ETV Bharat / city

మంత్రి జయరాం భూదందాకు పాల్పడ్డారు: అయ్యన్నపాత్రుడు

author img

By

Published : Oct 6, 2020, 12:36 PM IST

Updated : Oct 6, 2020, 12:42 PM IST

మంత్రి జయరాం భూదందాకు పాల్పడ్డారని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. భూములు లాకున్నట్టు ఆధారాలు బయటపెట్టారు. ఓ సంస్థకు చెందిన 450 ఎకరాల్లో 204 ఎకరాలు బినామీల పేరిట మార్పిడి జరిగిందన్నారు. సంస్థకు సంబంధం లేని వ్యక్తి అమ్మినట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించారని అయ్యన్న ఆరోపించారు.

Ayyanna Patrudu tdp
Ayyanna Patrudu tdp
మంత్రి జయరాం భూదందాకు పాల్పడ్డారు: అయ్యన్నపాత్రుడు

కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేట్‌ సంస్థకు చెందిన భూములను.. తప్పుడు పత్రాలు సమర్పించి తన బంధువులు, బినామీల పేరిట మంత్రి గుమ్మనూరు జయరాం రాయించుకున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖలో మీడియా సమావేశంలో అందుకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు. ఆ సంస్థ నుంచి 2009లోనే బయటకొచ్చేసిన మంజునాథ్‌ అనే వ్యక్తి పేరిట తప్పుడు పవర్‌ ఆఫ్ అటార్నీ పత్రాలు సమర్పించి.. వందల ఎకరాలు ముందు అతని పేరు మీద.. తర్వాత అతను మంత్రి బంధువులకు అమ్మినట్టు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఆ భూమిపై కర్నూలు జిల్లా కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌లో రుణం పొందేందుకు యత్నించారన్నారు.

ఇదీ చదవండి: పాఠశాలలు, ట్యూషన్లలో కరోనా వ్యాప్తి

మంత్రి జయరాం భూదందాకు పాల్పడ్డారు: అయ్యన్నపాత్రుడు

కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేట్‌ సంస్థకు చెందిన భూములను.. తప్పుడు పత్రాలు సమర్పించి తన బంధువులు, బినామీల పేరిట మంత్రి గుమ్మనూరు జయరాం రాయించుకున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖలో మీడియా సమావేశంలో అందుకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టారు. ఆ సంస్థ నుంచి 2009లోనే బయటకొచ్చేసిన మంజునాథ్‌ అనే వ్యక్తి పేరిట తప్పుడు పవర్‌ ఆఫ్ అటార్నీ పత్రాలు సమర్పించి.. వందల ఎకరాలు ముందు అతని పేరు మీద.. తర్వాత అతను మంత్రి బంధువులకు అమ్మినట్టు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఆ భూమిపై కర్నూలు జిల్లా కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌లో రుణం పొందేందుకు యత్నించారన్నారు.

ఇదీ చదవండి: పాఠశాలలు, ట్యూషన్లలో కరోనా వ్యాప్తి

Last Updated : Oct 6, 2020, 12:42 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.