ETV Bharat / city

పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరో నాకు తెలియదు: ఎంపీ విజయసాయి

author img

By

Published : Jul 3, 2020, 5:50 PM IST

దిల్లీలో వైకాపా ఎంపీలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఎంపీ విజయసాయి రెడ్డి సమాధానం దాట వేశారు. ఆ ప్రశ్న పూర్తిగా అసంబద్ధమని అన్నారు.

vijaya sai reddy
vijaya sai reddy
మీడియా సమావేశంలో ఎంపీ విజయసాయి రెడ్డి

స్వపక్షంలో విపక్షంలా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రవర్తిస్తున్నందునే ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు వైకాపా ఎంపీలు తెలిపారు. పార్లమెంట్​లో స్పీకర్​ ఓం బిర్లాను కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఏ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారో ఆ పార్టీపైనే ఆరోపణలు చేయడం సముచితం కాదన్నారు. అయితే ఈ నిబంధనలు వైకాపా ఎంపీకేనా తెదేపా రెబల్ ఎమ్మెల్యేలకు వర్తించవా అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు విజయసాయి రెడ్డి సమాధానం దాట వేశారు.

'మీరు చెప్పే ఎమ్మెల్యేలు ఎవరో నాకు తెలియదు. మీ ప్రశ్న పూర్తిగా అసంబద్ధం. మా పార్టీలో వారు చేరలేదు. ఏ పార్టీ నుంచి మారారని అంటున్నారో ఆ పార్టీ అధ్యక్షుడిని ఈ ప్రశ్న అడగండి' అని విజయసాయి రెడ్డి సమాధానం ఇచ్చారు.

మీడియా సమావేశంలో ఎంపీ విజయసాయి రెడ్డి

స్వపక్షంలో విపక్షంలా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రవర్తిస్తున్నందునే ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు వైకాపా ఎంపీలు తెలిపారు. పార్లమెంట్​లో స్పీకర్​ ఓం బిర్లాను కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఏ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారో ఆ పార్టీపైనే ఆరోపణలు చేయడం సముచితం కాదన్నారు. అయితే ఈ నిబంధనలు వైకాపా ఎంపీకేనా తెదేపా రెబల్ ఎమ్మెల్యేలకు వర్తించవా అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు విజయసాయి రెడ్డి సమాధానం దాట వేశారు.

'మీరు చెప్పే ఎమ్మెల్యేలు ఎవరో నాకు తెలియదు. మీ ప్రశ్న పూర్తిగా అసంబద్ధం. మా పార్టీలో వారు చేరలేదు. ఏ పార్టీ నుంచి మారారని అంటున్నారో ఆ పార్టీ అధ్యక్షుడిని ఈ ప్రశ్న అడగండి' అని విజయసాయి రెడ్డి సమాధానం ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.