ETV Bharat / city

రేపు సికింద్రాబాద్​లో లష్కర్​ బోనాలు.. ఏర్పాట్లు పూర్తి

author img

By

Published : Jul 24, 2021, 2:23 PM IST

తెలంగాణలోని సికింద్రాబాద్​ లష్కర్​ బోనాల ఉత్సవాలు.. సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి. వేలాది మంది భక్తులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గతేడాది కరోనా నేపథ్యంలో.. ఉత్సవాలకు భక్తులు హాజరుకాలేకపోయారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాలు జరుపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. ఆదివారం జరిగే వేడుకలకు దేవాదాయ శాఖ అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

lashkar-bonalu
lashkar-bonalu

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. కరోనా నిబంధనలు పాటిస్తూనే భక్తులు అమ్మవారిని దర్శంచుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ మేరకు అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ప్రతిఒక్కరూ విధిగా మాస్కు ధరించి, శానిటైజర్​ వినియోగించాలని ఆలయ వర్గాలు కోరుతున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బోనం ఎత్తుకొని వచ్చే మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి.

ప్రధాన ఆకర్షణగా తొట్టెలు..

15 రోజుల పాటు జరిగే బోనాల వేడుక ఆషాఢమాసం మొదటి ఆదివారం ఘటోత్సవంతో ప్రారంభమవుతుంది. మూడో ఆదివారం వేలాది మంది ప్రజలు అక్కడి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. రెండ్రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు బోనాలు, రెండోరోజు రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. భక్తులు అమ్మవారికి బోనంతో పాటు సాకను సమర్పిస్తారు. అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను ఇంట్లో తయారు చేసుకుని.. ఓ బండిలో పెట్టుకుని ఊరేగిస్తూ వచ్చి.. అమ్మవారికి సమర్పించి మిగిలినది మహా ప్రసాదంగా అందరూ పంచుకుని తింటారు. వీటినే ఫలహార బండ్లు అంటారు. ఈ ఉత్సవంలో మరో ప్రధాన ఆకర్షణ తొట్టెలు. రంగురంగుల అట్టలతో తయారు చేసిన తొట్టెలను.. ఊరేగింపుగా తీసుకొచ్చి మొక్కు తీర్చుకుంటారు.

ఆ మహిళతో భవిష్యవాణి..

ఒళ్లంతా పసుపు పూసుకుని నృత్యం చేస్తూ భక్తులను పోతురాజులు రంజింపజేస్తారు. బోనాల మరుసటి రోజు ఈ నెల 26న రంగం కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా అవివాహిత మహిళ.. పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపించనుంది. బోనాల ఉత్సవాలకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు. రంగం తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగుపై ఉంచి... మంగళ వాయిద్యాలు, కళాకారులు, ఆటపాటలతో ఊరేగించుకుంటూ.. సాగనంపడంతో బోనాల సంబురం ముగుస్తుంది.

ఇదీ చూడండి: Covishield: రాష్ట్రానికి మరో 3.72 లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. కరోనా నిబంధనలు పాటిస్తూనే భక్తులు అమ్మవారిని దర్శంచుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ మేరకు అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ప్రతిఒక్కరూ విధిగా మాస్కు ధరించి, శానిటైజర్​ వినియోగించాలని ఆలయ వర్గాలు కోరుతున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బోనం ఎత్తుకొని వచ్చే మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి.

ప్రధాన ఆకర్షణగా తొట్టెలు..

15 రోజుల పాటు జరిగే బోనాల వేడుక ఆషాఢమాసం మొదటి ఆదివారం ఘటోత్సవంతో ప్రారంభమవుతుంది. మూడో ఆదివారం వేలాది మంది ప్రజలు అక్కడి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. రెండ్రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు బోనాలు, రెండోరోజు రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. భక్తులు అమ్మవారికి బోనంతో పాటు సాకను సమర్పిస్తారు. అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను ఇంట్లో తయారు చేసుకుని.. ఓ బండిలో పెట్టుకుని ఊరేగిస్తూ వచ్చి.. అమ్మవారికి సమర్పించి మిగిలినది మహా ప్రసాదంగా అందరూ పంచుకుని తింటారు. వీటినే ఫలహార బండ్లు అంటారు. ఈ ఉత్సవంలో మరో ప్రధాన ఆకర్షణ తొట్టెలు. రంగురంగుల అట్టలతో తయారు చేసిన తొట్టెలను.. ఊరేగింపుగా తీసుకొచ్చి మొక్కు తీర్చుకుంటారు.

ఆ మహిళతో భవిష్యవాణి..

ఒళ్లంతా పసుపు పూసుకుని నృత్యం చేస్తూ భక్తులను పోతురాజులు రంజింపజేస్తారు. బోనాల మరుసటి రోజు ఈ నెల 26న రంగం కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా అవివాహిత మహిళ.. పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపించనుంది. బోనాల ఉత్సవాలకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు. రంగం తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగుపై ఉంచి... మంగళ వాయిద్యాలు, కళాకారులు, ఆటపాటలతో ఊరేగించుకుంటూ.. సాగనంపడంతో బోనాల సంబురం ముగుస్తుంది.

ఇదీ చూడండి: Covishield: రాష్ట్రానికి మరో 3.72 లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.