విశాఖలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. డాబాగార్డెన్స్లో నిర్మాణంలో ఉన్న భవనం ప్రహరీ గోడ కూలి ముగ్గురు కూలీలు చిక్కుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న ముగ్గురిలో ఓ వ్యక్తిని పోలీసులు కాపాడగా... మరో ఇద్దరు చనిపోయారు. వీరిలో ఒకరు విజయనగరం జిల్లా బాడంగికి చెందిన శంకర్రావుగా..మరొకరు తమిళనాడుకు చెందిన శివగా గుర్తించారు. ప్రొక్లెయిన్ సహయంతో మృతదేహాలను వెలికితీసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
ఇదీచదవండి