ETV Bharat / city

ఇంత తక్కువ సమయంలో కరోనా టీకా ఎలా సాధ్యం?

కరోనా మహమ్మారి నివారణకు ఆగస్టు 15 నాటికి టీకా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. పరీక్షలను సత్వరం పూర్తిచేసి వ్యాక్సిన్‌ను ఆవిష్కరించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేగంగా క్లినికల్‌ పరీక్షలు పూర్తిచేసి సత్వరం వ్యాక్సిన్‌ను తీసుకురావాలనే ప్రయత్నాలపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.

author img

By

Published : Jul 4, 2020, 6:26 PM IST

experts-responds-on-bharat-biotech-covaxin
experts-responds-on-bharat-biotech-covaxin

కరోనా వైరస్‌తో ప్రపంచం అతలాకుతలమవుతోంది. కేసులు, మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వైరస్‌ను సమర్థంగా కట్టడి చేసే ఏకైక మార్గం.. టీకా! ఇది ఎప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి లేక వచ్చే ఏడాది ఆరంభంలో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావొచ్చని వివిధ దేశాల్లోని ప్రయోగాలు సూచిస్తున్నాయి.

కానీ భారత్‌ చేపట్టిన వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రక్రియను ఈ ఆగస్టు 15 నాటికే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా క్లినికల్‌ పరీక్షలను వేగంగా నిర్వహించటానికి సహకరించాలంటూ సంబంధిత ఆస్పత్రులకు ఐసీఎంఆర్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. త్వరగా టీకా తీసుకురావాలనే ఆలోచన మంచిదే అయినా అది ఏ మేరకు సాధ్యమనే సందేహం నిపుణుల్లో వ్యక్తమవుతోంది.

ఐసీఎంఆర్‌- భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ (కొవాగ్జిన్‌), మనుషులపై ప్రయోగాల స్థాయికి (మొదటి, రెండో దశ) చేరింది. ఈ పరీక్షలను సత్వరం పూర్తిచేసి వ్యాక్సిన్‌ను ఆవిష్కరించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు దశల పరీక్షలను 1,125 మంది ‘వాలంటీర్ల’పై నిర్వహించాల్సి ఉందని తెలిసింది. మనుషులపై ప్రయోగాల నిర్వహణ చాలా కష్టమైన ప్రక్రియ. దీనికి ఎంపిక చేసిన ఆస్పత్రుల్లోని నైతిక విలువల కమిటీలు అనుమతి ఇవ్వాలి. ఇప్పటివరకూ అయిదు ఆస్పత్రుల కమిటీలే క్లినికల్‌ పరీక్షలకు అనుమతి ఇచ్చాయి. మిగిలిన ఏడు ఆస్పత్రుల్లో అనుమతి తీసుకోవటం, వాలంటీర్లను గుర్తించటం, వారిపై ప్రయోగాలు చేసి ఫలితాలను విశ్లేషించటానికి చాలా సమయం కావాలి. ఎక్కడ ఆలస్యం జరిగినా, అనుకున్న ఫలితాలు రాకపోయినా వ్యాక్సిన్‌ను నిర్ణీత సమయానికి తీసుకురాలేని పరిస్థితి ఎదురవుతుంది.

ప్రయోగాలు ఎలా?

మనుషులపై వ్యాక్సిన్‌ ప్రయోగాల నిర్వహణకు ముందుగా ఆరోగ్యవంతులైన వ్యక్తులను ఎంపిక చేయాలి. వారికి కొవిడ్‌ పరీక్షతో పాటు ఇతర వైద్య పరీక్షలు చేసి సంబంధిత వివరాలన్నింటీనీ దిల్లీలోని ప్రయోగశాలకు పంపాలి. అక్కడ నుంచి ఆ సమాచారాన్ని ఐసీఎంఆర్‌ క్రోడీకరిస్తుంది. అందులో అర్హులైన వారిపై ప్రయోగాలకు పచ్చజెండా ఊపుతుంది.

  • మొదటి దశ ప్రయోగాలను 375 మందిపై నిర్వహిస్తారని తెలిసింది. వాలంటీర్లకు ఈ దశలో మొదట ఒక డోసు టీకా ఇచ్చి రెండు రోజుల పాటు వైద్యుల పరిశీలనలో ఉంచి 13 రోజుల వరకూ వారి ఆరోగ్య సమాచారాన్ని నమోదు చేస్తారు. 14వ రోజున మరికొన్ని పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత అదే వ్యక్తికి రెండో డోసు ఇస్తారు. ఆ తర్వాత 11 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణ ఉంటుంది. ఇలా వాలంటీర్ల నమూనాలను విశ్లేషించి ఐసీఎంఆర్‌కు అందించాలి. ఆ ఫలితాలను బట్టి టీకాకు తుది అనుమతి ఇవ్వాలా లేక రెండోదశ.. ఆ తర్వాత మూడోదశ పరీక్షలు నిర్వహించాలా అనేదాన్ని ఐసీఎంఆర్‌ నిర్ధరిస్తుంది.
  • సాధారణంగా మొదటి దశ పరీక్షల్లో ఎంత డోసుతో ఫలితం ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తారు. రెండో దశ పరీక్షల్లో అన్ని వయసుల వారిపై వ్యాక్సిన్‌ పనిచేస్తుందో లేదా నిర్ధరించుకోవాలి. మూడో దశ పరీక్షల్లో అన్ని రకాలైన వారిపై టీకాను ప్రయోగించి చూస్తారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు

ప్రస్తుతం వివిధ దేశాల్లో 150 వరకూ వ్యాక్సిన్‌ తయారీ ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికాలోని మెడెర్నా సంస్థ తయారు చేసిన ఆర్‌ఎన్‌ఏ ఆధారిత కరోనా టీకా మొట్టమొదటగా మానవ ప్రయోగాల దశకు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దీనిపై క్లినికల్‌ ప్రయోగాలు ఆరంభమయ్యాయి. అది ఇంకా రెండో దశ క్లినికల్‌ పరీక్షల వద్దే ఉంది. దీనితో పోలిస్తే అక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, అస్థ్ర జెనేకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకా విషయంలో మంచి పురోగతి ఉంది. ఈ టీకాపై మూడో దశ క్లినికల్‌ పరీక్షల జరుగుతున్నాయి. ఇది ఈ ఏడాది చివరి నాటికి సిద్ధమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారత్‌ ఇంకా మొదటి దశ క్లినికల్‌ పరీక్షల స్థాయిలోనే ఉంది.

వేగంగా క్లినికల్‌ పరీక్షలు పూర్తిచేసి సత్వరం వ్యాక్సిన్‌ను తీసుకురావాలనే ప్రయత్నాలపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. వ్యాక్సిన్‌ తయారీలో పూర్తిస్థాయి ప్రక్రియను అనుసరించకుంటే అనేక ఇబ్బందులు రావచ్చని శాస్త్రవేత్త, ‘ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బయోఎథిక్స్‌’ మాజీ అధ్యక్షుడు అనంత్‌భాన్‌ పేర్కొన్నారు. ‘‘టీకా అభివృద్ధి ప్రక్రియను ఇంత వేగవంతం చేయటం ఎప్పుడూ జరగలేదు. హడావుడిగా వ్యాక్సిన్‌ను తీసుకురావాలనే ప్రయత్నం.. తయారీ విధానంపై ప్రభావం చూపుతుంది. రిస్కు కూడా ఎదురు కావచ్చు’’ అని ఆయన ‘ట్వీట్‌’ చేశారు. వ్యాక్సిన్‌ తయారీ దీర్ఘకాలిక ప్రక్రియ అని ‘బయోకాన్‌’ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా ఇటీవల వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయతాండవం... 20వేలు దాటిన కేసుల సంఖ్య

కరోనా వైరస్‌తో ప్రపంచం అతలాకుతలమవుతోంది. కేసులు, మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వైరస్‌ను సమర్థంగా కట్టడి చేసే ఏకైక మార్గం.. టీకా! ఇది ఎప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి లేక వచ్చే ఏడాది ఆరంభంలో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావొచ్చని వివిధ దేశాల్లోని ప్రయోగాలు సూచిస్తున్నాయి.

కానీ భారత్‌ చేపట్టిన వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రక్రియను ఈ ఆగస్టు 15 నాటికే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా క్లినికల్‌ పరీక్షలను వేగంగా నిర్వహించటానికి సహకరించాలంటూ సంబంధిత ఆస్పత్రులకు ఐసీఎంఆర్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. త్వరగా టీకా తీసుకురావాలనే ఆలోచన మంచిదే అయినా అది ఏ మేరకు సాధ్యమనే సందేహం నిపుణుల్లో వ్యక్తమవుతోంది.

ఐసీఎంఆర్‌- భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ (కొవాగ్జిన్‌), మనుషులపై ప్రయోగాల స్థాయికి (మొదటి, రెండో దశ) చేరింది. ఈ పరీక్షలను సత్వరం పూర్తిచేసి వ్యాక్సిన్‌ను ఆవిష్కరించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు దశల పరీక్షలను 1,125 మంది ‘వాలంటీర్ల’పై నిర్వహించాల్సి ఉందని తెలిసింది. మనుషులపై ప్రయోగాల నిర్వహణ చాలా కష్టమైన ప్రక్రియ. దీనికి ఎంపిక చేసిన ఆస్పత్రుల్లోని నైతిక విలువల కమిటీలు అనుమతి ఇవ్వాలి. ఇప్పటివరకూ అయిదు ఆస్పత్రుల కమిటీలే క్లినికల్‌ పరీక్షలకు అనుమతి ఇచ్చాయి. మిగిలిన ఏడు ఆస్పత్రుల్లో అనుమతి తీసుకోవటం, వాలంటీర్లను గుర్తించటం, వారిపై ప్రయోగాలు చేసి ఫలితాలను విశ్లేషించటానికి చాలా సమయం కావాలి. ఎక్కడ ఆలస్యం జరిగినా, అనుకున్న ఫలితాలు రాకపోయినా వ్యాక్సిన్‌ను నిర్ణీత సమయానికి తీసుకురాలేని పరిస్థితి ఎదురవుతుంది.

ప్రయోగాలు ఎలా?

మనుషులపై వ్యాక్సిన్‌ ప్రయోగాల నిర్వహణకు ముందుగా ఆరోగ్యవంతులైన వ్యక్తులను ఎంపిక చేయాలి. వారికి కొవిడ్‌ పరీక్షతో పాటు ఇతర వైద్య పరీక్షలు చేసి సంబంధిత వివరాలన్నింటీనీ దిల్లీలోని ప్రయోగశాలకు పంపాలి. అక్కడ నుంచి ఆ సమాచారాన్ని ఐసీఎంఆర్‌ క్రోడీకరిస్తుంది. అందులో అర్హులైన వారిపై ప్రయోగాలకు పచ్చజెండా ఊపుతుంది.

  • మొదటి దశ ప్రయోగాలను 375 మందిపై నిర్వహిస్తారని తెలిసింది. వాలంటీర్లకు ఈ దశలో మొదట ఒక డోసు టీకా ఇచ్చి రెండు రోజుల పాటు వైద్యుల పరిశీలనలో ఉంచి 13 రోజుల వరకూ వారి ఆరోగ్య సమాచారాన్ని నమోదు చేస్తారు. 14వ రోజున మరికొన్ని పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత అదే వ్యక్తికి రెండో డోసు ఇస్తారు. ఆ తర్వాత 11 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణ ఉంటుంది. ఇలా వాలంటీర్ల నమూనాలను విశ్లేషించి ఐసీఎంఆర్‌కు అందించాలి. ఆ ఫలితాలను బట్టి టీకాకు తుది అనుమతి ఇవ్వాలా లేక రెండోదశ.. ఆ తర్వాత మూడోదశ పరీక్షలు నిర్వహించాలా అనేదాన్ని ఐసీఎంఆర్‌ నిర్ధరిస్తుంది.
  • సాధారణంగా మొదటి దశ పరీక్షల్లో ఎంత డోసుతో ఫలితం ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తారు. రెండో దశ పరీక్షల్లో అన్ని వయసుల వారిపై వ్యాక్సిన్‌ పనిచేస్తుందో లేదా నిర్ధరించుకోవాలి. మూడో దశ పరీక్షల్లో అన్ని రకాలైన వారిపై టీకాను ప్రయోగించి చూస్తారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు

ప్రస్తుతం వివిధ దేశాల్లో 150 వరకూ వ్యాక్సిన్‌ తయారీ ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికాలోని మెడెర్నా సంస్థ తయారు చేసిన ఆర్‌ఎన్‌ఏ ఆధారిత కరోనా టీకా మొట్టమొదటగా మానవ ప్రయోగాల దశకు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దీనిపై క్లినికల్‌ ప్రయోగాలు ఆరంభమయ్యాయి. అది ఇంకా రెండో దశ క్లినికల్‌ పరీక్షల వద్దే ఉంది. దీనితో పోలిస్తే అక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, అస్థ్ర జెనేకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకా విషయంలో మంచి పురోగతి ఉంది. ఈ టీకాపై మూడో దశ క్లినికల్‌ పరీక్షల జరుగుతున్నాయి. ఇది ఈ ఏడాది చివరి నాటికి సిద్ధమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారత్‌ ఇంకా మొదటి దశ క్లినికల్‌ పరీక్షల స్థాయిలోనే ఉంది.

వేగంగా క్లినికల్‌ పరీక్షలు పూర్తిచేసి సత్వరం వ్యాక్సిన్‌ను తీసుకురావాలనే ప్రయత్నాలపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. వ్యాక్సిన్‌ తయారీలో పూర్తిస్థాయి ప్రక్రియను అనుసరించకుంటే అనేక ఇబ్బందులు రావచ్చని శాస్త్రవేత్త, ‘ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బయోఎథిక్స్‌’ మాజీ అధ్యక్షుడు అనంత్‌భాన్‌ పేర్కొన్నారు. ‘‘టీకా అభివృద్ధి ప్రక్రియను ఇంత వేగవంతం చేయటం ఎప్పుడూ జరగలేదు. హడావుడిగా వ్యాక్సిన్‌ను తీసుకురావాలనే ప్రయత్నం.. తయారీ విధానంపై ప్రభావం చూపుతుంది. రిస్కు కూడా ఎదురు కావచ్చు’’ అని ఆయన ‘ట్వీట్‌’ చేశారు. వ్యాక్సిన్‌ తయారీ దీర్ఘకాలిక ప్రక్రియ అని ‘బయోకాన్‌’ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా ఇటీవల వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయతాండవం... 20వేలు దాటిన కేసుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.