప్​ ఫైనల్​లో టీమ్ఇండియా ఓటమిపై భారత బౌలర్ మహ్మద్ షమీ స్పందించాడు. నిన్న మన రోజు కాదని.. తాము మళ్లీ పంజుకుంటామని భాగోద్వేగానికి గురయ్యాడు. ఇంకా ఏమన్నాడంటే?

Shami On India World Cup loss
Shami On India World Cup loss

Shami On India World Cup loss : టోర్నీ మొత్తంలో ఎదురులేకుండా దూసుకుపోయిన టీమ్ఇండియాకు ఫైనల్​లో నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఈ ఓటమిపై టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్​ షమీ స్పందించాడు. నిన్నటి రోజు మనది కాకుండా పోయిందని.. కానీ అంతకు రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ టీమ్​ఇండియా పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్​ చేశాడు. అందులో ప్రధాని నరేంద్ర మోదీ తనను ఓదార్చుతున్న ఫొటో జతచేసి.. "దురదృష్టవశాత్తూ.. నిన్న మన రోజు కాదు. టోర్నమెంట్ మొత్తంలో మన జట్టుకు, నాకు మద్దతుగా నిలిచినందుకు భారతీయులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి మా ఉత్సాహాన్ని పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. మేము తిరిగి పుంజుకుంటాము" అని రాసుకొచ్చాడు.

  • Unfortunately yesterday was not our day. I would like to thank all Indians for supporting our team and me throughout the tournament. Thankful to PM @narendramodi for specially coming to the dressing room and raising our spirits. We will bounce back! pic.twitter.com/Aev27mzni5

    — 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఫైనల్​ మ్యాచ్​ తర్వాత భారత జట్టు, టీమ్ఇండియా అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మైదానంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కళ్లలో నీళ్లు తిరిగాయి. బాధ తట్టుకోలేక బౌలర్​ మహ్మద్ సిరాజ్​ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలా ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్​ చేస్తూ.. అభిమానులు కూడా తమ బాధను వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తాము టీమ్ఇండియాతో ఉన్నామని మద్దతుగా నిలిచారు.

ఆల్​రౌండర్ హార్దిక్​ పాండ్య గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో షమీకి అవకాశం లభించింది. అలా లీగ్​ దశలో నాలుగు మ్యాచ్​లు ముగిశాక న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో షమీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ మ్యాచ్​లో ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు షమీ. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్​లో 4, శ్రీలంకపై 5, దక్షిణాఫ్రికాపై 2 వికెట్లు పడగొట్టాడు. ఇక సెమీఫైనల్​లో న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో ఏకంగా ఏడు వికెట్లు సాధించింది రికార్డు సృంటించాడు. ఆ తర్వాత ఆదివారం జరిగిన ఫైనల్​లో మరో వికెట్ తీసుకున్నాడు. దీంతో ఈ మోగా టోర్నీలో మొత్తం 24 వికెట్లు తీశాడు. దీంతో ఈ వరల్డ్​ కప్​లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా అవార్డు అందుకున్నాడు.

విరాట్ 50వ శతకం, మ్యాక్సీ డబుల్ సెంచరీ - ఈ టోర్నీలో స్పెషల్స్ ఇవే!

వరల్డ్​కప్ ట్రోఫీపై కాళ్లేసి ఫోజులు- మార్ష్​పై నెటిజన్లు ఫైర్ - ఇండియన్స్​ను చూసి నేర్చుకోవాలంటూ!

Shami On India World Cup loss : టోర్నీ మొత్తంలో ఎదురులేకుండా దూసుకుపోయిన టీమ్ఇండియాకు ఫైనల్​లో నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఈ ఓటమిపై టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్​ షమీ స్పందించాడు. నిన్నటి రోజు మనది కాకుండా పోయిందని.. కానీ అంతకు రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ టీమ్​ఇండియా పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్​ చేశాడు. అందులో ప్రధాని నరేంద్ర మోదీ తనను ఓదార్చుతున్న ఫొటో జతచేసి.. "దురదృష్టవశాత్తూ.. నిన్న మన రోజు కాదు. టోర్నమెంట్ మొత్తంలో మన జట్టుకు, నాకు మద్దతుగా నిలిచినందుకు భారతీయులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి మా ఉత్సాహాన్ని పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. మేము తిరిగి పుంజుకుంటాము" అని రాసుకొచ్చాడు.

  • Unfortunately yesterday was not our day. I would like to thank all Indians for supporting our team and me throughout the tournament. Thankful to PM @narendramodi for specially coming to the dressing room and raising our spirits. We will bounce back! pic.twitter.com/Aev27mzni5

    — 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఫైనల్​ మ్యాచ్​ తర్వాత భారత జట్టు, టీమ్ఇండియా అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మైదానంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కళ్లలో నీళ్లు తిరిగాయి. బాధ తట్టుకోలేక బౌలర్​ మహ్మద్ సిరాజ్​ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలా ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్​ చేస్తూ.. అభిమానులు కూడా తమ బాధను వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తాము టీమ్ఇండియాతో ఉన్నామని మద్దతుగా నిలిచారు.

ఆల్​రౌండర్ హార్దిక్​ పాండ్య గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో షమీకి అవకాశం లభించింది. అలా లీగ్​ దశలో నాలుగు మ్యాచ్​లు ముగిశాక న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో షమీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ మ్యాచ్​లో ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు షమీ. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్​లో 4, శ్రీలంకపై 5, దక్షిణాఫ్రికాపై 2 వికెట్లు పడగొట్టాడు. ఇక సెమీఫైనల్​లో న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో ఏకంగా ఏడు వికెట్లు సాధించింది రికార్డు సృంటించాడు. ఆ తర్వాత ఆదివారం జరిగిన ఫైనల్​లో మరో వికెట్ తీసుకున్నాడు. దీంతో ఈ మోగా టోర్నీలో మొత్తం 24 వికెట్లు తీశాడు. దీంతో ఈ వరల్డ్​ కప్​లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా అవార్డు అందుకున్నాడు.

విరాట్ 50వ శతకం, మ్యాక్సీ డబుల్ సెంచరీ - ఈ టోర్నీలో స్పెషల్స్ ఇవే!

వరల్డ్​కప్ ట్రోఫీపై కాళ్లేసి ఫోజులు- మార్ష్​పై నెటిజన్లు ఫైర్ - ఇండియన్స్​ను చూసి నేర్చుకోవాలంటూ!

Last Updated : Nov 20, 2023, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.