ETV Bharat / city

రాహుల్​ త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు - చంద్రబాబు ట్విట్టర్​ తాజా వార్తలు

కరోనా నుంచి కాంగ్రెస్​ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కోలుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. సీనియర్​ జర్నలిస్ట్​ అమర్​నాథ్​ మృతికి ఆయన సానుభూతి ప్రకటించారు.

chandrababu wishes rahul Gandhi for speedy recovery
రాహుల్​ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ట్వీట్​
author img

By

Published : Apr 20, 2021, 9:38 PM IST

కాంగ్రెస్​ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు.

  • Wishing @RahulGandhi ji a speedy recovery from COVID-19. I pray for his good health.

    — N Chandrababu Naidu (@ncbn) April 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీనియర్ జర్నలిస్ట్ అమర్​నాథ్ మృతికి సంతాపం..

సీనియర్ జర్నలిస్ట్ అమర్​నాథ్ కరోనాతో మృతి చెందడం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులుగాను.. జాతీయ స్థాయి జర్నలిస్ట్ యూనియన్​లో కీలక బాధ్యతలను నిర్వర్తించారని గుర్తు చేశారు. ప్రెస్ కౌన్సిల్​లో తెలుగు రాష్ట్రాల నుంచి కీలక బాధ్యతలు నిర్వహించి పాత్రికేయుల కోసం అహర్నిశలు శ్రమించారన్న చంద్రబాబు.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి:

అంత్యక్రియలకు అయినవాళ్లే కావాలా? వీళ్లూ కావాల్సిన వాళ్లే..!

ఝార్ఖండ్​లో లాక్​డౌన్​- దేశవ్యాప్తంగా కఠిన చర్యలు

కాంగ్రెస్​ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు.

  • Wishing @RahulGandhi ji a speedy recovery from COVID-19. I pray for his good health.

    — N Chandrababu Naidu (@ncbn) April 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీనియర్ జర్నలిస్ట్ అమర్​నాథ్ మృతికి సంతాపం..

సీనియర్ జర్నలిస్ట్ అమర్​నాథ్ కరోనాతో మృతి చెందడం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులుగాను.. జాతీయ స్థాయి జర్నలిస్ట్ యూనియన్​లో కీలక బాధ్యతలను నిర్వర్తించారని గుర్తు చేశారు. ప్రెస్ కౌన్సిల్​లో తెలుగు రాష్ట్రాల నుంచి కీలక బాధ్యతలు నిర్వహించి పాత్రికేయుల కోసం అహర్నిశలు శ్రమించారన్న చంద్రబాబు.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి:

అంత్యక్రియలకు అయినవాళ్లే కావాలా? వీళ్లూ కావాల్సిన వాళ్లే..!

ఝార్ఖండ్​లో లాక్​డౌన్​- దేశవ్యాప్తంగా కఠిన చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.