ETV Bharat / city

ఎల్జీ పాలిమర్స్ యంత్ర సామగ్రి అమ్మేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

author img

By

Published : Apr 6, 2021, 4:29 PM IST

ఎల్జీ పాలిమర్స్​కు సంబంధించిన యంత్ర సామగ్రి అమ్మేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఆ మొత్తాన్ని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. హైకోర్టు తుది తీర్పు మేరకు నడుచుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు.

హైకోర్టు
హైకోర్టు
న్యాయవాది నర్రా శ్రీనివాస్

విశాఖ ఎల్జీ పాలిమర్స్​కు సంబంధించిన యంత్ర సామగ్రి అమ్మేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. కంపెనీలో విషవాయవులు విడుదలై ప్రాణ నష్టం సంభవించినందున ఎల్జీ పాలిమర్స్ మూసివేయాలని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కంపెనీలోని యంత్రసామగ్రిని అమ్మేందుకు అనుమతి ఇవ్వాలని ఎల్జీ పాలిమర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్​కుమార్ గోస్వామి, జస్టిస్ ప్రవీణ్​కుమార్ ధర్మాసనం ఈ పిటిషన్ విచారించింది. యంత్రసామగ్రిని అమ్మేందుకు అనుమతించిన హైకోర్టు... ఆ మొత్తాన్ని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. హైకోర్టు తుదితీర్పు మేరకు నడుచుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు.

ఇదీ చదవండి:

జస్టిస్​ రమణ 'తీర్పు'తో న్యాయంపై నమ్మకం!

న్యాయవాది నర్రా శ్రీనివాస్

విశాఖ ఎల్జీ పాలిమర్స్​కు సంబంధించిన యంత్ర సామగ్రి అమ్మేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. కంపెనీలో విషవాయవులు విడుదలై ప్రాణ నష్టం సంభవించినందున ఎల్జీ పాలిమర్స్ మూసివేయాలని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కంపెనీలోని యంత్రసామగ్రిని అమ్మేందుకు అనుమతి ఇవ్వాలని ఎల్జీ పాలిమర్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్​కుమార్ గోస్వామి, జస్టిస్ ప్రవీణ్​కుమార్ ధర్మాసనం ఈ పిటిషన్ విచారించింది. యంత్రసామగ్రిని అమ్మేందుకు అనుమతించిన హైకోర్టు... ఆ మొత్తాన్ని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. హైకోర్టు తుదితీర్పు మేరకు నడుచుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్లు న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు.

ఇదీ చదవండి:

జస్టిస్​ రమణ 'తీర్పు'తో న్యాయంపై నమ్మకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.