- వైకాపావి నవరత్నాలు.. కాదు నవమోసాలు: చంద్రబాబు నాయుడు
తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా రాపూరులో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించారు. భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి జగన్ అని విమర్శఇంచారు. రెండేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తిరుపతి ఉపఎన్నికల్లో వాలంటీర్ల ప్రచారం
తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో గ్రామ, వార్డు వాలంటీర్లు పాల్గొంటున్నారు. చిత్తూరు జిల్లా పరిధిలోని సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పలువురు వాలంటీర్లు ముఖ్యమంత్రి జగన్ సంతకం, సందేశంతో పంపిన లేఖలను స్వయంగా ఇంటింటికీ వెళ్లి పంచుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొవ్వూరు వద్ద గోదావరిలో ముగ్గురు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో.. గోదావరిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దాచేపల్లి వద్ద ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ఇరికేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి పనుల నిమిత్తం తెలంగాణలోని నల్గొండ జిల్లా యాదగిరిపల్లి నుంచి గుంటూరు వైపు వ్యవసాయ కార్మికులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పని చేస్తోన్న బ్యాంకుకే కన్నం- రూ.4 కోట్లు చోరీ
పని చేస్తోన్న బ్యాంకుకే కన్నం వేసి రూ.4 కోట్లు కాజేశాడు ఓ సెక్యూరిటీ గార్డు. పంజాబ్లో జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు పోలీసులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అవయవదానంపై చైతన్యానికి 700 కిమీ సైకిల్ యాత్ర
దిల్లీకి చెందిన 19 ఏళ్ల దక్ష యాదవ్ .. అవయవదానంపై చైతన్యం కల్పిస్తూ 700 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేశాడు. అవయవదాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. రెండు రోజుల్లో యాత్రను పూర్తిచేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మూడువేల ఏళ్ల నాటి 'బంగారు నగరం'
ఈజిప్టులో 3000 ఏళ్లనాటి బంగారు నగరాన్ని పరిశోధకులు గుర్తించారు. అక్కడ అద్భుతమైన, అరుదైన కట్టడాలను చూసి ఆర్కియాలజిస్టులు ఆశ్చర్యపోతున్నారు. ఈజిప్టును పాలించిన ఫారో స్వర్ణయుగంలో నిర్మించినదిగా భావిస్తున్న ఈ బంగారు నగరం నాటి ఈజిప్టు ఘన చరిత్రను మరోసారి కళ్లకు కట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చిప్ల కొరతతో.. ప్రపంచం సతమతం
కొవిడ్ లాక్డౌన్ల సమయంలో కార్ల పరిశ్రమలు, గృహోపకరణాలను ఉత్పత్తి చేసే కర్మాగారాలు మూతపడటంతో సిలికాన్ చిప్ (సెమీ కండక్టర్ల)కు గిరాకీ పడిపోయింది. లాక్డౌన్లను ఎత్తివేశాక కార్లు, ఇతర వస్తువుల తయారీ కర్మాగారాలు తిరిగి తెరుచుకొన్నా పెరిగిన డిమాండ్కు తగినట్లు చిప్లు సరఫరా కావటం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పొల్గార్ ఛాలెంజ్ టోర్నీ విజేతగా ప్రజ్ఞానంద
భారత 15 ఏళ్ల గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మరో అంతర్జాతీయ టోర్నీలో మెరిశాడు. పొల్గార్ ఛాలెంజ్ టోర్నీలో విజేతగా నిలిచాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నా ఎదుగుదలకు కారణం అలాంటి సవాళ్లే'
పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన 'వకీల్సాబ్' చిత్రంలో వేముల పల్లవి పాత్రలో ఒదిగిపోయింది నివేదా థామస్. ఈ పాత్రకుగానూ ప్రశంసలూ అందుకుంటోంది. తాజాగా థియేటర్లో సినిమా చూసిన నివేదా ఈటీవీ భారత్తో ముచ్చటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.