ETV Bharat / city

తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం

తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న కొందరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు, స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు తెలిపారు. తెలంగాణ నుంచి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు తరలిస్తున్న అక్రమ మద్యాన్ని సీజ్ చేసినట్లు వారు వివరించారు.

author img

By

Published : Aug 20, 2020, 12:03 AM IST

illegal transport of liquor seazed in krishna and west godavari districts
తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం

తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను కృష్ణా జిల్లా మైలవరం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 386 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి వారిని మైలవరం కోర్టులో హాజరుపరిచారు. వీరికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లు స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో ఇన్​స్పెక్టర్ పెద్ది రాజు తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లాలో..

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణా మద్యం, నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను కృష్ణా జిల్లా మైలవరం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 386 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి వారిని మైలవరం కోర్టులో హాజరుపరిచారు. వీరికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లు స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో ఇన్​స్పెక్టర్ పెద్ది రాజు తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లాలో..

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణా మద్యం, నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

అల్పపీడన ప్రభావం.. గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.