ETV Bharat / city

Visaka steel: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై.. కార్మికుల పోరాటం ఉద్ధృతం

author img

By

Published : Jul 10, 2021, 12:34 PM IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల పోరాటం రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. ప్రైవేటీకరణ కోసం కేంద్రం తాజాగా తీసుకున్న చర్యలను నిరసిస్తూ..భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కూర్మన్నపాలెం కూడలి నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు, అఖిలపక్ష కార్మిక నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు.

steel
steel
విశాఖ స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు

విశాఖ జిల్లా పాత గాజువాక కూడలిలో తెదేపా నాయకులు ధర్నా చేపట్టారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాస్తారోకో చేసి.. నినాదాలు చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

కూర్మన్నపాలెం నుంచి బైక్ ర్యాలీ..

ప్రజల కష్టాలు తెలుసుకోలేని పాలకులు అధికారం నుంచి తప్పుకోవాలని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. చేస్తున్న పోరాటం వంద రోజులైన సందర్భంగా కార్మిక సంఘాలు నగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కార్మికులు, కార్మికసంఘాల నేతలు కూర్మన్నపాలెం కూడలి నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా తరలివచ్చారు. జీవీఎంసీ గాంధీబొమ్మ వద్ద మహాసభ నిర్వహిస్తున్నారు.

స్టీల్ ప్లాంట్ విషయంలో దొబూచులాట ఎందుకు?: కొల్లు రవీంద్ర

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాడుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. కేంద్రాన్ని ప్రశ్నించకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సీఎం జగన్‌ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

రికార్డింగ్ డాన్సులతో.. వైకాపా నేతల చిందులు!

విశాఖ స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు

విశాఖ జిల్లా పాత గాజువాక కూడలిలో తెదేపా నాయకులు ధర్నా చేపట్టారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాస్తారోకో చేసి.. నినాదాలు చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

కూర్మన్నపాలెం నుంచి బైక్ ర్యాలీ..

ప్రజల కష్టాలు తెలుసుకోలేని పాలకులు అధికారం నుంచి తప్పుకోవాలని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. చేస్తున్న పోరాటం వంద రోజులైన సందర్భంగా కార్మిక సంఘాలు నగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కార్మికులు, కార్మికసంఘాల నేతలు కూర్మన్నపాలెం కూడలి నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా తరలివచ్చారు. జీవీఎంసీ గాంధీబొమ్మ వద్ద మహాసభ నిర్వహిస్తున్నారు.

స్టీల్ ప్లాంట్ విషయంలో దొబూచులాట ఎందుకు?: కొల్లు రవీంద్ర

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాడుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. కేంద్రాన్ని ప్రశ్నించకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సీఎం జగన్‌ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

రికార్డింగ్ డాన్సులతో.. వైకాపా నేతల చిందులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.