ETV Bharat / international

'నిరసనల పేరుతో జాతీయ హీరోలను కించపరిచారు​'

author img

By

Published : Jul 4, 2020, 12:24 PM IST

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మౌంట్ రష్​మోర్​ వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ సందర్భంగా జాతి వివక్ష నిరసనలపై విరుచుకుపడ్డారు. అమెరికన్ల కోసం కృషి చేసిన జాతీయ హీరోల చరిత్రను నిరసనకారులు చెరిపేసే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

US-TRUMP-IDAY-SPEECH
ట్రంప్

పోలీసుల క్రూరత్వం, జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికా చరిత్రను తుడిచేయడానికి నిరసనకారులు ప్రయత్నించారని ఆరోపించారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

స్వాతంత్ర్య వేడుకలకు ముందు మౌంట్ రష్​మోర్​ జాతీయ స్మారకం వద్ద జాతినుద్దేశించి ప్రసంగించారు ట్రంప్. కొంతమంది నిరసనకారులు అమెరికా గొప్ప నేతల విగ్రహాలను ధ్వంసం చేయటానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఇందులో బానిసత్వ విముక్తి కోసం పోరాడిన వాళ్లూ ఉన్నారన్నారు.

"ఈ ఉద్యమం రష్​మోర్​ పర్వతంపై ఉన్న ప్రతి ఒక్కరి వారసత్వాలపై బహిరంగంగా దాడి చేసింది. మన జాతీయ హీరోలను కించపరిచేందుకు ప్రయత్నించారు. అమెరికా విలువలు చెరిపేయాలని చూశారు. మన గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు. మన లక్ష్యాలను దూరం చేసేలా వ్యవహరించారు."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

మౌంట్ రష్​మోర్​లో జరిగిన కార్యక్రమం ప్రచార సభ కాకపోయిన ట్రంప్ మద్దతుదారులు భారీగానే హాజరయ్యారు. మరో నాలుగేళ్లు పాలించాలని నినాదాలు చేశారు. ఈ వేదికపై ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కూడా ఉన్నారు.

ట్రంప్ ఎదురుదాడి..

ఎన్నికల ముందు నిరుద్యోగం, స్టాక్ మార్కెట్ల పతనం వంటి సమస్యలు ట్రంప్​ గెలుపుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ పరిణామాల నడుమ తన మద్దతుదారులపై దృష్టి సారించారు ట్రంప్.

కొన్ని రోజులుగా వామపక్ష వాదులపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కరోనా నుంచి ఫ్లాయిడ్ నిరసనల వరకు వారిపై ఆరోపణలు చేశారు. 2016లో హామీ ఇచ్చిన మెక్సికో గోడ మళ్లీ చర్చకు వచ్చేలా ఇటీవల దక్షిణ సరిహద్దును సందర్శించారు.

ఇదీ చూడండి: దక్షిణ చైనా సముద్రంలో అమెరికా అణ్వాయుధ నౌకలు

పోలీసుల క్రూరత్వం, జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికా చరిత్రను తుడిచేయడానికి నిరసనకారులు ప్రయత్నించారని ఆరోపించారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

స్వాతంత్ర్య వేడుకలకు ముందు మౌంట్ రష్​మోర్​ జాతీయ స్మారకం వద్ద జాతినుద్దేశించి ప్రసంగించారు ట్రంప్. కొంతమంది నిరసనకారులు అమెరికా గొప్ప నేతల విగ్రహాలను ధ్వంసం చేయటానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఇందులో బానిసత్వ విముక్తి కోసం పోరాడిన వాళ్లూ ఉన్నారన్నారు.

"ఈ ఉద్యమం రష్​మోర్​ పర్వతంపై ఉన్న ప్రతి ఒక్కరి వారసత్వాలపై బహిరంగంగా దాడి చేసింది. మన జాతీయ హీరోలను కించపరిచేందుకు ప్రయత్నించారు. అమెరికా విలువలు చెరిపేయాలని చూశారు. మన గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు. మన లక్ష్యాలను దూరం చేసేలా వ్యవహరించారు."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

మౌంట్ రష్​మోర్​లో జరిగిన కార్యక్రమం ప్రచార సభ కాకపోయిన ట్రంప్ మద్దతుదారులు భారీగానే హాజరయ్యారు. మరో నాలుగేళ్లు పాలించాలని నినాదాలు చేశారు. ఈ వేదికపై ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కూడా ఉన్నారు.

ట్రంప్ ఎదురుదాడి..

ఎన్నికల ముందు నిరుద్యోగం, స్టాక్ మార్కెట్ల పతనం వంటి సమస్యలు ట్రంప్​ గెలుపుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ పరిణామాల నడుమ తన మద్దతుదారులపై దృష్టి సారించారు ట్రంప్.

కొన్ని రోజులుగా వామపక్ష వాదులపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కరోనా నుంచి ఫ్లాయిడ్ నిరసనల వరకు వారిపై ఆరోపణలు చేశారు. 2016లో హామీ ఇచ్చిన మెక్సికో గోడ మళ్లీ చర్చకు వచ్చేలా ఇటీవల దక్షిణ సరిహద్దును సందర్శించారు.

ఇదీ చూడండి: దక్షిణ చైనా సముద్రంలో అమెరికా అణ్వాయుధ నౌకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.