పన్ను ఎగవేతలోనూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్(CM Jagan) ఏ-1గా నిలిచారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara lokesh) విమర్శించారు. భార్య పేరుతో ఉన్న ఇంటికి జగన్ రెడ్డి పన్ను కట్టకుండా ప్రజల్ని పన్నులు చెల్లించమనటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. సకాలంలో పన్నులు చెల్లించి ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన సీఎం, ధనదాహంతో రూ.లక్షల ఇంటి పన్ను ఎగవేయడం విచిత్రంగా ఉందని ఆక్షేపించారు. జగన్ అస్తవ్యస్త పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలవకుండా అధిక పన్నులు, చెత్తపై ఛార్జీలు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఇదీచదవండి.