ముఖ్యమంత్రి జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా... విజయవాడ కంట్రోల్ రూం వద్ద వైయస్ విగ్రహానికి పలువురు వైకాపా నేతలు పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్రావులతోపాటు ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్ పాల్గొన్నారు.
సంక్షేమ పాలన
ఏడాది పాటు సంక్షేమ పాలన అందించిన ముఖ్యమంత్రి జగన్కు మంత్రి బొత్స సత్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది కాలంగా సీఎం జగన్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నూటికి తొంబై అయిదు శాతం అన్ని కార్యక్రమాలను ప్రవేశపెట్టారన్నారు. ప్రజలకు మంచి చేయాలని తమ ప్రభుత్వం భావిస్తుంటే.. కొందరు న్యాయస్థానాలకు వెళ్లి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.
ఇవీ చదవండి: