ETV Bharat / international

ప్రాథమిక హక్కులను మహిళలు కోల్పోయారు: కోఫీ

దశాబ్దాల వివాదానికి ముగింపు పలికే దిశగా అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య త్వరలో చర్చలు జరగనున్నాయి. ప్రభుత్వం తరఫున పార్లమెంటు మహిళ సభ్యురాలు ఫౌజియా కోఫీ పాల్గొననుండటం సర్వత్రా ఆసక్తి ఆసక్తి నెలకొంది. ఈ చర్చల్లో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారో ఆమె మాటాల్లోనే తెలుసుకుందాం..

author img

By

Published : Sep 23, 2020, 4:54 AM IST

Fawzia Koofi
ఫౌజియా కోఫీ

అఫ్గాన్‌ ప్రభుత్వానికి తాలిబన్లకు మధ్య త్వరలో జరగనున్న చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాలిబన్లతో జరిగే చర్చల్లో తొలిసారి ఒక మహిళ పాల్గొనటమే ఇందుకు కారణం. అఫ్గానిస్థాన్‌ పార్లమెంట్‌ సభ్యురాలు ఫౌజియా కోఫీ తాలిబన్లతో చర్చించి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేయనున్నారు.

తాలిబన్లతో జరపబోయే చర్చల్లో ఆమె ఎలాంటి అంశాలను ప్రస్తావించనున్నారు? యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన మహిళలకు ఆమె ఎలాంటి భరోసాను అందిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. వీటిని తెలుసుకునేందుకు ఫౌజియా కోఫీతో ఈటీవీ భారత్‌ ముఖాముఖి నిర్వహించింది.

ఫౌజియా కోఫీతో ముఖాముఖి

ప్రశ్న: అఫ్గానిస్థాన్‌ రాజకీయ ప్రక్రియలో మిమ్మల్ని ఎప్పుడూ సమానంగా అంగీకరించని తాలిబన్లతో మీరు చర్చల కోసం వేదిక పంచుకోబోతున్నారని విన్నాను. ఈ పురోగతిపై మీ అభిప్రాయం ఏంటి?

ఫౌజియా: నేను అఫ్గానిస్థాన్‌ మహిళగా ఉన్నాను, నేను తాలిబన్ ప్రభుత్వానికి బాధితురాలిని కూడా. విద్య, ఆరోగ్యం, సామాజిక, రాజకీయ భాగస్వామ్యంతో సహా ప్రాథమిక హక్కులను మేము కోల్పోయాము. మహిళలు మరోసారి యుద్ధానికి బలికావడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మహిళలు చర్చల్లో భాగస్వామ్యం కావటం చాలా ముఖ్యం. ఈ చర్చలలో పాల్గొనడం ద్వారా ప్రాథమికంగా మేము నిషేధాలను విచ్ఛిన్నం చేస్తాం. ఎందుకంటే ఇవి తాలిబన్ల విషయంలోనే కాదు అఫ్గానిస్థాన్‌ చరిత్రలోనే ఉన్నాయి. ఇప్పటివరకూ శాంతి చర్చలన్నీ పురుషులు మధ్య మాత్రమే జరిగాయి. ఇప్పుడు చారిత్రక సమస్యను పరిష్కార వేదికలో నేను ఉన్నందుకు గొప్పగా భావిస్తున్నాను, ఇది నాపై ఎంతో బాధ్యతను పెంచింది.

ప్రశ్న: పార్లమెంటులో, వెలుపల మహిళలకు సమాన హక్కులను తీసుకువస్తారన్న దానిపై మీరు ఎంత వరకు ఆశాజనకంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో మహిళల హక్కుల కోసం, ఆడపిల్లల విద్య హక్కులు, ఆడపిల్లలు-మహిళల అభివృద్ధి ఎలా ఉండనుంది?

