ETV Bharat / bharat

'ఆరు ట్రంకు పెట్టెలు తెచ్చుకోండి- జయలలిత వజ్రాభరణాలు తీసుకెళ్లండి' - JAYALALITHA JEWELLERY TO TAMILNADU

'ఆరు ట్రంకు పెట్టెలతో వచ్చి జయలలిత వజ్రాభరణాలు తీసుకెళ్లండి' - తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు ఆదేశం

Jayalalitha Jewellery To Tamilnadu
Jayalalitha Jewellery To Tamilnadu (Jayalalitha Jewellery To Tamilnadu)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2025, 2:15 PM IST

Jayalalitha Jewellery Handover To Tamilnadu Government : ఆరు ట్రంకు పెట్టెలు తీసుకువచ్చి దివంగత ముఖ్యమంత్రి జయలలిత వజ్రాభరణాలు తీసుకెళ్లాలని బెంగళూరు సిటీ సెషన్స్ కోర్టు​ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫొటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్, ఆరు పెద్ద ట్రంకు పెట్టెలతో పాటు దానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సిందిగా సూచించింది. ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో వాటిని అప్పగించాలని 36వ సిటీ సెషన్స్​ కోర్టు జడ్జి ఆదేశించారు. ఈ విషయంపై పిటిషన్​ దాఖలు చేసిన ఆర్​టీఐ కార్యకర్త టీ నరసింహ మూర్తి అదే తేదీల్లో కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

జప్తు చేసిన జయలలిత వస్తువులు ఇవే!

  • 7,040 గ్రాముల బరువున్న 468 రకాల బంగారు, వజ్రాల ఆభరణాలు
  • 700 కిలోల వెండి ఆభరణాలు
  • 740 జతల ఖరీదైన చెప్పులు
  • 11,344 పట్టు చీరలు
  • 250 శాలువాలు
  • 12 రిఫ్రిజిరేటర్లు
  • 10 టీవీ సెట్లు
  • 8 వీసీఆర్‌లు
  • 1 వీడియో కెమెరా
  • 4 సీడీ ప్లేయర్లు
  • 2 ఆడియో డెక్‌లు
  • 24 టూ-ఇన్-వన్ టేప్ రికార్డర్లు
  • 1040 వీడియో క్యాసెట్లు
  • 3 ఇనుప లాకర్లు
  • రూ.1,93,202 నగదు

ఇదీ కేసు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు 2014లో బెంగళూరు కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్లు జరిమానా విధించింది. అలాగే కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్న వస్తువులను ఆర్​బీఐ, ఎస్​బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసింది. ఇంతలోనే జయలలిత మరణించారు. ఈ క్రమంలోనే దీనిపై మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని గతేడాది ఫిబ్రవరిలో నిర్ణయించింది.

ఈ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ జయలలిత మేనకోడలు జె దీప కర్ణాటక హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. అనంతరం హైకోర్టు- కింది కోర్టు ఆదేశాలపై స్టే విధించింది. అనంతరం ఆ పిటిషన్లపై విచారణ జరిపి వాటిని కొట్టి వేస్తూ తీర్పునిచ్చింది. దీంతో జయలలిత వజ్రాభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే బెంగళూరు సిటీ సెషన్స్​ కోర్టు వజ్రాభరణాల అప్పగింతకు తేదీలు ఖరారు చేసింది.

Jayalalitha Jewellery Handover To Tamilnadu Government : ఆరు ట్రంకు పెట్టెలు తీసుకువచ్చి దివంగత ముఖ్యమంత్రి జయలలిత వజ్రాభరణాలు తీసుకెళ్లాలని బెంగళూరు సిటీ సెషన్స్ కోర్టు​ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫొటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్, ఆరు పెద్ద ట్రంకు పెట్టెలతో పాటు దానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సిందిగా సూచించింది. ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో వాటిని అప్పగించాలని 36వ సిటీ సెషన్స్​ కోర్టు జడ్జి ఆదేశించారు. ఈ విషయంపై పిటిషన్​ దాఖలు చేసిన ఆర్​టీఐ కార్యకర్త టీ నరసింహ మూర్తి అదే తేదీల్లో కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

జప్తు చేసిన జయలలిత వస్తువులు ఇవే!

  • 7,040 గ్రాముల బరువున్న 468 రకాల బంగారు, వజ్రాల ఆభరణాలు
  • 700 కిలోల వెండి ఆభరణాలు
  • 740 జతల ఖరీదైన చెప్పులు
  • 11,344 పట్టు చీరలు
  • 250 శాలువాలు
  • 12 రిఫ్రిజిరేటర్లు
  • 10 టీవీ సెట్లు
  • 8 వీసీఆర్‌లు
  • 1 వీడియో కెమెరా
  • 4 సీడీ ప్లేయర్లు
  • 2 ఆడియో డెక్‌లు
  • 24 టూ-ఇన్-వన్ టేప్ రికార్డర్లు
  • 1040 వీడియో క్యాసెట్లు
  • 3 ఇనుప లాకర్లు
  • రూ.1,93,202 నగదు

ఇదీ కేసు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు 2014లో బెంగళూరు కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్లు జరిమానా విధించింది. అలాగే కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్న వస్తువులను ఆర్​బీఐ, ఎస్​బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసింది. ఇంతలోనే జయలలిత మరణించారు. ఈ క్రమంలోనే దీనిపై మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని గతేడాది ఫిబ్రవరిలో నిర్ణయించింది.

ఈ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ జయలలిత మేనకోడలు జె దీప కర్ణాటక హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. అనంతరం హైకోర్టు- కింది కోర్టు ఆదేశాలపై స్టే విధించింది. అనంతరం ఆ పిటిషన్లపై విచారణ జరిపి వాటిని కొట్టి వేస్తూ తీర్పునిచ్చింది. దీంతో జయలలిత వజ్రాభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే బెంగళూరు సిటీ సెషన్స్​ కోర్టు వజ్రాభరణాల అప్పగింతకు తేదీలు ఖరారు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.