ETV Bharat / city

'జగన్​కు పాలన చేతకాకుంటే.. రాజీనామా చేయాలి'

author img

By

Published : May 18, 2022, 6:21 PM IST

పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేశారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంపై సీఎం జగన్‌ నోరువిప్పాలని డిమాండ్ చేశారు. జలవనరుల మంత్రితో మాట్లాడిస్తే సరిపోదన్న ఉమా.. పరిపాలన చేతకాకపోతే తప్పుకోవాలని ధ్వజమెత్తారు.

దేవినేని ఉమా
దేవినేని ఉమా

పోలవరం నిర్మాణంపై ముఖ్యమంత్రి నోరువిప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. జలవనరుల మంత్రితో మాట్లాడిస్తే సరిపోదన్నారు. పులిచింతల గేట్ కొట్టుకుపోయి 9 నెలలైతే మంత్రి ఏం చేస్తున్నారని ఉమా నిలదీశారు.

' జగన్​కు పరిపాలన చేతకాకుంటే... రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి'

మూడేళ్లలో రాష్ట్రంలో ఒక్కప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? అని దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు. 6 ప్రాధాన్యతాప్రాజెక్టుల్లో ఎన్ని పూర్తిచేశారని నిలదీశారు. పరిపాలన చేతకాకపోతే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. నిర్వాసితుల సొమ్ముని పందికొక్కుల్లా తింటున్నవాళ్లు.. ముఖ్యమంత్రికి, మంత్రి రాంబాబుకి కనిపించడం లేదా? అని ఉమా ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

పోలవరం నిర్మాణంపై ముఖ్యమంత్రి నోరువిప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. జలవనరుల మంత్రితో మాట్లాడిస్తే సరిపోదన్నారు. పులిచింతల గేట్ కొట్టుకుపోయి 9 నెలలైతే మంత్రి ఏం చేస్తున్నారని ఉమా నిలదీశారు.

' జగన్​కు పరిపాలన చేతకాకుంటే... రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి'

మూడేళ్లలో రాష్ట్రంలో ఒక్కప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? అని దేవినేని ఉమా సూటిగా ప్రశ్నించారు. 6 ప్రాధాన్యతాప్రాజెక్టుల్లో ఎన్ని పూర్తిచేశారని నిలదీశారు. పరిపాలన చేతకాకపోతే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. నిర్వాసితుల సొమ్ముని పందికొక్కుల్లా తింటున్నవాళ్లు.. ముఖ్యమంత్రికి, మంత్రి రాంబాబుకి కనిపించడం లేదా? అని ఉమా ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.