ETV Bharat / city

విశాఖ నగరంలో దొంగల బీభత్సం

author img

By

Published : Nov 6, 2020, 2:11 PM IST

విశాఖ నగరంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. అంతర్రాష్ట ముఠాల కారణంగా విశాఖ వాసులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. ఏ మూల నుంచి ఎవరొచ్చి సొత్తు దొచుకుంటారేమనని భయంగా భయంగా ఉంటున్నారు.్​

robbery gangs in vishakapatnam
robbery gangs in vishakapatnam

విశాఖ నగరంలో అంతర్రాష్ట ముఠాలు హల్ చల్ చేస్తున్నారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన విశాఖలో పెద్దఎత్తున వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని విశాఖను టార్గెట్ చేసుకున్నారు. విశాఖ వాసులు ఇంటా, బయటా భయం భయంగానే గడుపుతున్నారు. ఏప్పుడు ఏ దొంగ వచ్చి కొల్లగొడతాడోని గుండెలు అర చేతిలో పెట్టుకుని ఉంటున్నారు.

  • ఏటీఎం దొంగలు..

తాజాగా పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన సమర్‌జ్యోత్‌సింగ్, కేరళ రాష్ట్రానికి చెందిన జాఫర్‌సాధిక్‌లు విశాఖ వచ్చి కొన్ని రోజులపాటు ఓ హోటల్లో బస చేసి పక్కా ప్రణాళిక రచించి రెక్కీచేసి ఏకంగా ఏటీఎంను దొంగిలించారు. నిందితుల వేలిముద్రలు, సీసీ కెమేరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు వారి ఆచూకీ కనుగొనడంతో కథ సుఖాంతం అయ్యింది. వీరు విమానంలో విశాఖ వచ్చి దొంగతనం అనంతరం తిరిగి విమానంలో వెళ్లిపోవడం గమనార్హం. దిల్లీ కేంద్రంగా వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

  • చెడ్డీ గ్యాంగ్‌..

నిక్కర్లు వేసుకుని ఆముదం పూసుకుని రాత్రిపూట ఇళ్లలోకి వచ్చి దొంగతనాలు చేయడం చెడ్డీగ్యాంగ్​ ప్రత్యేకత. మహారాష్ట్ర, గుజరాత్‌లోని దాహూద్‌ ప్రాంతానికి చెందిన వారు పలువురు చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులున్నట్లు గుర్తించారు. పి.ఎం.పాలెంలోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలోని నివాసాల్లో చెడ్డీగ్యాంగ్‌ సభ్యులు దొంగతనం చేశారు. ఇంటి యజమానులు అప్రమత్తంగా ఉండి ఇంట్లో కొద్దిపాటి వెండి సామాగ్రి మాత్రమే ఉంచడంతో వాటినే దొంగలు ఎత్తుకెళ్లారు. సీసీ టీవీ దృశ్యాల కారణంగా ఆ దొంగతనం వెలుగులోకి వచ్చింది.

  • బంగారం కొంటామని చెప్పి టోకరా..

బంగారం కొంటామని బేరాలాడి వారిని నమ్మకంగా ఒక ప్రాంతానికి పిలిపించి బంగారాన్ని దోచుకుపోయే ముఠాలు ఎక్కువగా ఉన్నాయి. గుంటూరుకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తిని మోసం చేసి నగరంలోని పీఎం.పాలెం ప్రాంతానికి పిలిపించి అతనిపై దాడి చేసి, బంధించి సుమారు మూడు కేజీల బంగారాన్ని దోచుకుపోయారు. వారిని రాజస్థాన్‌ రాష్ట్రంలోని పాలి జిల్లా డింగానా ప్రాంతానికి చెందిన దొంగలుగా గుర్తించారు. వారికి ఆ రాష్ట్రంలోని కొందరు రాజకీయ నాయకులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. వారు దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన పోలీసులపై కేసులు నమోదు చేసి జైలుకు కూడా పంపిన విషయం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

  • హరియాణా, ఇరానీ ముఠాల గొలుసుదొంగతనాలు

హరియాణాకు చెందిన కొందరు యువకులు గొలుసు దొంగలుగా మారారు. వీరు బైకులు అద్దెకు తీసుకుని ఒకేరోజు ఐదారు దొంగతనాలు చేసి పారిపోతుంటారు. గుంతకల్లు, బివాండి ప్రాంతాలకు చెందిన కొందరు దొంగలు ముఠాలుగా ఏర్పడి గొలుసు దొంగతనాలకు పాల్పడుతుంటారు. వారిని ఇరానీ ముఠాల వారిగా గుర్తించారు. వీరు కూడా ఒక నగరాన్ని ఎంచుకుని వరుస దొంగతనాలు చేసి పారిపోతుంటారు.

