ETV Bharat / city

రాష్ట్రంలో 2018 వ్యూహం రిపీట్‌ అవుతుందా?.. ఏపీలో వైకాపా ఆశలు ఆవిరేనా? - andhrapradesh news

5 States Results: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా సత్తా చాటడంతో ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉండబోతోందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం? ముందస్తు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి మేలు జరుగుతుందనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై ప్రత్యేక కథనం.

political situation in telugu states
political situation in telugu states
author img

By

Published : Mar 11, 2022, 4:53 AM IST

5 States Results: లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా సత్తా చాటడంతో ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉండబోతోందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం? ముందస్తు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి మేలు జరుగుతుందనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. జమిలి ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీలకే నష్టమనే భావన కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ముందస్తు వ్యూహం ఫలించి తిరుగులేని విజయం సాధించారు. అప్పుడు తెలంగాణలో భాజపా ఘోర పరాజయం పాలైంది. ఒక్క అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

కానీ, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత 3 నెలలకే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా.. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణలో ప్రభావం చూపించగలిగింది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, సికింద్రాబాద్‌ ఎంపీ స్థానాల్లో కమలం పార్టీ విజయం సాధించి రాజకీయ పరిశీలకుల అంచనాలను తారుమారు చేసింది. ఆ తర్వాత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో భాజపా సత్తా చాటగా.. నాగార్జున సాగర్‌లో తెరాస విజయం సాధించింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా రెండు చోట్ల తెరాస అభ్యర్థులే విజయం సాధించారు. ఒక చోట మాత్రమే భాజపా గట్టి పోటీ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా భాజపా.. అధికారపార్టీకి చెమటలు పట్టించింది. అప్పటి నుంచి తెలంగాణలో భాజపా, తెరాస మధ్య పోరు మరింత ఉద్ధృతమైంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఈ రెండు పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా భాజపా, తెరాస మధ్యే మాటల యుద్ధం కొనసాగుతోంది.

భాజపా దూకుడుకు చెక్‌ పెట్టేనా?

తెలంగాణలో భాజపాకు చెక్‌ పెట్టేందుకు తెరాస అధినేత కేసీఆర్‌ తన వ్యూహాలకు పదును పెట్టారు. దేశాన్ని పాలిస్తున్న భాజపా అప్రజాస్వామిక విధానాలు అవలంభిస్తోందని, తెలంగాణ అభివృద్ధికి ఎలాంటి సహకారం అందించడం లేదనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మత తత్వశక్తుల నుంచి దేశాన్ని కాపాడుకుందామంటూ ఇటీవల దేశ రాజకీయాలపై దృష్టి సారించారు. సమాఖ్య స్ఫూర్తికి కేంద్రంలోని అధికార పార్టీ తూట్లు పొడుస్తుందంటూ.. వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అందులో భాగంగా ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌తో సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. వారు కూడా సీఎం కేసీఆర్‌ పోరాటానికి మద్దతిస్తామని ప్రకటించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సమాజ్‌ వాదీ పార్టీ నేతలు కూడా హైదరాబాద్‌ వచ్చి కేసీఆర్‌ను కలిసి వెళ్లారు. ఇటీవల తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో కేసీఆర్‌ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉంటే రాష్ట్రం మాదిరిగా దేశాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రకటించారు. ఇందుకోసం తెలంగాణ ప్రజల సంపూర్ణ మద్దతు కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో పంజాబ్‌ మినహా మిగిలిన రాష్ట్రాల్లో భాజపా సత్తా చాటింది.

ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహం ఏమిటో?

తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ప్రస్తుతం తెరాస కోసం పనిచేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో పీకే ఎలాంటి రాజకీయ వ్యూహాలు అవలంభిస్తారోననే ఉత్కంఠకు తెరలేచింది. సీఎం కేసీఆర్‌ డిసెంబరులో అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, మార్చిలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రచారం ప్రారంభించింది. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకత అంతగా లేదని, కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని తెరాస నేతలు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడం, భూముల ధరలు గణనీయంగా పెరగడం, దాదాపు 80వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించడం తెరాసకు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు.

అయితే, కేసీఆర్‌ దేశ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో జమిలి ఎన్నికలు వచ్చినా ఇబ్బందేమీ ఉండదనే వాదన ఉంది. ఓటమి భయంతోనే కేసీఆర్‌ ముందస్తుకు వెళ్తే నెగెటివ్‌ ప్రచారం కూడా వచ్చే అవకాశం ఉందని మరికొందరు వాదిస్తున్నారు. తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను బట్టి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే వాదన కూడా లేకపోలేదు. కానీ, దీనిపై ప్రశాంత్‌ కిశోర్‌ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారు.. సీఎం కేసీఆర్‌ ఆలోచన ఎలా ఉందో తెలుసుకోవాలంటే మరి కొన్నిరోజులు వేచి చూడాల్సిందే.