ఫౌజియా : ఒక నిర్దిష్ట దృష్టి కోణం ఆధిపత్యం వహించే దేశం అఫ్గానిస్థాన్‌ కాదు. అది అతివాదమైనా కావచ్చు, లేదా ఉదారవాదమైనా కావచ్చు. మితవాద దృక్పథాన్ని మనం అనుసరించాలి. ఇస్లాం చెప్పే మితవాద నిర్వచనాన్ని తీసుకోవాలి. మన చుట్టుపక్కల వారితో శాంతియుతంగా జీవించగలిగే అఫ్గానిస్థాన్‌ కోసం మేము పోరాడుతున్నాము. స్త్రీ పురుష బేధాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా సూచించే అఫ్గానిస్థాన్‌ మాకు కావాలి. విద్య అనేది అఫ్గానిస్థాన్‌ మహిళలకే కాకుండా పురుషులకు కూడా ఎంతో ముఖ్యం. విద్య లేకుండా ఎటువంటి పురోగతిని సాధించలేము. మేము దోహాలో ఉన్నాము, అనుసరించాల్సిన నియమాలు విధానాలు ఇతర సాంకేతిక సమస్యల గురించి చర్చిస్తున్నాం, ఎందుకంటే మేము పునాదిని సరిగ్గా వేయాలి. చర్చలకు సరైన పునాది వేసినప్పుడే చర్చలు సులభతరం అవుతాయి. చర్చల మెుదటి దశలో మహిళల హక్కులను చర్చించబోం. ఎందుకంటే సున్నితమైన సమస్యలలో ఇదీ ఒకటి. ప్రతి ఒక్కరూ శాంతి సామరస్యాలతో జీవించేందుకు అనువైన ప్రాంతాన్ని సృష్టించాలనుకుంటున్నాము.

ప్రశ్న: ప్రారంభంలో తాలిబన్ అన్ని రాజకీయ పార్టీలకు అఫ్గానిస్థాన్‌లో ఇస్లామిక్ చట్టం కావాలని స్పష్టం చేసింది. ఇతర పార్టీలు దానిపై ఎలా స్పందిస్తున్నాయి. మీరు దేశాన్ని కొత్తగా ఎలా చూడాలనుకుంటున్నారు?

ఫౌజియా: అఫ్గానిస్థాన్‌ ముస్లిం దేశం. ఇస్లాంకు విరుద్ధంగా ఉంటే అఫ్గానిస్థాన్‌లో ఏ చట్టమూ అమలుకాదని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. మైనారిటీలు ఇతర మత సమూహాలకు చెందిన వారు, వారి విశ్వాసాన్ని పాటించే స్వేచ్ఛ ఉందని రాజ్యాంగం హామీ ఇస్తోంది. ఒక ప్రత్యేకమైన ఆలోచనను మరొకదానిపై రుద్దడం సరికాదు, మేము అఫ్గానిస్థాన్‌ కోసం పోరాడుతున్నాము, ప్రతి ఒక్కరికి లింగ బేధాలు, రాజకీయాలతో సంబంధం లేకుండా ఓటు వేయడానికి అవకాశం ఉండాలి. శాంతి చర్చలు ముగింపులో దీన్ని మేము సాధించగలమన్న విశ్వాసం ఉంది.

ప్రశ్న: మీరు సంఘటితత్త్వం గురించి ప్రస్తావించారు, కాని అఫ్గానిస్థాన్‌లో ముస్లిమేతరులను హింసించడం గురించి నివేదికలు ఉన్నాయి. సిక్కు వర్గానికి చెందిన కొందరు కాబూల్, జలాలాబాద్ ఇతర ప్రాంతాలలో హింసకు గురయ్యారు. మతపరమైన మైనారిటీలకు తమ విశ్వాసాలను పాటించేందుకు అఫ్గానిస్థాన్‌లో స్వేచ్ఛ ఉంటుందన్న దానిపై మీ అభిప్రాయం ఏంటి?

ఫౌజియా: నేను అర్థం చేసుకున్నాను, మతపరమైన మైనారిటీలపై దాడులు జరిగాయి. మతపరమైన మైనారిటీలపై దాడులు జరగటానికి కారణం యుద్ధాలు. మైనారిటీల విషయంలో మేము గర్విస్తున్నాము. చారిత్రక కాలం నుంచి వారు మాతో కలిసి జీవనం సాగిస్తున్నారు. సమాజంలో వివక్ష లేదు. కానీ, రాజకీయంగా, సైనిక ఉగ్రవాద సంస్థల పరంగా వారిపై ఇటీవల దాడులు జరిగాయి. వారు అఫ్గానిస్థాన్‌ నుంచి పారిపోతున్నందుకు మమ్మల్ని క్షమించండి.

ప్రశ్న: అఫ్గానిస్థాన్‌ అభివృద్ధి కార్యక్రమాలలో భారత్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. తాలిబన్లతో చర్చల్లో భాగంగా భారత్‌తో ఒప్పందాన్ని మీరు ఎలా చూస్తారు?

ఫౌజియా: విద్యా రంగంతో సహా అనేక రంగాలలో భారత్ పెట్టుబడులు పెట్టిందని నాకు తెలుసు, అఫ్గానిస్థాన్‌కు భారత్‌ అందించిన మద్దతుకు అఫ్గాన్‌ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మేము భారతదేశాన్ని వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తాం.

ప్రశ్న: మీది, తాలిబన్ల ప్రధాన డిమాండ్లు ఏంటి?

