ETV Bharat / city

'టీఎన్ఎస్ఎఫ్ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం హేయమైన చర్య'

author img

By

Published : Jan 24, 2021, 3:27 PM IST

ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి యత్నించిన టీఎన్ఎస్ఎఫ్ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం.. హేయమైన చర్య అని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు అన్నారు. విద్యార్థులపై తప్పుడు కేసులు పెట్టి.. వారి భవిష్యత్ పై దెబ్బకొట్టడం సరికాదన్నారు.

tdp mlc manthena satyanarayana raju fires on govt and police about filing a rape case against student leaders
టీఎన్ఎస్ఎఫ్ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం హేయమైన చర్య: ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు

జీవో నెం.77 రద్దు చేయాలని కోరుతూ.. సీఎం ఇంటి ముట్టడికి యత్నించిన టీఎన్ఎస్ఎఫ్ నేతలపై తప్పుడు కేసులు పెట్టడంపై.. తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు మండిపడ్డారు. రక్షకులే చట్టాలను మారుస్తున్నారని విమర్శించారు.

వాళ్లు ఎవరిమీద అత్యాచారం చేశారో డీజీపీ సమాధానమివ్వాలి

ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి వచ్చిన విద్యార్థి నేతలపై.. అత్యాచారం కేసు పెడతారా అని ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు ప్రశ్నించారు. వాళ్లు ఎవరి మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించారో డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే ఇతర రాష్ట్రాల్లో జరిగిన నేరాలు కూడా.. రాష్ట్రంలోని విద్యార్థులకు, ప్రజా సమస్యలపై పోరాటం చేసే వారికి అంట గట్టేటట్టుందని ధ్వజమెత్తారు.

tdp mlc manthena satyanarayana raju fires on govt and police about filing a rape case against student leaders
టీఎన్ఎస్ఎఫ్ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం హేయమైన చర్య: ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు

కేసులు పెట్టి విద్యార్థుల భవిష్యత్​ను నాశనం చేస్తున్నారు

సమస్యలపై పోరాటం చేసే విద్యార్థులపై తప్పుడు కేసులు పెట్టి.. వారి భవిష్యత్ పై దెబ్బకొట్టడం సరికాదని హెచ్చరించారు. విద్యార్థులపై అక్రమoగా అత్యాచారం కేసులు పెట్టిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిపోతారని దుయ్యబట్టారు. కొంతమంది పోలీసులు వైకాపాకి తొత్తులుగా మారి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి నేతలపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలన్నారు.

ఇదీ చదవండి: సిద్ధంగా ఉన్న అధికారులతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చు: వెంకట్రామిరెడ్డి

జీవో నెం.77 రద్దు చేయాలని కోరుతూ.. సీఎం ఇంటి ముట్టడికి యత్నించిన టీఎన్ఎస్ఎఫ్ నేతలపై తప్పుడు కేసులు పెట్టడంపై.. తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు మండిపడ్డారు. రక్షకులే చట్టాలను మారుస్తున్నారని విమర్శించారు.

వాళ్లు ఎవరిమీద అత్యాచారం చేశారో డీజీపీ సమాధానమివ్వాలి

ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి వచ్చిన విద్యార్థి నేతలపై.. అత్యాచారం కేసు పెడతారా అని ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు ప్రశ్నించారు. వాళ్లు ఎవరి మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించారో డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే ఇతర రాష్ట్రాల్లో జరిగిన నేరాలు కూడా.. రాష్ట్రంలోని విద్యార్థులకు, ప్రజా సమస్యలపై పోరాటం చేసే వారికి అంట గట్టేటట్టుందని ధ్వజమెత్తారు.

tdp mlc manthena satyanarayana raju fires on govt and police about filing a rape case against student leaders
టీఎన్ఎస్ఎఫ్ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం హేయమైన చర్య: ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు

కేసులు పెట్టి విద్యార్థుల భవిష్యత్​ను నాశనం చేస్తున్నారు

సమస్యలపై పోరాటం చేసే విద్యార్థులపై తప్పుడు కేసులు పెట్టి.. వారి భవిష్యత్ పై దెబ్బకొట్టడం సరికాదని హెచ్చరించారు. విద్యార్థులపై అక్రమoగా అత్యాచారం కేసులు పెట్టిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిపోతారని దుయ్యబట్టారు. కొంతమంది పోలీసులు వైకాపాకి తొత్తులుగా మారి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి నేతలపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలన్నారు.

ఇదీ చదవండి: సిద్ధంగా ఉన్న అధికారులతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చు: వెంకట్రామిరెడ్డి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.