ETV Bharat / city

TTD Brahmotsavam 2021: శ్రీవారి ఆలయానికి చేరిన దర్బ చాప, తాడు..వాటి విశిష్టత ఏంటంటే..!

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణంలో ఉపయోగించే దర్భ చాప, తాడును ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అటవీ విభాగం సిబ్బంది తయారు చేసిన చాప, తాడును మహాద్వారం వద్ద ఆలయ సిబ్బందికి అందజేశారు. కాగా..ఈనెల 7న సాయంత్రం ముక్కోటి దేవతలను బహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహిస్తారు.

author img

By

Published : Oct 5, 2021, 6:13 PM IST

శ్రీవారి ఆలయానికి చేరిన దర్బ చాప, తాడు
శ్రీవారి ఆలయానికి చేరిన దర్బ చాప, తాడు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణంలో ఉపయోగించే దర్భ చాప, తాడును ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అటవీ విభాగం సిబ్బంది తయారు చేసిన చాప, తాడును మహాద్వారం వద్ద ఆలయ సిబ్బందికి అందజేశారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ఈనెల 7న సాయంత్రం మీనా లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ధ్వజస్థంభానికి దర్భ చాపను చుట్టి, తాడుతో గరుడ పతాకంను ఎగురవేస్తారు. శేషాచల అటవీ ప్రాంతంలో పెరిగే దర్భను తితిదే అటవీ సిబ్బంది సేకరించి..చాప, తాడు తయారు చేశారు. 7 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో చాప, 211 అడుగుల పొడవు తాడును సిద్ధం చేశారు. ఊరేగింపుగా వాటిని ఆలయానికి తరలించారు. వీటిని రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై ఉంచారు. ఈ కార్యక్రమంలో తితిదే డీఎఫ్‌వో శ్రీ‌నివాసులు రెడ్డి, అటవీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

శేషవాహనంపై తాడు, దర్బ చాప
శేషవాహనంపై తాడు, దర్బ చాప

ముమ్మరంగా ఏర్పాట్లు

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. కరోనా ప్రభావంతో ఏకాంతంగా ఆలయంలోని కల్యాణమండపంలో వాహన సేవలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ...ఉత్సవాల వేళ శ్రీవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మాడవీధుల్లో దేవతా మూర్తుల ప్రతి రూపాలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్‌ దీపాలతో భారీ కటౌట్‌లను తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవమూర్తులను ఊరేగించే వాహన సేవల పటిష్టతను పరిశీలిస్తున్నారు. వాటికి అవసరమైన మరమ్మతులను చేసి సిద్ధం చేస్తున్నారు. సూర్యప్రభ వాహనం పరిమాణం పెద్దగా ఉండడంతో..ఆలయంలోకి తీసుకేళ్లేందుకు మహాద్వారం వద్ద ఇబ్బందిగా మారడంతో..ఆ ప్రాంతంలో పాత వెండి వాహన సేవను వినియోగించనున్నారు. తేరు రథాన్ని మరమ్మతులు చేసి..ప్రయోగాత్మకంగా కొంతదూరం ముందుకు లాగారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ శ్రీవారి ఆలయంలో కొయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయాన్ని శుద్ధి చేసి...6వ తేదీ సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 7వ తేదీన మీన‌ ల‌గ్నంలో సాయంత్రం 5 గంటల 10 నిమిషాల నుంచి 30 నిమిషాల మధ్య ధ్వజారోహ‌ణం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి నిర్వహించే పెద్దశేష వాహ‌న సేవతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. 8వ తేదీ ఉదయం చిన్న శేష వాహన సేవ, రాత్రి హంస వాహన సేవ నిర్వహిస్తారు. 9వ తేదీ ఉదయం సింహ వాహ‌నంపైన స్వామి వారిని ఊరేగించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు స్నప‌న‌తిరుమంజ‌నం నిర్వహిస్తారు. రాత్రి ముత్యపుపందిరి వాహ‌నంపై తిరుమలేశుడు అభయం ఇవ్వనున్నారు. 10 వ తేదీ ఉదయం క‌ల్పవృక్ష వాహ‌నంపై …. రాత్రి స‌ర్వభూపాల‌ వాహ‌నంపై స్వామి దర్శనమివ్వనున్నారు.

11 వ తేదీ ఉదయం మోహినీ అవ‌తారంలో కనిపించనున్నారు. అదే రోజు రాత్రి గ‌రుడ‌సేవ‌ నిర్వహిస్తారు. 12వ తేదీ ఉదయం హ‌నుమంత వాహ‌నంపై శ్రీవారు దర్శనమిస్తారు. సాయంత్రం స్వర్ణర‌థం బ‌దులుగా స‌ర్వభూపాల వాహ‌నం మీద....రాత్రి గ‌జ వాహ‌నంపైనా విహరిస్తారు. 13వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహ‌నం మీద రాత్రి చంద్రప్రభ వాహ‌నంపైన స్వామి దర్శనమిస్తారు. 14న ఉదయం ర‌థోత్సవానికి బ‌దులుగా స‌ర్వభూపాల వాహ‌నం మీద అభయమిస్తారు. రాత్రి అశ్వ వాహ‌న సేవతో వాహన సేవలు ముగుస్తాయి.

