ETV Bharat / jagte-raho

నయీం తమ్ముళ్లు తెలుసా.. ఇలా బెదిరిస్తూ అరెస్టయ్యారు!

author img

By

Published : Dec 22, 2020, 12:56 PM IST

గ్యాంగ్​స్టర్​ నయీం అంతమైనా.. అతని పేరుతో కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. నయీం తమ్ముడి పేరుతో ఓ వ్యక్తిని ఫోన్​ చేసి బెదిరించగా ఇద్దరిని తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, రిమాండ్​కు తరలించారు.

arrested
arrested

గ్యాంగ్​స్టర్ నయీం అనుచరులమని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను తెలంగాణ.. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొరికిన చరవాణి ద్వారా భాస్కర్​ అనే వ్యక్తికి ఫోన్​ చేసి నయీం తమ్ముడినంటూ పరిచయం చేసుకుని డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు.

బాధితుడు బీబీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. యాదగిరిగుట్టకు చెందిన నవీన్​, గణేశ్​లుగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఎస్సై రాఘవేందర్​ తెలిపారు. ఎవరికైనా ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి ప్రజలకు సూచించారు.

గ్యాంగ్​స్టర్ నయీం అనుచరులమని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను తెలంగాణ.. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొరికిన చరవాణి ద్వారా భాస్కర్​ అనే వ్యక్తికి ఫోన్​ చేసి నయీం తమ్ముడినంటూ పరిచయం చేసుకుని డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు.

బాధితుడు బీబీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. యాదగిరిగుట్టకు చెందిన నవీన్​, గణేశ్​లుగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఎస్సై రాఘవేందర్​ తెలిపారు. ఎవరికైనా ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి ప్రజలకు సూచించారు.

ఇదీ చూడండి: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. 10 రోజులు అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.