ETV Bharat / city

ఆ కేసులో లాలూ ప్రసాద్​ యాదవ్​కు బెయిల్​..

author img

By

Published : Apr 23, 2022, 10:38 AM IST

దాణా కుంభకోణం కేసులో జైల్లో ఉన్న ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్​యాదవ్​కు ఝార్ఖండ్​ హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. దాణా కుంభకోణం ఐదో కేసు.. దొరండా ట్రెజరీ నుంచి రూ.139 కోట్లు అక్రమంగా డ్రా చేసుకున్నారన్న అభియోగాలను నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఫిబ్రవరి 15న లాలూకు ఐదేళ్ల జైలుశిక్ష వేసింది.

లాలూ
లాలూ

దాణా కుంభకోణం కేసులో జైల్లో ఉన్న ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్​యాదవ్​కు ఝార్ఖండ్​ హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. దాణా కుంభకోణం ఐదో కేసు.. దొరండా ట్రెజరీ నుంచి రూ.139 కోట్లు అక్రమంగా డ్రా చేసుకున్నారన్న అభియోగాలను నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఫిబ్రవరి 15న లాలూకు ఐదేళ్ల జైలుశిక్ష వేసింది. ఈ తీర్పును సస్పెండ్​ చేయాలని దాఖలు చేసిన పిటిషన్​ను విచారణకు స్వీకరించటంతో పాటు బెయిల్​ మంజూరు చేసినట్లు లాలూ తరఫు న్యాయవాది తెలిపారు.

ఈ కేసులో ఇప్పటికే ఆయన సగం శిక్ష పూర్తి చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 41 నెలలు జైళ్లో ఉన్నారని.. అందుకు సంబంధించి కింది కోర్టు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించినట్లు చెప్పారు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న ఝార్ఖండ్​ హైకోర్టు.. లాలూకు బెయిల్​ మంజూరు చేసినట్లు తెలిపారు.

దాణా కుంభకోణం కేసులో జైల్లో ఉన్న ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్​యాదవ్​కు ఝార్ఖండ్​ హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. దాణా కుంభకోణం ఐదో కేసు.. దొరండా ట్రెజరీ నుంచి రూ.139 కోట్లు అక్రమంగా డ్రా చేసుకున్నారన్న అభియోగాలను నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఫిబ్రవరి 15న లాలూకు ఐదేళ్ల జైలుశిక్ష వేసింది. ఈ తీర్పును సస్పెండ్​ చేయాలని దాఖలు చేసిన పిటిషన్​ను విచారణకు స్వీకరించటంతో పాటు బెయిల్​ మంజూరు చేసినట్లు లాలూ తరఫు న్యాయవాది తెలిపారు.

ఈ కేసులో ఇప్పటికే ఆయన సగం శిక్ష పూర్తి చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 41 నెలలు జైళ్లో ఉన్నారని.. అందుకు సంబంధించి కింది కోర్టు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించినట్లు చెప్పారు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న ఝార్ఖండ్​ హైకోర్టు.. లాలూకు బెయిల్​ మంజూరు చేసినట్లు తెలిపారు.

ఇవీ చూడండి..

'అమరావతిపై తీర్పును ఉద్దేశపూర్వకంగానే అమలు చేయలేదు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.