ETV Bharat / city

'ఈ అరెస్టులు ప్రభుత్వ కుట్రే.. మూల్యం చెల్లించుకోక తప్పదు'

author img

By

Published : Jun 14, 2020, 4:16 AM IST

కక్షపూరితంగానే పార్టీ నేతలపై అక్రమకేసులు పెట్టి వరుస అరెస్టు‌లు చేస్తున్నారని.... తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై తెలుగుదేశం పోరాటాన్ని సహించలేకనే.... అధికార పక్షం ఈ విధంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. మొన్నటి వరకూ ఎస్సీ, ఎస్టీలపై కక్ష సాధించిన జగన్‌.... ఇప్పుడు బీసీలపై దాడి చేస్తున్నారని ఆక్షేపించారు. ఏడాది పాలనలో వరుసగా ఎదుర్కొంటున్న వైఫల్యాలు, కోర్టు చీవాట్లకు.... మతిస్థిమితం కోల్పోయి... వైకాపా ప్రభుత్వం ఇటువంటి డైవర్షన్‌ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

'ఈ అరెస్టులు ప్రభుత్వ కుట్రే.. వైకాపావి డైవర్షన్​ రాజకీయాలు'
'ఈ అరెస్టులు ప్రభుత్వ కుట్రే.. వైకాపావి డైవర్షన్​ రాజకీయాలు'

పార్టీ సీనియర్‌ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డిల అరెస్టు.... ముమ్మాటికీ ప్రభుత్వ కుట్రేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. పార్టీ ముఖ్య నేతలతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించిన ఆయన.... రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులపై వేధింపులు, కక్ష తీర్చుకునేందుకే జగన్‌.... ముఖ్యమంత్రి అయినట్లుగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. వైకాపా నేతల అవినీతిని వెలికితీస్తున్నందునే కక్షపూరితంగా వ్యవహరిస్తూ... అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని దుయ్యబట్టారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన నేత అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో.... ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌ రెడ్డిలను అరెస్ట్‌ చేశారని ఆక్షేపించారు. అచ్చెన్నాయుడుకి గురువారమే శస్త్రచికిత్స జరిగిందన్న చంద్రబాబు... అరెస్ట్‌ చేసి తీసుకువస్తున్న సమయంలో బ్లీడింగ్‌ అయిందని తెలిపారు. నాలుగైదు రోజులు ఆయనకు నొప్పి తీవ్రంగా ఉంటుందని వెల్లడించారు. పోలీసులు కనీసం మాస్క్‌లు కూడా ధరించలేదన్న చంద్రబాబు... వారిలో ఎవరికైనా కరోనా ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే జేసీ కుటుంబంపై జగన్‌ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టిందని వెల్లడించారు. మూడేళ్ల క్రితం సాక్షి కార్యాలయం ఎదుట జేసీ ప్రభాకర్‌ రెడ్డి, అస్మిత్‌రెడ్డి ఆందోళన చేపట్టినందుకు ఇప్పుడు కుట్రపూరితంగా వారిని అరెస్ట్‌ చేశారన్నారు. విచారణ ఎదుర్కొనేందుకు, పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఎన్నోసార్లు ప్రకటించారన్నారు.

అసలు వారిని వదిలేసి

కేసుకు సంబంధించిన అసలు సూత్రధారులను వదిలివేసి.... హైదరాబాద్‌కు వెళ్లి మరీ ప్రభాకర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడం వైకాపా రాజకీయ వేధింపులకు నిదర్శనమన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డికి మోసపూరితంగా వాహనాలు అమ్మిన అశోక్‌ లేలాండ్‌ కంపెనీపై‌ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న చంద్రబాబు... మధ్యవర్తిత్వం వహించిన ముత్తును విచారణ కూడా చేయలేదన్నారు. ఈఎస్​ఐ వ్యవహారంలో ముందు 150 కోట్ల అవినీతి అన్న ఏసీబీ జేడీ.... సాక్షిలో రూ.900 కోట్ల స్కాం అని వచ్చే సరికి మాటమార్చి రూ.988 కోట్ల అవినీతి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి విజిలెన్స్‌ నివేదిక ప్రకారం ఈఎస్ఐ వ్యవహారంలో పక్కదారి పట్టింది రూ.7.96 కోట్లు మాత్రమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. అందులోనూ అచ్చెన్నాయుడి ప్రమేయం, ప్రస్తావన ఎక్కడా లేదని.... విజిలెన్స్‌ రిపోర్టులో అచ్చెన్నాయుడి పేరు కూడా లేదన్నారు. ఎప్​ఐఆర్​లోనూ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేరు లేకపోయినా... ఇరువురిని అత్యంత దుర్మార్గంగా అరెస్ట్‌ చేశారన్నారు. గతంలో తన విశాఖ పర్యటన సమయంలోనూ అప్పటికప్పుడు నోటీసు ఇచ్చినందుకు డీజీపీ గంటల తరబడి కోర్టులో నిలబడ్డారన్న చంద్రబాబు.... ఇప్పుడు అచ్చెన్నాయుడు, జేసీ కుటుంబ సభ్యుల అరెస్ట్‌ సమయంలోనూ సరైన డాక్యుమెంటేషన్‌ లేకుండా వెళ్లారన్నారు. దీనికి కూడా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు.

