ETV Bharat / city

తెలంగాణ: మేయర్​ ఎన్నికపై ఎవరైనా సంప్రదిస్తే.. చర్చిస్తాం: ఎంఐఎం

author img

By

Published : Dec 5, 2020, 8:24 PM IST

జీహెచ్​ఎంసీ మేయర్ ఎన్నికపై తమనెవరూ సంప్రదించలేదని ఎంఐఎం జాతీయాధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. ఓటమిపై తెరాస పునరాలోచించుకోవాలని సూచించారు. గ్రేటర్​లో చూపినట్లు ప్రధాన ఎన్నికల్లో భాజపా ప్రభావం ఉండదని పేర్కొన్నారు.

mim-still-has-not-discussed
ఎంఐఎం జాతీయాధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ

ఎన్నిక ఏదైనా, పార్టీ ఏదైనా ప్రజల తీర్పు గౌరవించాల్సిందేనని ఎంఐఎం జాతీయాధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. మేయర్ ఎన్నికపై తమనెవరూ సంప్రదించలేదని, ఒకవేళ ఎవరైనా వస్తే.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

తాత్కాలికమే..

గ్రేటర్​ ఎన్నికల్లో భాజపా విజయం తాత్కాలికమేనన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేసిన వార్డులో కూడా భాజపా గెలవలేదని గుర్తు చేశారు. సర్జికల్ స్ట్రైక్ అని, రోహింగ్యాలు అని.. తప్పుడు ప్రచారాలు చేసి భాజపా లబ్ధి పొందిందని ఆరోపించారు.

తెరాస పునరాలోచించాలి...

తెలంగాణ రాష్ట్రంలో తెరాసకు మంచి ఆదరణ ఉందని అసదుద్దీన్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కోల్పోయిన వార్డులపై తెరాస ఆలోచించుకోవాలని సూచించారు. భాజపాకు, ఎంఐఎంకు ఎలాంటి పోటీ లేదని తెలిపారు.

ఇదీ చదవండి :

'ఎన్నికలు వాయిదా అనటం.. జగన్ పిరికితనానికి నిలువుటద్ధం'

ఎన్నిక ఏదైనా, పార్టీ ఏదైనా ప్రజల తీర్పు గౌరవించాల్సిందేనని ఎంఐఎం జాతీయాధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. మేయర్ ఎన్నికపై తమనెవరూ సంప్రదించలేదని, ఒకవేళ ఎవరైనా వస్తే.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

తాత్కాలికమే..

గ్రేటర్​ ఎన్నికల్లో భాజపా విజయం తాత్కాలికమేనన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేసిన వార్డులో కూడా భాజపా గెలవలేదని గుర్తు చేశారు. సర్జికల్ స్ట్రైక్ అని, రోహింగ్యాలు అని.. తప్పుడు ప్రచారాలు చేసి భాజపా లబ్ధి పొందిందని ఆరోపించారు.

తెరాస పునరాలోచించాలి...

తెలంగాణ రాష్ట్రంలో తెరాసకు మంచి ఆదరణ ఉందని అసదుద్దీన్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కోల్పోయిన వార్డులపై తెరాస ఆలోచించుకోవాలని సూచించారు. భాజపాకు, ఎంఐఎంకు ఎలాంటి పోటీ లేదని తెలిపారు.

ఇదీ చదవండి :

'ఎన్నికలు వాయిదా అనటం.. జగన్ పిరికితనానికి నిలువుటద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.