ETV Bharat / city

సికింద్రాబాద్​లో రైళ్ల ధ్వంస రచన.. వాట్సాప్​ ద్వారానే! - secunderabad agnipath protest case updates

Agnipath News : తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ విధ్వంసం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్లుగా ఉన్న వారిని పోలీసులు విచారిస్తున్నారు.

agnipath protest
agnipath protest
author img

By

Published : Jun 20, 2022, 3:31 PM IST

Agnipath News : తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరికొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్లుగా ఉన్న వాళ్లను ప్రశ్నిస్తున్నారు. అడ్మిన్లుగా ఉండి అందులోని సభ్యులను రెచ్చగొట్టేలా వారు పోస్టింగులు చేసినట్లు గుర్తించారు. ఉత్తరాదిలో జరిగిన విధ్వంసాన్ని చూసి స్ఫూర్తి పొందినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆందోళనకారుల వెనక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

కొంత మంది కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, యువకులను రెచ్చగొట్టినట్లు అనుమానిస్తున్నారు. ఏయే కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల హస్తం ఉందనే వివరాలను సేకరిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తును పరిశీలించాలని ఇప్పటికే అదనపు సీపీ శ్రీనివాస్, టాస్క్​ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణను సీపీ సీవీ ఆనంద్‌ ఆదేశించారు. రైల్వే పోలీసులు ఈ కేసును హైదరాబాద్ పోలీసులకు బదిలీ చేశారు.

మరోవైపు అగ్నిపథ్ విధానాన్ని నిరసిస్తూ ఆర్మీ అభ్యర్థులు, ప్రజా సంఘాలు ఈరోజు భారత్ బంద్​కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్సులు, రైళ్లు యధావిధిగా రాకపోకలు సాగిస్తుండటంతో బంద్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు.

ఇవీ చదవండి:

Agnipath News : తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరికొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్లుగా ఉన్న వాళ్లను ప్రశ్నిస్తున్నారు. అడ్మిన్లుగా ఉండి అందులోని సభ్యులను రెచ్చగొట్టేలా వారు పోస్టింగులు చేసినట్లు గుర్తించారు. ఉత్తరాదిలో జరిగిన విధ్వంసాన్ని చూసి స్ఫూర్తి పొందినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆందోళనకారుల వెనక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

కొంత మంది కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, యువకులను రెచ్చగొట్టినట్లు అనుమానిస్తున్నారు. ఏయే కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల హస్తం ఉందనే వివరాలను సేకరిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తును పరిశీలించాలని ఇప్పటికే అదనపు సీపీ శ్రీనివాస్, టాస్క్​ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణను సీపీ సీవీ ఆనంద్‌ ఆదేశించారు. రైల్వే పోలీసులు ఈ కేసును హైదరాబాద్ పోలీసులకు బదిలీ చేశారు.

మరోవైపు అగ్నిపథ్ విధానాన్ని నిరసిస్తూ ఆర్మీ అభ్యర్థులు, ప్రజా సంఘాలు ఈరోజు భారత్ బంద్​కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్సులు, రైళ్లు యధావిధిగా రాకపోకలు సాగిస్తుండటంతో బంద్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.