నిబంధనలు వారికి వర్తించవా

అనారోగ్యంతో బాధపడుతున్న అచ్చెన్నాయుడుని పరామర్శించడానికి తెలుగుదేశం నాయకులు వెళితే... లాక్‌డౌన్‌ ఉల్లంఘన పేరుతో అడ్డుకున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే వైకాపా ఎమ్మెల్యేలు పెళ్లి రోజు, పుట్టినరోజు వేడుకలు చేసుకోవడానికి.. పూలు చల్లించుకుంటూ స్థానిక ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవడానికి.... నిబంధనలు వర్తించవా అని ప్రశ్నించారు. ఒంటరిగా వెళ్తున్న చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేశారని.. గుంపులు గుంపులుగా తిరిగి కరోనా వ్యాప్తికి కారణమైన వైకాపా నేతలపై కేసులు కూడా పెట్టరా అని నిలదీశారు. ప్రజాప్రతినిధులను అదుపులోకి తీసుకునే ముందు వారికి నోటీసులు ఇచ్చి, విచారణకు పిలవవచ్చని తెలిపారు. రానిపక్షంలో అప్పుడు చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న శంకర్‌ నారాయణ... అచ్చెన్నని ఆంబోతు అనడం సిగ్గుచేటని ఆక్షేపించారు.

అచ్చెన్నాయుడుపై ఏసీబీ దాడి జరగబోతుందా అని వైకాపా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన మరుసటి రోజే ఆయనను అరెస్ట్‌ చేశారన్న తెదేపా అధినేత.... మాజీ మంత్రి యనమల రామకృష్ణుడును అరెస్ట్‌ చేయబోతున్నారని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడిన వెంటనే ఆయనపై కుట్రకు తెరతీశారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే యనమల, చినరాజప్పపై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. జగన్‌ ఈ కక్షసాధింపు చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలందరూ వైకాపా విధానాలను నిరసించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి..

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​రెడ్డి అరెస్టు

పార్టీ సీనియర్‌ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డిల అరెస్టు.... ముమ్మాటికీ ప్రభుత్వ కుట్రేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. పార్టీ ముఖ్య నేతలతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించిన ఆయన.... రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులపై వేధింపులు, కక్ష తీర్చుకునేందుకే జగన్‌.... ముఖ్యమంత్రి అయినట్లుగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. వైకాపా నేతల అవినీతిని వెలికితీస్తున్నందునే కక్షపూరితంగా వ్యవహరిస్తూ... అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని దుయ్యబట్టారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన నేత అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో.... ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌ రెడ్డిలను అరెస్ట్‌ చేశారని ఆక్షేపించారు. అచ్చెన్నాయుడుకి గురువారమే శస్త్రచికిత్స జరిగిందన్న చంద్రబాబు... అరెస్ట్‌ చేసి తీసుకువస్తున్న సమయంలో బ్లీడింగ్‌ అయిందని తెలిపారు. నాలుగైదు రోజులు ఆయనకు నొప్పి తీవ్రంగా ఉంటుందని వెల్లడించారు. పోలీసులు కనీసం మాస్క్‌లు కూడా ధరించలేదన్న చంద్రబాబు... వారిలో ఎవరికైనా కరోనా ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే జేసీ కుటుంబంపై జగన్‌ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టిందని వెల్లడించారు. మూడేళ్ల క్రితం సాక్షి కార్యాలయం ఎదుట జేసీ ప్రభాకర్‌ రెడ్డి, అస్మిత్‌రెడ్డి ఆందోళన చేపట్టినందుకు ఇప్పుడు కుట్రపూరితంగా వారిని అరెస్ట్‌ చేశారన్నారు. విచారణ ఎదుర్కొనేందుకు, పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఎన్నోసార్లు ప్రకటించారన్నారు.

