రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని కాపాడే అందరికీ అండగా ఉంటామని, ఎవరి విమర్శలను పట్టించుకోబోమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర నుంచి తాము ఆశీస్సులు తీసుకుంటే దానిపై తెదేపా నేతలు ఆరోపణలు చేయడం సరికాదని తెలిపారు. గతంలో ఆ పార్టీ నేతలు కూడా స్వామి నుంచి ఆశీస్సులు పొందారని వ్యాఖ్యానించారు. కార్తీక మాసం మొదటి సోమవారం రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమల్లేశ్వరస్వామి దేవస్థానం పరిధిలో విజయవాడ వాసి నరసింహారావు ఐదు కోట్ల 40 లక్షల రూపాయల విరాళంతో చేసిన శివాలయం అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి
అభివృద్ధి పనులు చేయాలంటే ఈసీ అనుమతి తీసుకోండి..: సుప్రీంకోర్టు