ETV Bharat / city

తెలంగాణ: 'వసతి గృహాలు ఖాళీ చేయిస్తే కఠిన చర్యలు' - బలవంతంగా బయటకు పంపితే కఠిన చర్యలే : డీజీపీ

తెలంగాణలో వసతి గృహాల యాజమాన్యాలు విద్యార్థులు, ఉద్యోగులను బయటకు పంపేయడంపై డీజీపీ మహేందర్​రెడ్డి మండిపడ్డారు. బలవంతంగా ఖాళీ చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వెంటనే బాధితులందరినీ వెనక్కి పిలవాలని సూచించారు.

తెలంగాణ: 'వసతి గృహాలు ఖాళీ చేయిస్తే కఠిన చర్యలు'
తెలంగాణ: 'వసతి గృహాలు ఖాళీ చేయిస్తే కఠిన చర్యలు'
author img

By

Published : Mar 26, 2020, 8:17 AM IST

ఆపత్కాల సమయంలో తెలంగాణలోని వసతి గృహాల్లో విద్యార్థులు, ఉద్యోగులను ఖాళీ చేయమనడంపై డీజీపీ మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని వసతి గృహాల్లో ఉంటున్నవారిని ఖాళీ చేయించవద్దన్న డీజీపీ.. అలా చేస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ కారణంగా వసతి గృహాల నిర్వాహణ కొనసాగించాలని ఆదేశించారు.

వారితో సమన్వయం...

జీహెచ్​ఎంసీ అధికారులు, పోలీసులతో సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించాలని సూచించారు. లాక్ డౌన్ అమల్లో ఉన్న కారణంగా ఎలాంటి అనుమతి పత్రాలు చెల్లవని ఆయన స్పష్టం చేశారు. తదుపరి అదేశాల వచ్చే వరకు ఎలాంటి అనుమతులు పనిచేయవని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు గుంపులుగా రావద్దని ఆదేశాలు జారీ చేశారు.

ఆపత్కాల సమయంలో తెలంగాణలోని వసతి గృహాల్లో విద్యార్థులు, ఉద్యోగులను ఖాళీ చేయమనడంపై డీజీపీ మహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని వసతి గృహాల్లో ఉంటున్నవారిని ఖాళీ చేయించవద్దన్న డీజీపీ.. అలా చేస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ కారణంగా వసతి గృహాల నిర్వాహణ కొనసాగించాలని ఆదేశించారు.

వారితో సమన్వయం...

జీహెచ్​ఎంసీ అధికారులు, పోలీసులతో సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించాలని సూచించారు. లాక్ డౌన్ అమల్లో ఉన్న కారణంగా ఎలాంటి అనుమతి పత్రాలు చెల్లవని ఆయన స్పష్టం చేశారు. తదుపరి అదేశాల వచ్చే వరకు ఎలాంటి అనుమతులు పనిచేయవని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు గుంపులుగా రావద్దని ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చూడండి:

కరోనా కష్టాలు.. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వారికి నో ఎంట్రీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.