రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. స్థానిక సంస్థల్లో 59.85 రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను.... సుప్రీంకోర్టు విచారించింది. 4 వారాల్లోగా విచారణ పూర్తిచేయాలని హైకోర్టును ఆదేశించింది. ఏపీలో ప్రత్యేక పరిస్థితులు లేనందున....2010లో రాజ్యాంగ ధర్మాసనం తీర్పుకు అనుగుణంగానే ఎన్నికలు జరగాలని సుప్రీంకోర్టు తెలిపింది. షెడ్యూల్ ప్రాంతాలను మాత్రమే ప్రత్యేక పరిధిగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.