ఏపీకి ప్రత్యేక హోదా హుళక్కేనా?

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఉండే అవకాశముంది. కేంద్రంలోని భాజపాకు ఎప్పటికైనా తమ అవసరం రాకపోదా? అని ఆశగా ఎదురు చూస్తున్న వైకాపాకు ఈ ఫలితాలు కొంత నిరాశే అని చెప్పవచ్చు. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా విజయం సాధించకపోతే రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా వైకాపా అవసరం భాజపాకు ఉండేదేమో కానీ, ఇప్పుడా పరిస్థితిలేదు. హస్తినకు వెళ్లిన ప్రతిసారీ ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నామని వైకాపా నేతలు చెబుతున్నారు. హోదా వచ్చే వరకూ అడుగుతూనే ఉంటామని చెప్పారు... కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో వైకాపాను కేంద్రం ఏ మేరకు పట్టించుకుంటుంది.. వారి అవసరం ఏ మేరకు ఉంటుందనేది ప్రశ్నార్థకమే.

ఏపీలో భాజపా పరిస్థితి

ఇక .. ఏపీలో భాజపా పరిస్థితికి వస్తే ఉత్తర్‌ప్రదేశ్‌ ఉత్సాహం ఇక్కడ పెద్దగా లేనప్పటికీ ఎన్నికల సందర్భంగా పొత్తుల సమయంలో ఇది పనిచేస్తుందని స్థానిక నేతలు భావిస్తున్నారు. వైకాపా వైఫల్యాలను ఎండగడుతూ.. మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాటం చేసే అవకాశం ఉంది. మరోసారి కేంద్రంలో తామే అధికారంలోకి వస్తామన్న భరోసాతో పొత్తులో భాగంగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని ఆశపడుతున్నారు. ఏపీలో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు బోధపడింది. పొత్తుల అంశంపై ఇప్పటిప్పుడు స్పష్టత లేకపోయినా భవిష్యత్తులో ఈ విజయాలను అనుకూలంగా మార్చుకునే అవకాశం లేకపోలేదు. ఏపీలో మాత్రం ఇప్పటి వరకు ముందస్తు ఎన్నికల ఊసు ఎక్కడా వినిపించడంలేదు. లోక్‌సభ, అసెంబ్లీకి ఒకే సారి ఎన్నికలు వస్తాయనే అందరూ భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

5 States Results: లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా సత్తా చాటడంతో ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉండబోతోందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం? ముందస్తు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి మేలు జరుగుతుందనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. జమిలి ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీలకే నష్టమనే భావన కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ముందస్తు వ్యూహం ఫలించి తిరుగులేని విజయం సాధించారు. అప్పుడు తెలంగాణలో భాజపా ఘోర పరాజయం పాలైంది. ఒక్క అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

కానీ, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత 3 నెలలకే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా.. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణలో ప్రభావం చూపించగలిగింది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, సికింద్రాబాద్‌ ఎంపీ స్థానాల్లో కమలం పార్టీ విజయం సాధించి రాజకీయ పరిశీలకుల అంచనాలను తారుమారు చేసింది. ఆ తర్వాత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో భాజపా సత్తా చాటగా.. నాగార్జున సాగర్‌లో తెరాస విజయం సాధించింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా రెండు చోట్ల తెరాస అభ్యర్థులే విజయం సాధించారు. ఒక చోట మాత్రమే భాజపా గట్టి పోటీ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా భాజపా.. అధికారపార్టీకి చెమటలు పట్టించింది. అప్పటి నుంచి తెలంగాణలో భాజపా, తెరాస మధ్య పోరు మరింత ఉద్ధృతమైంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఈ రెండు పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా భాజపా, తెరాస మధ్యే మాటల యుద్ధం కొనసాగుతోంది.

భాజపా దూకుడుకు చెక్‌ పెట్టేనా?

