అమరావతిపై వ్యతిరేకతతో కొందరు నాయకులు ఇన్నాళ్లూ విషప్రచారం చేశారని రాజధాని రైతులు మండిపడ్డారు. మూడు రాజధానుల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అమరావతిలో రైతులు, కూలీలు చేస్తున్న నిరసనలు మంగళవారం 399వ రోజు కొనసాగించారు. రైతుల దీక్ష బుధవారానికి 400వ రోజుకు చేరుకుటున్న సందర్భంగా ‘అమరావతి సంకల్ప ర్యాలీ’ నిర్వహించనున్నట్లు ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ తెలిపారు. తుళ్లూరులో ఉదయం 9 గంటలకు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలతో ప్రారంభమయ్యే ర్యాలీ పెదపరిమి, నెక్కల్లు, వెలగపూడి గ్రామాల మీదుగా మందడం వరకు సాగనుందని చెప్పారు. అన్ని వర్గాల వారు పాల్గొనాలని ఆయన కోరారు.
ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో విష ప్రచారం తగదు: రాజధాని రైతులు
అమరావతిపై వైకాపా నాయకులు చేసే ఆరోపణలు వాస్తవాలు కాదని, విష ప్రచారమేనని రాజధాని రైతులు మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వేసిన కేసులను హైకోర్టు కొట్టివేయడమే దీనికి నిదర్శనమని అన్నారు.
![ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో విష ప్రచారం తగదు: రాజధాని రైతులు farmers protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10306411-423-10306411-1611107760200.jpg?imwidth=3840)
అమరావతిపై వ్యతిరేకతతో కొందరు నాయకులు ఇన్నాళ్లూ విషప్రచారం చేశారని రాజధాని రైతులు మండిపడ్డారు. మూడు రాజధానుల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అమరావతిలో రైతులు, కూలీలు చేస్తున్న నిరసనలు మంగళవారం 399వ రోజు కొనసాగించారు. రైతుల దీక్ష బుధవారానికి 400వ రోజుకు చేరుకుటున్న సందర్భంగా ‘అమరావతి సంకల్ప ర్యాలీ’ నిర్వహించనున్నట్లు ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ తెలిపారు. తుళ్లూరులో ఉదయం 9 గంటలకు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలతో ప్రారంభమయ్యే ర్యాలీ పెదపరిమి, నెక్కల్లు, వెలగపూడి గ్రామాల మీదుగా మందడం వరకు సాగనుందని చెప్పారు. అన్ని వర్గాల వారు పాల్గొనాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: