ETV Bharat / city

దిల్లీకి సీఎం జగన్.. నేడు అపెక్స్​ కౌన్సిల్ భేటీ

ముఖ్యమంత్రి జగన్ దిల్లీ చేరుకున్నారు. మంగళవారం ఉదయం 10.40 గంటలకు ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రధానితో రాష్ట్రాభివృద్ధి అంశాలు, తాజా పరిస్థితులు చర్చించనున్నట్టు సమాచారం. దిల్లీ నుంచే ఇవాళ జరగనున్న అపెక్స్ కౌన్సిల్ వర్చువల్ భేటీలో జగన్ పాల్గొననున్నారు.

author img

By

Published : Oct 5, 2020, 3:37 PM IST

Updated : Oct 6, 2020, 12:20 AM IST

దిల్లీ బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్
దిల్లీ బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్

ప్రధాని నరేంద్రమోదీతో భేటీ సహా.. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్ దిల్లీ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో 8 మందితో కలిసి దిల్లీకి వెళ్లారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సహా పలు కీలక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ఆర్థిక సహకారం అందించాలని మంగళవారం ఉదయం ప్రధానికి వినతి పత్రం అందించనున్నట్లు సమాచారం.

ఎన్​డీఏలో వైకాపా చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఇటీవలె కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాల మధ్య సీఎం జగన్ దిల్లీ పర్యటన, ప్రధానితో భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ వర్చువల్ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో సీఎం పాల్గొని రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలపై తన వాదన వినిపించే అవకాశం ఉంది.

ప్రధాని నరేంద్రమోదీతో భేటీ సహా.. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్ దిల్లీ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో 8 మందితో కలిసి దిల్లీకి వెళ్లారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సహా పలు కీలక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ఆర్థిక సహకారం అందించాలని మంగళవారం ఉదయం ప్రధానికి వినతి పత్రం అందించనున్నట్లు సమాచారం.

ఎన్​డీఏలో వైకాపా చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఇటీవలె కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాల మధ్య సీఎం జగన్ దిల్లీ పర్యటన, ప్రధానితో భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ వర్చువల్ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో సీఎం పాల్గొని రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలపై తన వాదన వినిపించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

ఏపీలో ప్రజాప్రతినిధులపై 132 కేసులు పెండింగ్

Last Updated : Oct 6, 2020, 12:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.