ETV Bharat / city

పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు... వేధిస్తున్న వైద్య పరికరాల కొరత

author img

By

Published : Jun 9, 2021, 12:01 AM IST

గుంటూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు హడలెత్తిస్తున్నాయి. ఒక్క గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోనే 180 మంది చికిత్స పొందుతుండగా ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కేసుల తాకిడి పెరిగింది. చికిత్సలో వినియోగించే కీలక ఇంజెక్షన్ల కొరత ఏర్పడటంతో రోగులు, బంధువులు అల్లాడుతున్నారు.

huge black fungus cases registered in guntur district
గుంటూరు జిల్లాలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు

కరోనా ముప్పు మెల్లగా తగ్గుముఖం పడుతుండగా గుంటూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్‌ చాపకింద నీరులా చుట్టేస్తోంది. రోజుల వ్యవధిలోనే బాధితుల పరిస్థితి విషమంగా మారుతోంది. చికిత్సలో కీలకమైన యాంఫోటెరిసిన్‌-బీ ఇంజెక్షన్ల కొరత పట్టిపీడిస్తోంది. జీజీహెచ్​లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో మూడొంతుల మందికి ఇంజెక్షన్లు అందుబాటులో లేవంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా పోసాకొనాజోల్ వినియోగిస్తూ నష్టాన్ని కాస్త నివారించగలుగుతున్నారు. బ్లాక్ ఫంగస్‌తో పోరాడుతూ గుంటూరు జీజీహెచ్​లో ఇప్పటికి 20 మంది మరణించడం కలవరపెడుతోంది.

ఇంజెక్షన్లే కాక కీలకమైన వైద్య పరికరాల కొరత వేధిస్తోంది. ఫంగస్ నిర్ధరణ, వ్యాప్తిని గుర్తించే పరికరాలు, తీవ్రతను తెలుసుకునేందుకు ప్రత్యేక కెమెరాల అవసరముంది. ఉన్న వనరులతోనే వీలైనంత వేగంగా వైద్యమందిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అన్నారు. ఇంజెక్షన్ల కొరత తీర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.

ఇదీచదవండి.

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్ విధానం అమలు

కరోనా ముప్పు మెల్లగా తగ్గుముఖం పడుతుండగా గుంటూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్‌ చాపకింద నీరులా చుట్టేస్తోంది. రోజుల వ్యవధిలోనే బాధితుల పరిస్థితి విషమంగా మారుతోంది. చికిత్సలో కీలకమైన యాంఫోటెరిసిన్‌-బీ ఇంజెక్షన్ల కొరత పట్టిపీడిస్తోంది. జీజీహెచ్​లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో మూడొంతుల మందికి ఇంజెక్షన్లు అందుబాటులో లేవంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా పోసాకొనాజోల్ వినియోగిస్తూ నష్టాన్ని కాస్త నివారించగలుగుతున్నారు. బ్లాక్ ఫంగస్‌తో పోరాడుతూ గుంటూరు జీజీహెచ్​లో ఇప్పటికి 20 మంది మరణించడం కలవరపెడుతోంది.

ఇంజెక్షన్లే కాక కీలకమైన వైద్య పరికరాల కొరత వేధిస్తోంది. ఫంగస్ నిర్ధరణ, వ్యాప్తిని గుర్తించే పరికరాలు, తీవ్రతను తెలుసుకునేందుకు ప్రత్యేక కెమెరాల అవసరముంది. ఉన్న వనరులతోనే వీలైనంత వేగంగా వైద్యమందిస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అన్నారు. ఇంజెక్షన్ల కొరత తీర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.

ఇదీచదవండి.

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్ విధానం అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.