  • బిహార్‌ ముఠా..

విశాఖ శివారు దారపాలెం ప్రాంతానికి చెందిన ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆ దొంగతనం గుట్టురట్టు చేయడానికి పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. కొందరు అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టి ఉంచడంతో ఎట్టకేలకు ఆ దొంగతనం మిస్టరీ వీడింది. ఓ స్థానికుడు, బిహార్‌ ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని దొంగతనం చేయించినట్లు తేలింది.

  • ఉత్తరప్రదేశ్‌ ముఠా..

మాధవధార ప్రాంతానికి చెందిన ఓ నగల దుకాణం నుంచి కొందరు దొంగలు పెద్దఎత్తున నగలు దోచుకుపోయారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు నిందితులు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారని తేలింది. నగరంలోని సీతమ్మధార ప్రాంతంలోని ఓ బ్యాంకు నుంచి ఓ వ్యక్తి రూ.12లక్షలు తీసుకువస్తుండగా అతని చేతిలో బ్యాగ్‌ లాక్కుపోయిన ఉదంతం జరిగింది. ఈ కేసులో నిందితుడు కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముర్తజాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు.

  • గోడాసహాని ముఠా..

సెల్‌ఫోన్ల దొంగతనాలు చేయడంలో నేపాల్‌ దేశ గోడా సహాని ప్రాంతానికి చెందిన కొందరు దొంగలు సుప్రసిద్ధులు. ముఖ్యంగా సెల్‌ఫోన్‌ దుకాణాలను లక్ష్యంగా చేసుకుని వీరు దొంగతనాలు చేస్తారని గుర్తించారు.

ఇదీ చదవండి:

దారికాస్తారు... దోచుకెళ్తారు

విశాఖ నగరంలో అంతర్రాష్ట ముఠాలు హల్ చల్ చేస్తున్నారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన విశాఖలో పెద్దఎత్తున వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని విశాఖను టార్గెట్ చేసుకున్నారు. విశాఖ వాసులు ఇంటా, బయటా భయం భయంగానే గడుపుతున్నారు. ఏప్పుడు ఏ దొంగ వచ్చి కొల్లగొడతాడోని గుండెలు అర చేతిలో పెట్టుకుని ఉంటున్నారు.

  • ఏటీఎం దొంగలు..

తాజాగా పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన సమర్‌జ్యోత్‌సింగ్, కేరళ రాష్ట్రానికి చెందిన జాఫర్‌సాధిక్‌లు విశాఖ వచ్చి కొన్ని రోజులపాటు ఓ హోటల్లో బస చేసి పక్కా ప్రణాళిక రచించి రెక్కీచేసి ఏకంగా ఏటీఎంను దొంగిలించారు. నిందితుల వేలిముద్రలు, సీసీ కెమేరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు వారి ఆచూకీ కనుగొనడంతో కథ సుఖాంతం అయ్యింది. వీరు విమానంలో విశాఖ వచ్చి దొంగతనం అనంతరం తిరిగి విమానంలో వెళ్లిపోవడం గమనార్హం. దిల్లీ కేంద్రంగా వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

  • చెడ్డీ గ్యాంగ్‌..

