ETV Bharat / international

పక్షవాత స్కాన్లతో కరోనాను గుర్తించొచ్చు!

కరోనా గుర్తించేందుకు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు బ్రిటన్​ శాస్త్రవేత్తలు. పక్షవాతాన్ని గుర్తించేందుకు వాడే స్కాన్లతో కరోనాను కనిపెట్టే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో మెదడుకు గాయమైనట్లు అనుమానమున్న వారిలో కొవిడ్ బాధితులను త్వరగా గుర్తించి, వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు.

author img

By

Published : Sep 19, 2020, 9:49 AM IST

CT Scans of Patients with 2019 Novel Coronavirus
పక్షవాత స్కాన్లతో కరోనాను గుర్తించొచ్చు!

పక్షవాతాన్ని గుర్తించేందుకు అత్యవసరంగా నిర్వహించే స్కాన్లతో కొవిడ్​-19ను కూడా గుర్తించే అవకాశం ఉందని బ్రిటన్​ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం తేల్చింది. దీంతో మెదడుకు గాయమైనట్లు అనుమానమున్న వారిలో కొవిడ్ బాధితులను త్వరగా గుర్తించి, వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి వీలవుతుందని వివరించింది. లండన్​లోని హైపర్​ అక్యూట్​ స్ట్రోక్​ యూనిట్లలో 225 మంది రోగుల తల, మెడ భాగాల్లోని రక్త నాళాలకు నిర్వహించిన అత్యవసర కంప్యూటెడ్​ టొమోగ్రఫీ (సిటీ) స్కాన్​ను పరిశీలించారు. ఇందులో ఊపిరితిత్తుల్లోని పైభాగాలూ కనిపించాయి. అక్కడ గ్రౌండ్​ గ్లాస్​ ఒపేసిఫికేషన్​ తీరులో జరిగిన మార్పుల ఆధారంగా కొవిడ్​ను గుర్తించొచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. వాటి ద్వారా కొవిడ్​ మరణాలనూ ముందుగానే అంచనా వేయవచ్చని తెలిపారు.

ప్రస్తుతం కరోనా వైరస్​ను గుర్తించటానికి నిర్వహిస్తున్న ఆర్​టీ పీసీఆర్​ పరీక్షకు చాలా సమయం పట్టడంతో పాటు కొన్నిసార్లు ఫలితాల్లో తేడాలూ వస్తున్న నేపథ్యంలో ఈ పరిశోధనకు ప్రాముఖ్యత ఏర్పడిందని పేర్కొన్నారు. ఇలాంటి రోగులు మాస్కులు ధరించడం కష్టమని, అందువల్ల వారికి కొవిడ్​-19 కూడా సోకినట్లు ముందే తెలిస్తే ఆసుపత్రి సిబ్బంది మరింత జాగ్రత్తగా ఉండటానికి వీలవుతుందని తెలిపారు.

పక్షవాతాన్ని గుర్తించేందుకు అత్యవసరంగా నిర్వహించే స్కాన్లతో కొవిడ్​-19ను కూడా గుర్తించే అవకాశం ఉందని బ్రిటన్​ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం తేల్చింది. దీంతో మెదడుకు గాయమైనట్లు అనుమానమున్న వారిలో కొవిడ్ బాధితులను త్వరగా గుర్తించి, వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి వీలవుతుందని వివరించింది. లండన్​లోని హైపర్​ అక్యూట్​ స్ట్రోక్​ యూనిట్లలో 225 మంది రోగుల తల, మెడ భాగాల్లోని రక్త నాళాలకు నిర్వహించిన అత్యవసర కంప్యూటెడ్​ టొమోగ్రఫీ (సిటీ) స్కాన్​ను పరిశీలించారు. ఇందులో ఊపిరితిత్తుల్లోని పైభాగాలూ కనిపించాయి. అక్కడ గ్రౌండ్​ గ్లాస్​ ఒపేసిఫికేషన్​ తీరులో జరిగిన మార్పుల ఆధారంగా కొవిడ్​ను గుర్తించొచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. వాటి ద్వారా కొవిడ్​ మరణాలనూ ముందుగానే అంచనా వేయవచ్చని తెలిపారు.

ప్రస్తుతం కరోనా వైరస్​ను గుర్తించటానికి నిర్వహిస్తున్న ఆర్​టీ పీసీఆర్​ పరీక్షకు చాలా సమయం పట్టడంతో పాటు కొన్నిసార్లు ఫలితాల్లో తేడాలూ వస్తున్న నేపథ్యంలో ఈ పరిశోధనకు ప్రాముఖ్యత ఏర్పడిందని పేర్కొన్నారు. ఇలాంటి రోగులు మాస్కులు ధరించడం కష్టమని, అందువల్ల వారికి కొవిడ్​-19 కూడా సోకినట్లు ముందే తెలిస్తే ఆసుపత్రి సిబ్బంది మరింత జాగ్రత్తగా ఉండటానికి వీలవుతుందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.