అసలు వారిని వదిలేసి

కేసుకు సంబంధించిన అసలు సూత్రధారులను వదిలివేసి.... హైదరాబాద్‌కు వెళ్లి మరీ ప్రభాకర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయడం వైకాపా రాజకీయ వేధింపులకు నిదర్శనమన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డికి మోసపూరితంగా వాహనాలు అమ్మిన అశోక్‌ లేలాండ్‌ కంపెనీపై‌ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న చంద్రబాబు... మధ్యవర్తిత్వం వహించిన ముత్తును విచారణ కూడా చేయలేదన్నారు. ఈఎస్​ఐ వ్యవహారంలో ముందు 150 కోట్ల అవినీతి అన్న ఏసీబీ జేడీ.... సాక్షిలో రూ.900 కోట్ల స్కాం అని వచ్చే సరికి మాటమార్చి రూ.988 కోట్ల అవినీతి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి విజిలెన్స్‌ నివేదిక ప్రకారం ఈఎస్ఐ వ్యవహారంలో పక్కదారి పట్టింది రూ.7.96 కోట్లు మాత్రమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. అందులోనూ అచ్చెన్నాయుడి ప్రమేయం, ప్రస్తావన ఎక్కడా లేదని.... విజిలెన్స్‌ రిపోర్టులో అచ్చెన్నాయుడి పేరు కూడా లేదన్నారు. ఎప్​ఐఆర్​లోనూ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేరు లేకపోయినా... ఇరువురిని అత్యంత దుర్మార్గంగా అరెస్ట్‌ చేశారన్నారు. గతంలో తన విశాఖ పర్యటన సమయంలోనూ అప్పటికప్పుడు నోటీసు ఇచ్చినందుకు డీజీపీ గంటల తరబడి కోర్టులో నిలబడ్డారన్న చంద్రబాబు.... ఇప్పుడు అచ్చెన్నాయుడు, జేసీ కుటుంబ సభ్యుల అరెస్ట్‌ సమయంలోనూ సరైన డాక్యుమెంటేషన్‌ లేకుండా వెళ్లారన్నారు. దీనికి కూడా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు.

నిబంధనలు వారికి వర్తించవా

అనారోగ్యంతో బాధపడుతున్న అచ్చెన్నాయుడుని పరామర్శించడానికి తెలుగుదేశం నాయకులు వెళితే... లాక్‌డౌన్‌ ఉల్లంఘన పేరుతో అడ్డుకున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే వైకాపా ఎమ్మెల్యేలు పెళ్లి రోజు, పుట్టినరోజు వేడుకలు చేసుకోవడానికి.. పూలు చల్లించుకుంటూ స్థానిక ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవడానికి.... నిబంధనలు వర్తించవా అని ప్రశ్నించారు. ఒంటరిగా వెళ్తున్న చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేశారని.. గుంపులు గుంపులుగా తిరిగి కరోనా వ్యాప్తికి కారణమైన వైకాపా నేతలపై కేసులు కూడా పెట్టరా అని నిలదీశారు. ప్రజాప్రతినిధులను అదుపులోకి తీసుకునే ముందు వారికి నోటీసులు ఇచ్చి, విచారణకు పిలవవచ్చని తెలిపారు. రానిపక్షంలో అప్పుడు చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న శంకర్‌ నారాయణ... అచ్చెన్నని ఆంబోతు అనడం సిగ్గుచేటని ఆక్షేపించారు.

అచ్చెన్నాయుడుపై ఏసీబీ దాడి జరగబోతుందా అని వైకాపా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన మరుసటి రోజే ఆయనను అరెస్ట్‌ చేశారన్న తెదేపా అధినేత.... మాజీ మంత్రి యనమల రామకృష్ణుడును అరెస్ట్‌ చేయబోతున్నారని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడిన వెంటనే ఆయనపై కుట్రకు తెరతీశారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే యనమల, చినరాజప్పపై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. జగన్‌ ఈ కక్షసాధింపు చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలందరూ వైకాపా విధానాలను నిరసించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి..

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్​రెడ్డి అరెస్టు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.