ఫౌజియా: ప్రస్తుతం మేము ప్రాథమికంగా అనుసరించాల్సిన నియమాలు, విధానాలు, ప్రవర్తనా నియమావళి గురించి చర్చిస్తున్నాము.

ఇదీ చూడండి: అమెరికా సమక్షంలో అఫ్గాన్​, తాలిబన్ల శాంతి చర్చలు

అఫ్గాన్‌ ప్రభుత్వానికి తాలిబన్లకు మధ్య త్వరలో జరగనున్న చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాలిబన్లతో జరిగే చర్చల్లో తొలిసారి ఒక మహిళ పాల్గొనటమే ఇందుకు కారణం. అఫ్గానిస్థాన్‌ పార్లమెంట్‌ సభ్యురాలు ఫౌజియా కోఫీ తాలిబన్లతో చర్చించి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేయనున్నారు.

తాలిబన్లతో జరపబోయే చర్చల్లో ఆమె ఎలాంటి అంశాలను ప్రస్తావించనున్నారు? యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన మహిళలకు ఆమె ఎలాంటి భరోసాను అందిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. వీటిని తెలుసుకునేందుకు ఫౌజియా కోఫీతో ఈటీవీ భారత్‌ ముఖాముఖి నిర్వహించింది.

ఫౌజియా కోఫీతో ముఖాముఖి

ప్రశ్న: అఫ్గానిస్థాన్‌ రాజకీయ ప్రక్రియలో మిమ్మల్ని ఎప్పుడూ సమానంగా అంగీకరించని తాలిబన్లతో మీరు చర్చల కోసం వేదిక పంచుకోబోతున్నారని విన్నాను. ఈ పురోగతిపై మీ అభిప్రాయం ఏంటి?

ఫౌజియా: నేను అఫ్గానిస్థాన్‌ మహిళగా ఉన్నాను, నేను తాలిబన్ ప్రభుత్వానికి బాధితురాలిని కూడా. విద్య, ఆరోగ్యం, సామాజిక, రాజకీయ భాగస్వామ్యంతో సహా ప్రాథమిక హక్కులను మేము కోల్పోయాము. మహిళలు మరోసారి యుద్ధానికి బలికావడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మహిళలు చర్చల్లో భాగస్వామ్యం కావటం చాలా ముఖ్యం. ఈ చర్చలలో పాల్గొనడం ద్వారా ప్రాథమికంగా మేము నిషేధాలను విచ్ఛిన్నం చేస్తాం. ఎందుకంటే ఇవి తాలిబన్ల విషయంలోనే కాదు అఫ్గానిస్థాన్‌ చరిత్రలోనే ఉన్నాయి. ఇప్పటివరకూ శాంతి చర్చలన్నీ పురుషులు మధ్య మాత్రమే జరిగాయి. ఇప్పుడు చారిత్రక సమస్యను పరిష్కార వేదికలో నేను ఉన్నందుకు గొప్పగా భావిస్తున్నాను, ఇది నాపై ఎంతో బాధ్యతను పెంచింది.

ప్రశ్న: పార్లమెంటులో, వెలుపల మహిళలకు సమాన హక్కులను తీసుకువస్తారన్న దానిపై మీరు ఎంత వరకు ఆశాజనకంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో మహిళల హక్కుల కోసం, ఆడపిల్లల విద్య హక్కులు, ఆడపిల్లలు-మహిళల అభివృద్ధి ఎలా ఉండనుంది?

ఫౌజియా : ఒక నిర్దిష్ట దృష్టి కోణం ఆధిపత్యం వహించే దేశం అఫ్గానిస్థాన్‌ కాదు. అది అతివాదమైనా కావచ్చు, లేదా ఉదారవాదమైనా కావచ్చు. మితవాద దృక్పథాన్ని మనం అనుసరించాలి. ఇస్లాం చెప్పే మితవాద నిర్వచనాన్ని తీసుకోవాలి. మన చుట్టుపక్కల వారితో శాంతియుతంగా జీవించగలిగే అఫ్గానిస్థాన్‌ కోసం మేము పోరాడుతున్నాము. స్త్రీ పురుష బేధాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా సూచించే అఫ్గానిస్థాన్‌ మాకు కావాలి. విద్య అనేది అఫ్గానిస్థాన్‌ మహిళలకే కాకుండా పురుషులకు కూడా ఎంతో ముఖ్యం. విద్య లేకుండా ఎటువంటి పురోగతిని సాధించలేము. మేము దోహాలో ఉన్నాము, అనుసరించాల్సిన నియమాలు విధానాలు ఇతర సాంకేతిక సమస్యల గురించి చర్చిస్తున్నాం, ఎందుకంటే మేము పునాదిని సరిగ్గా వేయాలి. చర్చలకు సరైన పునాది వేసినప్పుడే చర్చలు సులభతరం అవుతాయి. చర్చల మెుదటి దశలో మహిళల హక్కులను చర్చించబోం. ఎందుకంటే సున్నితమైన సమస్యలలో ఇదీ ఒకటి. ప్రతి ఒక్కరూ శాంతి సామరస్యాలతో జీవించేందుకు అనువైన ప్రాంతాన్ని సృష్టించాలనుకుంటున్నాము.

