ETV Bharat / city

ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించిన సోము వీర్రాజు

author img

By

Published : Apr 3, 2021, 3:51 PM IST

తిరుపతిలో భాజపా ప్రచార రథాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రారంభించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నియమావళి అమలులో ఉండగా.. పంచాయతీ సర్పంచిల ప్రమాణ స్వీకారం నిర్వహించడంపై మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.

bjp campaign vehicles inauguration in tirupati, somu veerraju inaugurated bjp campaign vehicles
తిరుపతిలో భాజపా ప్రచార వాహనాలు ప్రారంభం, తిరుపతిలో ప్రచార వాహనాలు ప్రారంభించిన సోము వీర్రాజు

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు.. సర్పంచుల ప్రమాణ స్వీకారం ఎలా నిర్వహిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. తిరుపతిలో భాజపా ప్రచార రథాలను ఆయన ప్రారంభించారు. ఎంపీ అభ్యర్థి రత్నప్రభ, భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్​ఛార్జ్ సునీల్ దేవ్​ధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైకాపా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు ఎన్నికల నియమావళిని అతిక్రమించిందని సోము వీర్రాజు ఆరోపించారు. గతంలో సర్పంచులకు ఉన్న చెక్ పవర్ అధికారాలను వీఆర్వోలకు బదలాయించిందని విమర్శించారు. సర్పంచ్ వ్యవస్థను అధికార పార్టీ నిర్వీర్యం చేసిందన్నారు.

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు.. సర్పంచుల ప్రమాణ స్వీకారం ఎలా నిర్వహిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. తిరుపతిలో భాజపా ప్రచార రథాలను ఆయన ప్రారంభించారు. ఎంపీ అభ్యర్థి రత్నప్రభ, భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్​ఛార్జ్ సునీల్ దేవ్​ధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైకాపా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు ఎన్నికల నియమావళిని అతిక్రమించిందని సోము వీర్రాజు ఆరోపించారు. గతంలో సర్పంచులకు ఉన్న చెక్ పవర్ అధికారాలను వీఆర్వోలకు బదలాయించిందని విమర్శించారు. సర్పంచ్ వ్యవస్థను అధికార పార్టీ నిర్వీర్యం చేసిందన్నారు.

ఇదీ చదవండి:

'సీఎం జగన్, సోము వీర్రాజు కలిసి దొంగనాటకాలు ఆడుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.