తెలంగాణలో భాజపాకు చెక్‌ పెట్టేందుకు తెరాస అధినేత కేసీఆర్‌ తన వ్యూహాలకు పదును పెట్టారు. దేశాన్ని పాలిస్తున్న భాజపా అప్రజాస్వామిక విధానాలు అవలంభిస్తోందని, తెలంగాణ అభివృద్ధికి ఎలాంటి సహకారం అందించడం లేదనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మత తత్వశక్తుల నుంచి దేశాన్ని కాపాడుకుందామంటూ ఇటీవల దేశ రాజకీయాలపై దృష్టి సారించారు. సమాఖ్య స్ఫూర్తికి కేంద్రంలోని అధికార పార్టీ తూట్లు పొడుస్తుందంటూ.. వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అందులో భాగంగా ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌తో సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. వారు కూడా సీఎం కేసీఆర్‌ పోరాటానికి మద్దతిస్తామని ప్రకటించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సమాజ్‌ వాదీ పార్టీ నేతలు కూడా హైదరాబాద్‌ వచ్చి కేసీఆర్‌ను కలిసి వెళ్లారు. ఇటీవల తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో కేసీఆర్‌ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉంటే రాష్ట్రం మాదిరిగా దేశాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రకటించారు. ఇందుకోసం తెలంగాణ ప్రజల సంపూర్ణ మద్దతు కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో పంజాబ్‌ మినహా మిగిలిన రాష్ట్రాల్లో భాజపా సత్తా చాటింది.

ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహం ఏమిటో?

తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ప్రస్తుతం తెరాస కోసం పనిచేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో పీకే ఎలాంటి రాజకీయ వ్యూహాలు అవలంభిస్తారోననే ఉత్కంఠకు తెరలేచింది. సీఎం కేసీఆర్‌ డిసెంబరులో అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, మార్చిలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రచారం ప్రారంభించింది. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకత అంతగా లేదని, కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని తెరాస నేతలు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడం, భూముల ధరలు గణనీయంగా పెరగడం, దాదాపు 80వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించడం తెరాసకు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు.

అయితే, కేసీఆర్‌ దేశ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో జమిలి ఎన్నికలు వచ్చినా ఇబ్బందేమీ ఉండదనే వాదన ఉంది. ఓటమి భయంతోనే కేసీఆర్‌ ముందస్తుకు వెళ్తే నెగెటివ్‌ ప్రచారం కూడా వచ్చే అవకాశం ఉందని మరికొందరు వాదిస్తున్నారు. తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను బట్టి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే వాదన కూడా లేకపోలేదు. కానీ, దీనిపై ప్రశాంత్‌ కిశోర్‌ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారు.. సీఎం కేసీఆర్‌ ఆలోచన ఎలా ఉందో తెలుసుకోవాలంటే మరి కొన్నిరోజులు వేచి చూడాల్సిందే.

ఏపీకి ప్రత్యేక హోదా హుళక్కేనా?

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఉండే అవకాశముంది. కేంద్రంలోని భాజపాకు ఎప్పటికైనా తమ అవసరం రాకపోదా? అని ఆశగా ఎదురు చూస్తున్న వైకాపాకు ఈ ఫలితాలు కొంత నిరాశే అని చెప్పవచ్చు. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా విజయం సాధించకపోతే రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా వైకాపా అవసరం భాజపాకు ఉండేదేమో కానీ, ఇప్పుడా పరిస్థితిలేదు. హస్తినకు వెళ్లిన ప్రతిసారీ ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నామని వైకాపా నేతలు చెబుతున్నారు. హోదా వచ్చే వరకూ అడుగుతూనే ఉంటామని చెప్పారు... కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో వైకాపాను కేంద్రం ఏ మేరకు పట్టించుకుంటుంది.. వారి అవసరం ఏ మేరకు ఉంటుందనేది ప్రశ్నార్థకమే.

ఏపీలో భాజపా పరిస్థితి

ఇక .. ఏపీలో భాజపా పరిస్థితికి వస్తే ఉత్తర్‌ప్రదేశ్‌ ఉత్సాహం ఇక్కడ పెద్దగా లేనప్పటికీ ఎన్నికల సందర్భంగా పొత్తుల సమయంలో ఇది పనిచేస్తుందని స్థానిక నేతలు భావిస్తున్నారు. వైకాపా వైఫల్యాలను ఎండగడుతూ.. మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాటం చేసే అవకాశం ఉంది. మరోసారి కేంద్రంలో తామే అధికారంలోకి వస్తామన్న భరోసాతో పొత్తులో భాగంగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని ఆశపడుతున్నారు. ఏపీలో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు బోధపడింది. పొత్తుల అంశంపై ఇప్పటిప్పుడు స్పష్టత లేకపోయినా భవిష్యత్తులో ఈ విజయాలను అనుకూలంగా మార్చుకునే అవకాశం లేకపోలేదు. ఏపీలో మాత్రం ఇప్పటి వరకు ముందస్తు ఎన్నికల ఊసు ఎక్కడా వినిపించడంలేదు. లోక్‌సభ, అసెంబ్లీకి ఒకే సారి ఎన్నికలు వస్తాయనే అందరూ భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.