ETV Bharat / jagte-raho

పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Sep 22, 2020, 11:16 AM IST

కదిరిలో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. భార్య, భర్తల మధ్య చోటుచేసుకున్న చిన్నపాటి ఘర్షణే ఈ ఘటనకు కారణమైంది.

kadiri
కదరిలో దారుణం

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో నివాసం ఉంటున్న గోపీనాథ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోపీనాథ్, ఆయన భార్య ఇంటి అద్దె చెల్లింపు విషయంలో గొడవ పడ్డారు. మద్యానికి అలవాటు పడిన గోపి తరచూ భార్యను వేధించేవాడు. వేధింపులు భరించలేని భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది.

ఈ విషయంలో పరస్పరం వాదించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చిన గోపి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు గుర్తించి మంటలు ఆర్పివేసి... చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు.

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో నివాసం ఉంటున్న గోపీనాథ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోపీనాథ్, ఆయన భార్య ఇంటి అద్దె చెల్లింపు విషయంలో గొడవ పడ్డారు. మద్యానికి అలవాటు పడిన గోపి తరచూ భార్యను వేధించేవాడు. వేధింపులు భరించలేని భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది.

ఈ విషయంలో పరస్పరం వాదించుకుని ఇంటి నుంచి బయటకు వచ్చిన గోపి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు గుర్తించి మంటలు ఆర్పివేసి... చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు.

ఇదీ చదవండి:

బాకీ తీర్చమన్నందుకు... అవమానంగా భావించి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.