ETV Bharat / city

సీఎం రాజీనామా చేస్తారా? మంత్రులు చేస్తారా?: చంద్రబాబు

author img

By

Published : Sep 22, 2019, 12:57 PM IST

ముఖ్యమంత్రి జగన్​కు తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. సచివాలయ పరీక్షల నిర్వహణ తీరుపై.. అభ్యంతరం వ్యక్తం చేశారు. పారదర్శకంగా మరోసారి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

babu letter to jagan
సీఎం జగన్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ

గ్రామ సచివాలయ పరీక్షల నిర్వహణ తీరుపై.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు.. ముఖ్యమంత్రి జగన్​కు బహిరంగ లేఖ రాశారు. గత 4 నెలలుగా వైకాపా పాలనలో రాష్ట్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొందన్నారు. అనుభవ రాహిత్యం, ఆశ్రిత పక్షపాతం, కక్ష సాధింపు వైఖరే ఈ పరిస్థితికి మూలకారణంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీపీఎస్సీ ప్రతిష్ఠకే మాయని మచ్చగా ప్రవేశ పరీక్ష చెడ్డపేరు తెచ్చిందని ఆవేదన చెందారు. దాదాపు 19 లక్షల అభ్యర్థులు, కుటుంబ సభ్యులకు వేదన మిగిల్చిందన్న చంద్రబాబు.. మునుపెన్నడూ లేనంత అధ్వానంగా, అవినీతిమయంగా, అక్రమాలు - అవకతవకల భూయిష్టంగా పరీక్షలు నిర్వహించారని ఆగ్రహించారు.

''ప్రవేశ పరీక్ష నోటిపికేషన్ జులై 26న వస్తే, సెప్టెంబర్ 1నుంచి 8వ తేది దాకా పరీక్షల ప్రక్రియ ప్రారంభించారు. మొత్తం ఉద్యోగాలు లక్షా 26 వేల 728కిగాను లక్షా 98 వేల 164 మంది అర్హత సాధించారని, 56 రోజుల వ్యవధిలోనే ఈ మొత్తాన్ని పూర్తిచేశామని ఆడంబరంగా ప్రకటించారు. అంతే తప్ప వాటిలో ఎన్ని అక్రమాలు జరిగాయో, ఎన్ని అవకతవకలు జరిగాయో, ఎంత అధ్వానంగా పరీక్షల నిర్వహణ ఉందో గాలికి వదిలేశారు. దాదాపు 20లక్షల మంది అభ్యర్ధుల ఆశలను పూర్తిగా వమ్ము చేసి నియామకాల పరీక్షల ప్రక్రియకే తీరని కళంకం తెచ్చారు. ఒక్కో ఉద్యోగాన్ని 4 లక్షల రూపాయలకు అమ్ముకున్నారనే కథనాలను మీడియాలో చూశాం. క్వశ్చన్ పేపర్ లీకేజి అదేదో ఫ్యామిలీ ప్యాకేజిగా మారిందని విమర్శలు వస్తున్నాయి. వాళ్ల బంధువులు, స్నేహితులకే మంచి మార్కులు సాధించారనే వార్తలే క్వశ్చన్ పేపర్ లీకేజి అయ్యిందనడానికి తిరుగులేని రుజువులు. కీ లో అత్యధిక మార్కులు వచ్చినవాళ్లకు ఫలితాల్లో అరకొరగా మార్కులు రావడం, హెల్ప్ లైన్ కు వందలసార్లు కాల్ చేసినా స్పందన లేదని అభ్యర్ధులే ఆరోపించడం అధ్వాన్న పరీక్షా నిర్వహణకు అద్దం పడుతోంది. ప్రశ్నాపత్రాలు ఏపీపీఎస్​సీ కన్నా ముందే రిటైర్డ్ అధికారికి ఎలా చేరాయి? కమిషన్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ సిబ్బందికి క్వశ్చన్ పేపర్లు ఎలా అందాయి? ప్రింటర్లకు క్వశ్చన్ పేపర్ మెయిల్ ఎక్కడ నుంచి వెళ్లింది? అవుట్ సోర్సింగ్ సిబ్బందికి, వాళ్ల బంధువులకే టాప్ ర్యాంకులు దక్కడంలో మతలబు ఏమిటి? ఇందులో ఏపీపీఎస్​సీ బాధ్యత ఎంత, పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ, విద్యాశాఖల బాధ్యత ఎంత? మీడియాలో వస్తున్న ఈ ప్రశ్నలకు, ఉద్యోగాలు రాక నిలదీస్తున్న అభ్యర్ధులకు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది'' అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