నిక్కర్లు వేసుకుని ఆముదం పూసుకుని రాత్రిపూట ఇళ్లలోకి వచ్చి దొంగతనాలు చేయడం చెడ్డీగ్యాంగ్​ ప్రత్యేకత. మహారాష్ట్ర, గుజరాత్‌లోని దాహూద్‌ ప్రాంతానికి చెందిన వారు పలువురు చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులున్నట్లు గుర్తించారు. పి.ఎం.పాలెంలోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలోని నివాసాల్లో చెడ్డీగ్యాంగ్‌ సభ్యులు దొంగతనం చేశారు. ఇంటి యజమానులు అప్రమత్తంగా ఉండి ఇంట్లో కొద్దిపాటి వెండి సామాగ్రి మాత్రమే ఉంచడంతో వాటినే దొంగలు ఎత్తుకెళ్లారు. సీసీ టీవీ దృశ్యాల కారణంగా ఆ దొంగతనం వెలుగులోకి వచ్చింది.

  • బంగారం కొంటామని చెప్పి టోకరా..

బంగారం కొంటామని బేరాలాడి వారిని నమ్మకంగా ఒక ప్రాంతానికి పిలిపించి బంగారాన్ని దోచుకుపోయే ముఠాలు ఎక్కువగా ఉన్నాయి. గుంటూరుకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తిని మోసం చేసి నగరంలోని పీఎం.పాలెం ప్రాంతానికి పిలిపించి అతనిపై దాడి చేసి, బంధించి సుమారు మూడు కేజీల బంగారాన్ని దోచుకుపోయారు. వారిని రాజస్థాన్‌ రాష్ట్రంలోని పాలి జిల్లా డింగానా ప్రాంతానికి చెందిన దొంగలుగా గుర్తించారు. వారికి ఆ రాష్ట్రంలోని కొందరు రాజకీయ నాయకులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. వారు దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన పోలీసులపై కేసులు నమోదు చేసి జైలుకు కూడా పంపిన విషయం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

  • హరియాణా, ఇరానీ ముఠాల గొలుసుదొంగతనాలు

హరియాణాకు చెందిన కొందరు యువకులు గొలుసు దొంగలుగా మారారు. వీరు బైకులు అద్దెకు తీసుకుని ఒకేరోజు ఐదారు దొంగతనాలు చేసి పారిపోతుంటారు. గుంతకల్లు, బివాండి ప్రాంతాలకు చెందిన కొందరు దొంగలు ముఠాలుగా ఏర్పడి గొలుసు దొంగతనాలకు పాల్పడుతుంటారు. వారిని ఇరానీ ముఠాల వారిగా గుర్తించారు. వీరు కూడా ఒక నగరాన్ని ఎంచుకుని వరుస దొంగతనాలు చేసి పారిపోతుంటారు.

  • బిహార్‌ ముఠా..

విశాఖ శివారు దారపాలెం ప్రాంతానికి చెందిన ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆ దొంగతనం గుట్టురట్టు చేయడానికి పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. కొందరు అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టి ఉంచడంతో ఎట్టకేలకు ఆ దొంగతనం మిస్టరీ వీడింది. ఓ స్థానికుడు, బిహార్‌ ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని దొంగతనం చేయించినట్లు తేలింది.

  • ఉత్తరప్రదేశ్‌ ముఠా..

మాధవధార ప్రాంతానికి చెందిన ఓ నగల దుకాణం నుంచి కొందరు దొంగలు పెద్దఎత్తున నగలు దోచుకుపోయారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు నిందితులు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారని తేలింది. నగరంలోని సీతమ్మధార ప్రాంతంలోని ఓ బ్యాంకు నుంచి ఓ వ్యక్తి రూ.12లక్షలు తీసుకువస్తుండగా అతని చేతిలో బ్యాగ్‌ లాక్కుపోయిన ఉదంతం జరిగింది. ఈ కేసులో నిందితుడు కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముర్తజాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు.

  • గోడాసహాని ముఠా..

సెల్‌ఫోన్ల దొంగతనాలు చేయడంలో నేపాల్‌ దేశ గోడా సహాని ప్రాంతానికి చెందిన కొందరు దొంగలు సుప్రసిద్ధులు. ముఖ్యంగా సెల్‌ఫోన్‌ దుకాణాలను లక్ష్యంగా చేసుకుని వీరు దొంగతనాలు చేస్తారని గుర్తించారు.

ఇదీ చదవండి:

దారికాస్తారు... దోచుకెళ్తారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.