ETV Bharat / city

పవన్ పాదయాత్ర బాధ్యతలు చంద్రశేఖర్​కు అప్పగింత

author img

By

Published : Oct 21, 2019, 5:34 PM IST

భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3 లేదా 4న జనసేన నిర్వహించనున్న పాదయాత్ర ఏర్పాట్లపై పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించింది. పాదయాత్రకు సంబంధించిన బాధ్యతలను తోట చంద్రశేఖర్​కు అప్పగించారు.

జనసేన పార్టీ నేతల సమావేశం

భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3 లేదా 4న విశాఖలో పవన్‌ కల్యాణ్‌ పాదయాత్ర చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ నేతలు సమావేశమయ్యారు. హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ సమాలోచనలు జరిపారు. పాదయాత్రకు సంబంధించిన బాధ్యతలు తోట చంద్రశేఖర్​కు అప్పగిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. చేయాల్సిన పనులు, అధినేత భద్రత వంటి అంశాలపై చర్చించారు.

జనసేన పార్టీ నేతల సమావేశం

భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3 లేదా 4న విశాఖలో పవన్‌ కల్యాణ్‌ పాదయాత్ర చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ నేతలు సమావేశమయ్యారు. హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ సమాలోచనలు జరిపారు. పాదయాత్రకు సంబంధించిన బాధ్యతలు తోట చంద్రశేఖర్​కు అప్పగిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. చేయాల్సిన పనులు, అధినేత భద్రత వంటి అంశాలపై చర్చించారు.

జనసేన పార్టీ నేతల సమావేశం

ఇవీ చదవండి..

బంగారమైనా దొరుకుతుందేమో.. ఇసుక దొరికేలా లేదు!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.