జరిగిన దానికి బాధ్యత వహించి గతంలో చేసిన వ్యాఖ్యల ప్రకారం రాజీనామా చేస్తారా.. అని ముఖ్యమంత్రిని చంద్రబాబు ప్రశ్నించారు. జరిగిన అవినీతికి-అక్రమాలకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. ఈ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా మళ్లీ పరీక్షలను నిర్వహించాలని.. అర్హులైన వారికే ఉద్యోగాలు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పాపానికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు.. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

సీఎం జగన్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ
సీఎం జగన్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ
సీఎం జగన్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ
సీఎం జగన్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ

సీఎం జగన్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ

గ్రామ సచివాలయ పరీక్షల నిర్వహణ తీరుపై.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు.. ముఖ్యమంత్రి జగన్​కు బహిరంగ లేఖ రాశారు. గత 4 నెలలుగా వైకాపా పాలనలో రాష్ట్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొందన్నారు. అనుభవ రాహిత్యం, ఆశ్రిత పక్షపాతం, కక్ష సాధింపు వైఖరే ఈ పరిస్థితికి మూలకారణంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీపీఎస్సీ ప్రతిష్ఠకే మాయని మచ్చగా ప్రవేశ పరీక్ష చెడ్డపేరు తెచ్చిందని ఆవేదన చెందారు. దాదాపు 19 లక్షల అభ్యర్థులు, కుటుంబ సభ్యులకు వేదన మిగిల్చిందన్న చంద్రబాబు.. మునుపెన్నడూ లేనంత అధ్వానంగా, అవినీతిమయంగా, అక్రమాలు - అవకతవకల భూయిష్టంగా పరీక్షలు నిర్వహించారని ఆగ్రహించారు.

''ప్రవేశ పరీక్ష నోటిపికేషన్ జులై 26న వస్తే, సెప్టెంబర్ 1నుంచి 8వ తేది దాకా పరీక్షల ప్రక్రియ ప్రారంభించారు. మొత్తం ఉద్యోగాలు లక్షా 26 వేల 728కిగాను లక్షా 98 వేల 164 మంది అర్హత సాధించారని, 56 రోజుల వ్యవధిలోనే ఈ మొత్తాన్ని పూర్తిచేశామని ఆడంబరంగా ప్రకటించారు. అంతే తప్ప వాటిలో ఎన్ని అక్రమాలు జరిగాయో, ఎన్ని అవకతవకలు జరిగాయో, ఎంత అధ్వానంగా పరీక్షల నిర్వహణ ఉందో గాలికి వదిలేశారు. దాదాపు 20లక్షల మంది అభ్యర్ధుల ఆశలను పూర్తిగా వమ్ము చేసి నియామకాల పరీక్షల ప్రక్రియకే తీరని కళంకం తెచ్చారు. ఒక్కో ఉద్యోగాన్ని 4 లక్షల రూపాయలకు అమ్ముకున్నారనే కథనాలను మీడియాలో చూశాం. క్వశ్చన్ పేపర్ లీకేజి అదేదో ఫ్యామిలీ ప్యాకేజిగా మారిందని విమర్శలు వస్తున్నాయి. వాళ్ల బంధువులు, స్నేహితులకే మంచి మార్కులు సాధించారనే వార్తలే క్వశ్చన్ పేపర్ లీకేజి అయ్యిందనడానికి తిరుగులేని రుజువులు. కీ లో అత్యధిక మార్కులు వచ్చినవాళ్లకు ఫలితాల్లో అరకొరగా మార్కులు రావడం, హెల్ప్ లైన్ కు వందలసార్లు కాల్ చేసినా స్పందన లేదని అభ్యర్ధులే ఆరోపించడం అధ్వాన్న పరీక్షా నిర్వహణకు అద్దం పడుతోంది. ప్రశ్నాపత్రాలు ఏపీపీఎస్​సీ కన్నా ముందే రిటైర్డ్ అధికారికి ఎలా చేరాయి? కమిషన్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ సిబ్బందికి క్వశ్చన్ పేపర్లు ఎలా అందాయి? ప్రింటర్లకు క్వశ్చన్ పేపర్ మెయిల్ ఎక్కడ నుంచి వెళ్లింది? అవుట్ సోర్సింగ్ సిబ్బందికి, వాళ్ల బంధువులకే టాప్ ర్యాంకులు దక్కడంలో మతలబు ఏమిటి? ఇందులో ఏపీపీఎస్​సీ బాధ్యత ఎంత, పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ, విద్యాశాఖల బాధ్యత ఎంత? మీడియాలో వస్తున్న ఈ ప్రశ్నలకు, ఉద్యోగాలు రాక నిలదీస్తున్న అభ్యర్ధులకు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది'' అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

