ETV Bharat / city

జీహెచ్​ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్​ డ్రైవర్​కు కరోనా

author img

By

Published : Jun 11, 2020, 10:33 PM IST

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్​ డ్రైవర్​కు కరోనా పాజిటివ్​గా నిర్దారణ అయ్యింది. ఈ క్రమంలో మేయర్​ కుటుంబ సభ్యులందరినీ అధికారులు హోం క్వారంటైన్​ చేశారు. శుక్రవారం మరోసారి మేయర్​కు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.

జీహెచ్​ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్​ డ్రైవర్​కు కరోనా
జీహెచ్​ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్​ డ్రైవర్​కు కరోనా

తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. అన్ని శాఖలకు విస్తరిస్తూ... జీహెచ్​ఎంసీ మేయర్​ కార్యాలయాన్ని కూడా తాకింది. తాజాగా మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్​కు కరోనా వైరస్​ సోకింది. ​ఉదయం నుంచి విధులు నిర్వహించిన డ్రైవర్‌కు ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనతో మేయర్ కుటుంబ సభ్యులందరినీ... హోం క్వారంటైన్‌ చేశారు.

శుక్రవారం మరోసారి మేయర్‌కు కొవిడ్​- 19 పరీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ రాగా... అందరికీ పరీక్షలు నిర్వహించారు. మేయర్ పేషీలో రెండో కరోనా పాజిటివ్‌ రావడం కలకలం రేపుతోంది.

తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. అన్ని శాఖలకు విస్తరిస్తూ... జీహెచ్​ఎంసీ మేయర్​ కార్యాలయాన్ని కూడా తాకింది. తాజాగా మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్​కు కరోనా వైరస్​ సోకింది. ​ఉదయం నుంచి విధులు నిర్వహించిన డ్రైవర్‌కు ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనతో మేయర్ కుటుంబ సభ్యులందరినీ... హోం క్వారంటైన్‌ చేశారు.

శుక్రవారం మరోసారి మేయర్‌కు కొవిడ్​- 19 పరీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ రాగా... అందరికీ పరీక్షలు నిర్వహించారు. మేయర్ పేషీలో రెండో కరోనా పాజిటివ్‌ రావడం కలకలం రేపుతోంది.

ఇదీ చూడండి..

'వైకాపా ఎమ్మెల్యేల అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధమా..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.