15వ తేదీన చక్రస్నానంలో భాగంగా వేకువజామున ప‌ల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, స్నప‌న‌ తిరుమంజ‌నం, చ‌క్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి జరిగే ధ్వజావ‌రోహ‌ణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు సాగే వాహన సేవలను ఆలయంలోని కల్యాణమండపంలో కొలువుదీర్చి వైదిక కార్యక్రమాలనూ నిర్వహించనున్నారు. అర్చకులు, ఆలయ సిబ్బంది వాహన సేవల్లో పాల్గొని ఉత్సవాలను నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి

TTD: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. తేదీలు ఖరారు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణంలో ఉపయోగించే దర్భ చాప, తాడును ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అటవీ విభాగం సిబ్బంది తయారు చేసిన చాప, తాడును మహాద్వారం వద్ద ఆలయ సిబ్బందికి అందజేశారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ఈనెల 7న సాయంత్రం మీనా లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ధ్వజస్థంభానికి దర్భ చాపను చుట్టి, తాడుతో గరుడ పతాకంను ఎగురవేస్తారు. శేషాచల అటవీ ప్రాంతంలో పెరిగే దర్భను తితిదే అటవీ సిబ్బంది సేకరించి..చాప, తాడు తయారు చేశారు. 7 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో చాప, 211 అడుగుల పొడవు తాడును సిద్ధం చేశారు. ఊరేగింపుగా వాటిని ఆలయానికి తరలించారు. వీటిని రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై ఉంచారు. ఈ కార్యక్రమంలో తితిదే డీఎఫ్‌వో శ్రీ‌నివాసులు రెడ్డి, అటవీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

శేషవాహనంపై తాడు, దర్బ చాప
శేషవాహనంపై తాడు, దర్బ చాప

ముమ్మరంగా ఏర్పాట్లు

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. కరోనా ప్రభావంతో ఏకాంతంగా ఆలయంలోని కల్యాణమండపంలో వాహన సేవలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ...ఉత్సవాల వేళ శ్రీవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మాడవీధుల్లో దేవతా మూర్తుల ప్రతి రూపాలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్‌ దీపాలతో భారీ కటౌట్‌లను తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవమూర్తులను ఊరేగించే వాహన సేవల పటిష్టతను పరిశీలిస్తున్నారు. వాటికి అవసరమైన మరమ్మతులను చేసి సిద్ధం చేస్తున్నారు. సూర్యప్రభ వాహనం పరిమాణం పెద్దగా ఉండడంతో..ఆలయంలోకి తీసుకేళ్లేందుకు మహాద్వారం వద్ద ఇబ్బందిగా మారడంతో..ఆ ప్రాంతంలో పాత వెండి వాహన సేవను వినియోగించనున్నారు. తేరు రథాన్ని మరమ్మతులు చేసి..ప్రయోగాత్మకంగా కొంతదూరం ముందుకు లాగారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ శ్రీవారి ఆలయంలో కొయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయాన్ని శుద్ధి చేసి...6వ తేదీ సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 7వ తేదీన మీన‌ ల‌గ్నంలో సాయంత్రం 5 గంటల 10 నిమిషాల నుంచి 30 నిమిషాల మధ్య ధ్వజారోహ‌ణం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి నిర్వహించే పెద్దశేష వాహ‌న సేవతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. 8వ తేదీ ఉదయం చిన్న శేష వాహన సేవ, రాత్రి హంస వాహన సేవ నిర్వహిస్తారు. 9వ తేదీ ఉదయం సింహ వాహ‌నంపైన స్వామి వారిని ఊరేగించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు స్నప‌న‌తిరుమంజ‌నం నిర్వహిస్తారు. రాత్రి ముత్యపుపందిరి వాహ‌నంపై తిరుమలేశుడు అభయం ఇవ్వనున్నారు. 10 వ తేదీ ఉదయం క‌ల్పవృక్ష వాహ‌నంపై …. రాత్రి స‌ర్వభూపాల‌ వాహ‌నంపై స్వామి దర్శనమివ్వనున్నారు.

11 వ తేదీ ఉదయం మోహినీ అవ‌తారంలో కనిపించనున్నారు. అదే రోజు రాత్రి గ‌రుడ‌సేవ‌ నిర్వహిస్తారు. 12వ తేదీ ఉదయం హ‌నుమంత వాహ‌నంపై శ్రీవారు దర్శనమిస్తారు. సాయంత్రం స్వర్ణర‌థం బ‌దులుగా స‌ర్వభూపాల వాహ‌నం మీద....రాత్రి గ‌జ వాహ‌నంపైనా విహరిస్తారు. 13వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహ‌నం మీద రాత్రి చంద్రప్రభ వాహ‌నంపైన స్వామి దర్శనమిస్తారు. 14న ఉదయం ర‌థోత్సవానికి బ‌దులుగా స‌ర్వభూపాల వాహ‌నం మీద అభయమిస్తారు. రాత్రి అశ్వ వాహ‌న సేవతో వాహన సేవలు ముగుస్తాయి.

15వ తేదీన చక్రస్నానంలో భాగంగా వేకువజామున ప‌ల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, స్నప‌న‌ తిరుమంజ‌నం, చ‌క్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి జరిగే ధ్వజావ‌రోహ‌ణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు సాగే వాహన సేవలను ఆలయంలోని కల్యాణమండపంలో కొలువుదీర్చి వైదిక కార్యక్రమాలనూ నిర్వహించనున్నారు. అర్చకులు, ఆలయ సిబ్బంది వాహన సేవల్లో పాల్గొని ఉత్సవాలను నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి

TTD: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. తేదీలు ఖరారు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.