జరిగిన దానికి బాధ్యత వహించి గతంలో చేసిన వ్యాఖ్యల ప్రకారం రాజీనామా చేస్తారా.. అని ముఖ్యమంత్రిని చంద్రబాబు ప్రశ్నించారు. జరిగిన అవినీతికి-అక్రమాలకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. ఈ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా మళ్లీ పరీక్షలను నిర్వహించాలని.. అర్హులైన వారికే ఉద్యోగాలు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పాపానికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు.. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

సీఎం జగన్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ
సీఎం జగన్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ
సీఎం జగన్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ
సీఎం జగన్​కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ
Intro:యాంకర్: పేదరికం ప్రతిభకు అడ్డుకాదని ఓ యువకుడు నిరూపించాడు సాధారణ వ్యాన్ డ్రైవర్ కుమారుడు గ్రామ సచివాలయం ఉద్యోగాల నియామకాల్లో రెండు కేటగిరీల్లో రెండు మూడు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి సత్తా చాటాడు


Body:విశాఖ నగరంలోని ఓల్డ్ డైరీ ఫాం కు చెందిన సవ్వాన గోపికృష్ణ 2016 లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను తండ్రి కనక మురళి వ్యాన్ డ్రైవర్ గా పని పనిచేస్తూ అతికష్టం మీద గోపికృష్ణ ను ఇంజనీరింగ్ వరకు చదివించాడు తల్లి గృహిణి చిన్ననాటి నుండి పేదరికాన్ని చవిచూసిన గోపికృష్ణ మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్నాయి జాన్ డ్రైవర్గా తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయిన గోపికృష్ణ ప్రభుత్వ ఉద్యోగం కోసం మూడేళ్లుగా పోటీ పరీక్షలకు కఠోర సాధన చేశాడు ఏపీపీఎస్సీ కి సిద్ధమవుతున్న గోపికృష్ణ ఇటీవల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన గ్రామ సచివాలయ పోస్టులకు దరఖాస్తు పెట్టి నాలుగు కేటగిరీలకు పరీక్షలు రాశాడు అందులో రెండు కేటగిరీల్లో వరుసగా రెండు మూడు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు కేటగిరి 2 లో వీఆర్వో విలేజ్ సర్వేయర్ పోస్ట్ కు క్యాటగిరి 3 లో వార్డు ప్లానింగ్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేశాడు క్యాటగిరి 2 గ్రూప్ బి లో 118. 75 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించాడు కేటగిరి 3 లో 93.25 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించాడు గ్రామ సచివాలయం పోస్టులకు ఇచ్చిన సిలబస్ను చదవడం వల్లే ఈ మార్పులు వచ్చాయని గోపి కృష్ణ చెబుతున్నాడు.
---------
బైట్ సవ్వాన గోపికృష్ణ గ్రామ సచివాలయం లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన అభ్యర్థి విశాఖ
---------
వ్యాన్ డ్రైవర్ గా కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్ట పడిన తండ్రి కనక మురళి కొడుకును కష్టపడి చదివినందుకు తగిన ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు కుటుంబ అవసరాలకు అందుబాటులో ఉంటూనే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో గోపికృష్ణ బ్యాంకులు సాధించాడని తల్లి లక్ష్మి చెబుతోంది గోపికృష్ణ గ్రామ సచివాలయం పోస్టుల్లో రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు సాధించాడని తెలుసుకున్న తల్లిదండ్రులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి గారు కుటుంబ కష్టాలన్నీ తీరిపోతాయని సంబరపడ్డారు తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు
---------
బైట్ కనుక మురళి గోపికృష్ణ తండ్రి విశాఖ
బైట్ లక్ష్మి గోపికృష్ణ తల్లి విశాఖ
బైట్ కృష్ణకుమారి గోపికృష్ణ మేనత్త
---------



Conclusion:అనుకున్నది సాధించాలనే తపన కృషి పట్టుదల ఉంటే ఏదైనా ఇట్టే సాధించవచ్చని గోపి కృష్ణ నిరూపించాడు ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన ఆ విభాగానికి చెందిన పోస్టులో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ఒక పక్క ఉద్యోగం చేస్తూనే మరో పక్క చదువుకుంటూ గ్రూప్ వన్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ( ఓవర్).

(Note: Some more photos from Etv Whatsapp).
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.