ETV Bharat / city

'దిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా రాష్ట్రంలో నిరసనలు'

author img

By

Published : Dec 2, 2020, 4:08 PM IST

దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రాష్ట్రంలోనూ నిరనసలు చేపట్టాలని కార్మిక సంఘాలకు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. రైతు సంఘాలలో చీలిక తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన దుయ్యబట్టారు. అన్ని సంఘాలను పిలిచి సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

vadde sobhanadreeswara rao
vadde sobhanadreeswara rao

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు అన్ని వర్గాలు మద్దతు పలకాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్​లో వ్యవసాయ పరిరక్షణ సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. రైతు సంఘాలలో చీలిక తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. దాదాపు 500 సంఘాలు ఉన్నా... కేవలం కొంతమందిని మాత్రమే సమావేశానికి ఆహ్వానించడం సరికాదని అన్నారు. అన్ని సంఘాలను పిలిచి సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

అధికారంలోకి వస్తే కనీస మద్దతు ధర, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తామని గతంలో ఎన్నికల ప్రచారంలో చెప్పిన మోదీ... అనంతరం మాట తప్పారని శోభనాద్రీశ్వరరావు చెప్పారు. దిల్లీలో రైతుల నిరసనలకు మద్దతుగా రాష్ట్రంలో 3వ తేదీన రాస్తా రోకో, 4న అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు, 5న అన్ని కార్మిక సంఘాలతో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు అన్ని వర్గాలు మద్దతు పలకాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్​లో వ్యవసాయ పరిరక్షణ సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. రైతు సంఘాలలో చీలిక తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. దాదాపు 500 సంఘాలు ఉన్నా... కేవలం కొంతమందిని మాత్రమే సమావేశానికి ఆహ్వానించడం సరికాదని అన్నారు. అన్ని సంఘాలను పిలిచి సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

అధికారంలోకి వస్తే కనీస మద్దతు ధర, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తామని గతంలో ఎన్నికల ప్రచారంలో చెప్పిన మోదీ... అనంతరం మాట తప్పారని శోభనాద్రీశ్వరరావు చెప్పారు. దిల్లీలో రైతుల నిరసనలకు మద్దతుగా రాష్ట్రంలో 3వ తేదీన రాస్తా రోకో, 4న అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు, 5న అన్ని కార్మిక సంఘాలతో నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి

సాగు చట్టానికి కేజ్రీ సర్కార్​ నోటిఫై- ప్రతిపక్షాల మండిపాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.