తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను కృష్ణా జిల్లా మైలవరం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 386 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి వారిని మైలవరం కోర్టులో హాజరుపరిచారు. వీరికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ పెద్ది రాజు తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లాలో..
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణా మద్యం, నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: