ETV Bharat / city

ఐదు నెలలుగా అందని వేతనాలు.. పారిశుద్ధ్య కార్మికుల ఇబ్బందులు

author img

By

Published : Jun 23, 2020, 6:01 PM IST

కరోనాపై పోరాడే యోధులుగా వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు అని అగ్రతాంబూలం ఇస్తున్నాం. కానీ విశాఖలో స్త్రీ ప్రసూతి వైద్య సేవలకు పేరొందిన ఘోష ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు అందలేదు. తమకు జీతాలు చెల్లించేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు.

ఐదు నెలలుగా అందని వేతనాలు.. పారిశుద్ధ్య కార్మికుల ఇబ్బందులు
ఐదు నెలలుగా అందని వేతనాలు.. పారిశుద్ధ్య కార్మికుల ఇబ్బందులు
వేతనాలు అందక పారిశుద్ధ్య కార్మికుల ఇబ్బందులు

కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్నవారిగా ఓ వైపు పొగడ్తలతో పారిశుద్ధ్య కార్మికులను ముంచెత్తుతున్నా... కొన్నిచోట్ల మాత్రం వారికి కనీసం వేతనాలు దక్కక అవస్థలు పడుతున్నారు. విశాఖలో స్త్రీ ప్రస్తూతి వైద్యసేవలకు పేరొందిన ఘోష ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులకు.. ఐదు నెలలు నుంచి వేతనాలు ఇవ్వలేదని వాపోతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో పది కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి సేవలందించామని గుర్తుచేశారు. అధికారులు పట్టించుకోకపోవటం వల్ల తమ కష్టం ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదని ఆవేదన చెందారు.

సెక్యూరిటీ సిబ్బందికి సైతం

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. డాక్టర్లపై దాడులు జరగకుండా చూసే సెక్యూరిటీ సిబ్బందికి కుడా అవే కష్టాలు. ఆరు నెలల నుంచి జీతం లేక అప్పులతో కుటుంబాలు నెట్టుకొస్తున్నట్లు చెబుతున్నారు. నానాటికీ ఇబ్బందులు పెరుగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.

కరోనా క్రమంలో ప్రాణాలను లెక్కచేయక విధులు నిర్వహిస్తున్నామని పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి తమకు వేతనాలు చెల్లించాలని వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి..

పొలం పనుల్లో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి

వేతనాలు అందక పారిశుద్ధ్య కార్మికుల ఇబ్బందులు

కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్నవారిగా ఓ వైపు పొగడ్తలతో పారిశుద్ధ్య కార్మికులను ముంచెత్తుతున్నా... కొన్నిచోట్ల మాత్రం వారికి కనీసం వేతనాలు దక్కక అవస్థలు పడుతున్నారు. విశాఖలో స్త్రీ ప్రస్తూతి వైద్యసేవలకు పేరొందిన ఘోష ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులకు.. ఐదు నెలలు నుంచి వేతనాలు ఇవ్వలేదని వాపోతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో పది కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి సేవలందించామని గుర్తుచేశారు. అధికారులు పట్టించుకోకపోవటం వల్ల తమ కష్టం ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదని ఆవేదన చెందారు.

సెక్యూరిటీ సిబ్బందికి సైతం

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. డాక్టర్లపై దాడులు జరగకుండా చూసే సెక్యూరిటీ సిబ్బందికి కుడా అవే కష్టాలు. ఆరు నెలల నుంచి జీతం లేక అప్పులతో కుటుంబాలు నెట్టుకొస్తున్నట్లు చెబుతున్నారు. నానాటికీ ఇబ్బందులు పెరుగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.

కరోనా క్రమంలో ప్రాణాలను లెక్కచేయక విధులు నిర్వహిస్తున్నామని పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి తమకు వేతనాలు చెల్లించాలని వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి..

పొలం పనుల్లో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.