ప్రశ్న: ప్రారంభంలో తాలిబన్ అన్ని రాజకీయ పార్టీలకు అఫ్గానిస్థాన్‌లో ఇస్లామిక్ చట్టం కావాలని స్పష్టం చేసింది. ఇతర పార్టీలు దానిపై ఎలా స్పందిస్తున్నాయి. మీరు దేశాన్ని కొత్తగా ఎలా చూడాలనుకుంటున్నారు?

ఫౌజియా: అఫ్గానిస్థాన్‌ ముస్లిం దేశం. ఇస్లాంకు విరుద్ధంగా ఉంటే అఫ్గానిస్థాన్‌లో ఏ చట్టమూ అమలుకాదని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. మైనారిటీలు ఇతర మత సమూహాలకు చెందిన వారు, వారి విశ్వాసాన్ని పాటించే స్వేచ్ఛ ఉందని రాజ్యాంగం హామీ ఇస్తోంది. ఒక ప్రత్యేకమైన ఆలోచనను మరొకదానిపై రుద్దడం సరికాదు, మేము అఫ్గానిస్థాన్‌ కోసం పోరాడుతున్నాము, ప్రతి ఒక్కరికి లింగ బేధాలు, రాజకీయాలతో సంబంధం లేకుండా ఓటు వేయడానికి అవకాశం ఉండాలి. శాంతి చర్చలు ముగింపులో దీన్ని మేము సాధించగలమన్న విశ్వాసం ఉంది.

ప్రశ్న: మీరు సంఘటితత్త్వం గురించి ప్రస్తావించారు, కాని అఫ్గానిస్థాన్‌లో ముస్లిమేతరులను హింసించడం గురించి నివేదికలు ఉన్నాయి. సిక్కు వర్గానికి చెందిన కొందరు కాబూల్, జలాలాబాద్ ఇతర ప్రాంతాలలో హింసకు గురయ్యారు. మతపరమైన మైనారిటీలకు తమ విశ్వాసాలను పాటించేందుకు అఫ్గానిస్థాన్‌లో స్వేచ్ఛ ఉంటుందన్న దానిపై మీ అభిప్రాయం ఏంటి?

ఫౌజియా: నేను అర్థం చేసుకున్నాను, మతపరమైన మైనారిటీలపై దాడులు జరిగాయి. మతపరమైన మైనారిటీలపై దాడులు జరగటానికి కారణం యుద్ధాలు. మైనారిటీల విషయంలో మేము గర్విస్తున్నాము. చారిత్రక కాలం నుంచి వారు మాతో కలిసి జీవనం సాగిస్తున్నారు. సమాజంలో వివక్ష లేదు. కానీ, రాజకీయంగా, సైనిక ఉగ్రవాద సంస్థల పరంగా వారిపై ఇటీవల దాడులు జరిగాయి. వారు అఫ్గానిస్థాన్‌ నుంచి పారిపోతున్నందుకు మమ్మల్ని క్షమించండి.

ప్రశ్న: అఫ్గానిస్థాన్‌ అభివృద్ధి కార్యక్రమాలలో భారత్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. తాలిబన్లతో చర్చల్లో భాగంగా భారత్‌తో ఒప్పందాన్ని మీరు ఎలా చూస్తారు?

ఫౌజియా: విద్యా రంగంతో సహా అనేక రంగాలలో భారత్ పెట్టుబడులు పెట్టిందని నాకు తెలుసు, అఫ్గానిస్థాన్‌కు భారత్‌ అందించిన మద్దతుకు అఫ్గాన్‌ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మేము భారతదేశాన్ని వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తాం.

ప్రశ్న: మీది, తాలిబన్ల ప్రధాన డిమాండ్లు ఏంటి?

ఫౌజియా: ప్రస్తుతం మేము ప్రాథమికంగా అనుసరించాల్సిన నియమాలు, విధానాలు, ప్రవర్తనా నియమావళి గురించి చర్చిస్తున్నాము.

ఇదీ చూడండి: అమెరికా సమక్షంలో అఫ్గాన్​, తాలిబన్ల శాంతి చర్చలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.