ETV Bharat / entertainment

హీరో కార్తీ మాస్​ వార్నింగ్ ​- ఒక్కొక్కరి సీటు కింద బాంబ్ పెడతా!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 3:50 PM IST

Japan Movie Pre Release Event : హీరో కార్తీ నటించిన 'జపాన్' చిత్రం ప్రీ రిలీజ్​ ఈవెంట్​ తాజాగా హైదరాబాద్​లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై సందడి చేశారు. ఫ్యాన్స్​కు మాస్​ వార్నింగ్ ఇచ్చారు. ఆ విశేషాలు మీ కోసం..

Japan Pre Release Event Hyderabad
Japan Pre Release Event Hyderabad

Japan Movie Pre Release Event : హీరో కార్తీ గురించి సినీ లవర్స్​కు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ స్టార్ హీరో.. డబ్బింగ్​ సినిమాలతో తెలుగు ఆడియెన్స్​కు సుపరిచితుడే. 'పొన్నియిన్​ సెల్వన్​ 2' తో సూపర్​హిట్​ను తన ఖాతాలో వేసుకున్న ఈ స్టార్​ హీరో ఇప్పుడు 'జపాన్​' అనే సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్​ వేదికగా జరిగిన ప్రీరిలీజ్​ ఈవెంట్​కు హాజరయ్యారు. తన మాస్​ డైలాగ్​లతో అందరినీ అలరించారు. ఆయన చెప్పిన యుగానికి ఒక్కడు సినిమాలోని.. 'ఎవర్రా మీరంతా' అనే డైలగ్​కు హాల్​ అంతా చప్పట్ల సౌండ్​తో మారుమోగిపోయింది. దీంతో పాటు సినిమా గురించి చాలా విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. రాజు మురుగన్ తనకు 'జపాన్​' సినిమా కథ వినిపించినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తెరపైకి తీసుకురావాలని బలంగా కోరుకున్నట్ల చెప్పారు. తన మనసుకు ఈ జపాన్ సినిమా దగ్గరగా ఉంటుందని తెలిపారు.

తను నటించిన 'జపాన్' సినిమా గురించి కార్తి చేసిన వ్యాఖ్యలు ప్రీ రిలీజ్ ఈవెంట్​కే ప్రత్యేకంగా నిలిచాయి." నవంబర్​ 10 వ తేదీన ఈ సినిమా వస్తుంది. మీరంతా థియేటర్లకు వచ్చి సినిమా చూడకపోతే మీ సీట్ల కింద బాంబులు పెడతాను" అంటూ డైలాగ్​ చెప్పారు. ఈ ఒక్క మాటతో అక్కడున్నా ఆడియన్స్​ అంతా ఫిదా అయిపోయారు. కార్తీ చెప్పిన ఈ డైలాగ్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​ అవుతోంది.

మరోవైపు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్​కు నేచురల్​ స్టార్ నాని హాజరయ్యారు. కార్తీని చూసిన ఎవరైన ఆయన తెలుగువాడనే అంటారని అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రేక్షకులను అంతగా ఆయన సొంతం చేసుకున్నారని తెలిపారు. కార్తీ తనకి క్లోజ్​ ఫ్రెండ్​ అని అందువల్లనే ఈ ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు వచ్చానని చెప్పారు. కార్తీ నటించిన 'జపాన్​' అనే సినిమా ట్రైలర్ చూశానని తనకు చాలా బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు. సినిమా బ్లాక్​ బస్టర్​ హిట్టు అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

రజనీకాంత్ 'జైలర్​'.. కార్తి 'ఖైదీ'కి లింక్​.. ఏంటంటే?

హాట్ టాపిక్​గా కార్తి రెమ్యునరేషన్​.. మీడియాలో జోరుగా చర్చ!

Japan Movie Pre Release Event : హీరో కార్తీ గురించి సినీ లవర్స్​కు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ స్టార్ హీరో.. డబ్బింగ్​ సినిమాలతో తెలుగు ఆడియెన్స్​కు సుపరిచితుడే. 'పొన్నియిన్​ సెల్వన్​ 2' తో సూపర్​హిట్​ను తన ఖాతాలో వేసుకున్న ఈ స్టార్​ హీరో ఇప్పుడు 'జపాన్​' అనే సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్​ వేదికగా జరిగిన ప్రీరిలీజ్​ ఈవెంట్​కు హాజరయ్యారు. తన మాస్​ డైలాగ్​లతో అందరినీ అలరించారు. ఆయన చెప్పిన యుగానికి ఒక్కడు సినిమాలోని.. 'ఎవర్రా మీరంతా' అనే డైలగ్​కు హాల్​ అంతా చప్పట్ల సౌండ్​తో మారుమోగిపోయింది. దీంతో పాటు సినిమా గురించి చాలా విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. రాజు మురుగన్ తనకు 'జపాన్​' సినిమా కథ వినిపించినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తెరపైకి తీసుకురావాలని బలంగా కోరుకున్నట్ల చెప్పారు. తన మనసుకు ఈ జపాన్ సినిమా దగ్గరగా ఉంటుందని తెలిపారు.

తను నటించిన 'జపాన్' సినిమా గురించి కార్తి చేసిన వ్యాఖ్యలు ప్రీ రిలీజ్ ఈవెంట్​కే ప్రత్యేకంగా నిలిచాయి." నవంబర్​ 10 వ తేదీన ఈ సినిమా వస్తుంది. మీరంతా థియేటర్లకు వచ్చి సినిమా చూడకపోతే మీ సీట్ల కింద బాంబులు పెడతాను" అంటూ డైలాగ్​ చెప్పారు. ఈ ఒక్క మాటతో అక్కడున్నా ఆడియన్స్​ అంతా ఫిదా అయిపోయారు. కార్తీ చెప్పిన ఈ డైలాగ్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​ అవుతోంది.

మరోవైపు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్​కు నేచురల్​ స్టార్ నాని హాజరయ్యారు. కార్తీని చూసిన ఎవరైన ఆయన తెలుగువాడనే అంటారని అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రేక్షకులను అంతగా ఆయన సొంతం చేసుకున్నారని తెలిపారు. కార్తీ తనకి క్లోజ్​ ఫ్రెండ్​ అని అందువల్లనే ఈ ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు వచ్చానని చెప్పారు. కార్తీ నటించిన 'జపాన్​' అనే సినిమా ట్రైలర్ చూశానని తనకు చాలా బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు. సినిమా బ్లాక్​ బస్టర్​ హిట్టు అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

రజనీకాంత్ 'జైలర్​'.. కార్తి 'ఖైదీ'కి లింక్​.. ఏంటంటే?

హాట్ టాపిక్​గా కార్తి రెమ్యునరేషన్​.. మీడియాలో జోరుగా చర్చ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.