ETV Bharat / international

ఉక్రెయిన్​లో వరుస పేలుళ్లు... ప్రభుత్వ సైట్లపై సైబర్ దాడులు

author img

By

Published : Feb 24, 2022, 10:21 AM IST

Russia Ukraine war: ఉక్రెయిన్​లోని అనేక నగరాలపై దాడులు జరుగుతున్నాయి. రాజధాని కీవ్ సహా కీలక నగరాల్లో పేలుళ్లు సంభవించాయి. అదే సమయంలోఉక్రెయిన్​ పార్లమెంట్, ప్రభుత్వ ఏజెన్సీల వెబ్​సైట్లపై సైబర్ దాడులు జరిగాయి.

russia ukraine war
russia ukraine war

Russia Ukraine war: ఉక్రెయిన్​పై సైనిక చర్యకు దిగుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన వెంటనే రాజధాని కీవ్​ సహా అనేక నగరాల్లో పేలుళ్లు సంభవించాయి. తూర్పున ఉన్న సముద్ర తీర నగరమైన మారియూపోల్​లోనూ శక్తిమంతమైన పేలుళ్లు జరిగాయి. దేశంలోని అతిపెద్ద నగరాలైన ఒడేసా, ఖార్కీవ్​లలోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. యుద్ధ ప్రకటన నేపథ్యంలో రష్యా దళాలు ఉక్రెయిన్​పై విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది.

russia ukraine war powerful explosions
పేలుళ్ల దృశ్యాలు
russia ukraine war powerful explosions
పేలుళ్లు...

Powerful explosions in Ukraine

Ukraine cyberattacks: మరోవైపు, ఉక్రెయిన్ పార్లమెంట్ సహా ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకింగ్ వెబ్​సైట్లు సైబర్ దాడులకు గురయ్యాయి. దీంతో సేవలు నిలిచిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. విధ్వంసకర మాల్​వేర్​ను వందలాది కంప్యూటర్లలోకి చొప్పించారని వెల్లడించారు. లాత్వియా, లిథువేనియా దేశాల్లోని కంప్యూటర్లలోనూ వైరస్ దాడులు జరిగాయని చెప్పారు. ఓవైపు సైనిక చర్యకు పాల్పడుతున్న రష్యానే.. సైబర్ దాడులు చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉక్రెయిన్​పై సైబర్ దాడులు గతకొద్దిరోజుల నుంచి జరుగుతున్నాయి. డేటాను పూర్తిగా తుడిచిపెట్టే సామర్థ్యం ఉన్న మాల్​వేర్​ను తాము బుధవారం గుర్తించినట్లు ఈఎస్ఈటీ రీసెర్చ్ ల్యాబ్ తెలిపింది. దేశంలోని వందలాది కంప్యూటర్లలో ఇది బయటపడినట్లు వెల్లడించింది. ఎన్ని నెట్​వర్క్​లపై దీని ప్రభావం ఉందో ఇంకా తెలియలేదని పేర్కొంది. పెద్ద సంస్థలే లక్ష్యంగా దాడులు జరిగాయని వివరించింది.

ఇదీ చదవండి: ఉక్రెయిన్​పై యుద్ధం ప్రకటించిన పుతిన్.. కీవ్​లో పేలుడు

Russia Ukraine war: ఉక్రెయిన్​పై సైనిక చర్యకు దిగుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన వెంటనే రాజధాని కీవ్​ సహా అనేక నగరాల్లో పేలుళ్లు సంభవించాయి. తూర్పున ఉన్న సముద్ర తీర నగరమైన మారియూపోల్​లోనూ శక్తిమంతమైన పేలుళ్లు జరిగాయి. దేశంలోని అతిపెద్ద నగరాలైన ఒడేసా, ఖార్కీవ్​లలోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. యుద్ధ ప్రకటన నేపథ్యంలో రష్యా దళాలు ఉక్రెయిన్​పై విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది.

russia ukraine war powerful explosions
పేలుళ్ల దృశ్యాలు
russia ukraine war powerful explosions
పేలుళ్లు...

Powerful explosions in Ukraine

Ukraine cyberattacks: మరోవైపు, ఉక్రెయిన్ పార్లమెంట్ సహా ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకింగ్ వెబ్​సైట్లు సైబర్ దాడులకు గురయ్యాయి. దీంతో సేవలు నిలిచిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. విధ్వంసకర మాల్​వేర్​ను వందలాది కంప్యూటర్లలోకి చొప్పించారని వెల్లడించారు. లాత్వియా, లిథువేనియా దేశాల్లోని కంప్యూటర్లలోనూ వైరస్ దాడులు జరిగాయని చెప్పారు. ఓవైపు సైనిక చర్యకు పాల్పడుతున్న రష్యానే.. సైబర్ దాడులు చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉక్రెయిన్​పై సైబర్ దాడులు గతకొద్దిరోజుల నుంచి జరుగుతున్నాయి. డేటాను పూర్తిగా తుడిచిపెట్టే సామర్థ్యం ఉన్న మాల్​వేర్​ను తాము బుధవారం గుర్తించినట్లు ఈఎస్ఈటీ రీసెర్చ్ ల్యాబ్ తెలిపింది. దేశంలోని వందలాది కంప్యూటర్లలో ఇది బయటపడినట్లు వెల్లడించింది. ఎన్ని నెట్​వర్క్​లపై దీని ప్రభావం ఉందో ఇంకా తెలియలేదని పేర్కొంది. పెద్ద సంస్థలే లక్ష్యంగా దాడులు జరిగాయని వివరించింది.

ఇదీ చదవండి: ఉక్రెయిన్​పై యుద్ధం ప్రకటించిన పుతిన్.. కీవ్​లో పేలుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.