ETV Bharat / jagte-raho

ఉద్యోగాల పేరుతో మోసం.. ముగ్గురు సీఐఎస్​ఎఫ్​ కానిస్టేబుళ్లు అరెస్ట్

author img

By

Published : Nov 17, 2020, 8:31 PM IST

Updated : Nov 17, 2020, 8:37 PM IST

సీఐఎస్​ఎఫ్​లో పని చేస్తున్న ఆ ముగ్గురు కానిస్టేబుళ్లు..ముఠాగా అవతారమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేయడం అలవాటు చేసుకున్నారు. ఇలా ఒక్కరిద్దరూ కాదు ఏకంగా 38మందికిపైగా బురిడీ కొట్టించారు. నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయల వసూళ్లు చేస్తున్న ఈ ముఠా...విశాఖ పోలీసులకు చిక్కింది. వీరిని మనోజ్ (పశ్చిమగోదావరి), వెంకటరమణ(విజయనగరం), హరిబాబు (శ్రీకాకుళం)లుగా గుర్తించారు.

three cisf constibels arrested
three cisf constibels arrested

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల వద్ద నుంచి లక్షలు కాజేస్తున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ముగ్గురు కూడా సీఐఎస్​ఎఫ్​ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... విశాఖకు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి ప్రభుత్వ ఉద్యోగం పేరుతో పలు దఫాలుగా 9 లక్షల రూపాయలను వసూలు చేశారు. అయితే ఈ బాధితుడికి విశాఖ స్టీల్ ప్లాంట్​లో స్వతహాగా ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో ఈ ముగ్గురి కానిస్టేబుళ్ల వ్యవహారంపై సీఐఎస్​ఎఫ్​ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. శాఖ సంబంధిత విచారణ చేపట్టగా ముగ్గురు కానిస్టేబుళ్లను సీఐఎస్​ఎఫ్​ అధికారులు సస్పెండ్ చేశారని డీసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు.

ఈ ముఠా చేతిలో 38 మంది వరకు మోసపోయినట్లుగా ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. మధ్యప్రదేశ్​లో నకిలీ పరీక్ష నిర్వహించి...కొందరికీ నియామక పత్రాలను కూడా ఇచ్చినట్లు తెలిసిందని వివరించారు. ముగ్గురు నిందితులైన మనోజ్, వెంకటరమణ, హరిబాబు... హైదరాబాద్​లోని ఓ జాబ్ కోచింగ్ సెంటర్లలో పరిచయమైన వారందర్నీ మోసగించిట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. ఇలాంటి ముఠాల పట్ల నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండాలని డీసీపీ రస్తోగి హెచ్చరించారు. కష్టపడి చదవితేనే ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల వద్ద నుంచి లక్షలు కాజేస్తున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ముగ్గురు కూడా సీఐఎస్​ఎఫ్​ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... విశాఖకు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి ప్రభుత్వ ఉద్యోగం పేరుతో పలు దఫాలుగా 9 లక్షల రూపాయలను వసూలు చేశారు. అయితే ఈ బాధితుడికి విశాఖ స్టీల్ ప్లాంట్​లో స్వతహాగా ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో ఈ ముగ్గురి కానిస్టేబుళ్ల వ్యవహారంపై సీఐఎస్​ఎఫ్​ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. శాఖ సంబంధిత విచారణ చేపట్టగా ముగ్గురు కానిస్టేబుళ్లను సీఐఎస్​ఎఫ్​ అధికారులు సస్పెండ్ చేశారని డీసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు.

ఈ ముఠా చేతిలో 38 మంది వరకు మోసపోయినట్లుగా ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. మధ్యప్రదేశ్​లో నకిలీ పరీక్ష నిర్వహించి...కొందరికీ నియామక పత్రాలను కూడా ఇచ్చినట్లు తెలిసిందని వివరించారు. ముగ్గురు నిందితులైన మనోజ్, వెంకటరమణ, హరిబాబు... హైదరాబాద్​లోని ఓ జాబ్ కోచింగ్ సెంటర్లలో పరిచయమైన వారందర్నీ మోసగించిట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. ఇలాంటి ముఠాల పట్ల నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండాలని డీసీపీ రస్తోగి హెచ్చరించారు. కష్టపడి చదవితేనే ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

లైవ్ వీడియో: డబ్బులు ఇవ్వలేదని వ్యక్తిని చితకబాదిన క్రికెట్ బుకీలు

Last Updated : Nov 17, 2020, 8:37 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.