ETV Bharat / city

కార్మికులు రాజీ పడతారా? మరింతగా పోరాడతారా?

author img

By

Published : Nov 5, 2019, 8:26 AM IST

డిమాండ్లు పరిష్కరించాలంటూ సమ్మె కొనసాగిస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించిన గడువు.. నేటితో ముగియనుంది. అర్ధరాత్రిలోగా విధుల్లో చేరని వారిని.... ఇక ఎప్పటికీ తీసుకోకూడదన్న నిర్ణయానికి సర్కారు వచ్చింది. కార్మికులు మొండిగా వ్యవహరిస్తే.. మిగిలిన 5వేల మార్గాల్లోనూ ప్రైవేట్‌ వాహనాలకు అనుమతులు ఇస్తామని స్పష్టంచేసింది.

tsrtc
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఏం చేయబోతున్నారు?

అర్ధరాత్రిలోగా విధుల్లో చేరని.. RTC కార్మికులను ఎట్టిపరిస్థితుల్లో ఉద్యోగంలో చేర్చుకోవద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విధుల్లో చేరేందుకు ఇచ్చిన అవకాశం ఉపయోగించుకుని... ఉద్యోగాలు కాపాడుకోవడమా లేక ఉద్యోగాలు కోల్పోయి కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసుకుంటారో కార్మికులే తేల్చుకోవాలని సూచించింది. గడువులోగా చేరకుంటే మిగిలిన 5వేలమార్గాల్లోనూ ప్రైవేట్‌ వాహనాలకు అనుమతులివ్వాలని... అప్పుడు రాష్ట్రంలో ఆర్టీసీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సీనియర్​ అధికారులతో సమీక్ష

ఆర్టీసీ సమ్మె, సమ్మెవిషయంలో ఈనెల 7న హైకోర్టు విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్‌ ఎస్​కే జోషి, అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారావు సహా... సీనియర్ అధికారులతో సమీక్షించారు. సమ్మెవిచారణ సందర్భంగా అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు.

అర్ధరాత్రితో గడువు ముగింపు

కార్మికచట్టాలు, కేంద్ర రవాణా చట్టాన్ని పరిశీలించడంతో పాటు న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నారు. కార్మికుల కుటుంబాల భవిష్యత్‌.. కార్మికుల చేతుల్లోనే ఉందని సమావేశం అభిప్రాయపడింది. సమ్మె చట్ట విరుద్ధమైనదని.. కార్మిక శాఖ నివేదిక ఇచ్చినా మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఇచ్చిన అవకాశం వినియోగించుకోకుంటే అర్థంలేదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. గడువులోగా కార్మికులు విధుల్లో చేరకుంటే, మిగిలిన ఐదువేల మార్గాల్లోనూ ప్రైవేట్ వాహనాలకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని.. ఐదో తేదీ అనగా ఇవాళ అర్ధరాత్రి తర్వాత ఆ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపింది.

దానికి కార్మికులే కారణం

అదే జరిగితే రాష్ట్రం.. ఆర్టీసీ రహిత రాష్ట్రంగా మారుతుందని... ఆ పరిస్థితికి ముమ్మాటికీ కార్మికులే కారణమవుతారని వ్యాఖ్యానించింది. హైకోర్టులో విచారణను చూపి కార్మిక సంఘాల నేతలు కార్మికులను మభ్యపెడుతున్నారని... న్యాయనిపుణుల అభిప్రాయం ప్రకారం సమ్మెవిషయంలో న్యాయస్థానం... ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదని సమావేశం అభిప్రాయపడింది.

హైకోర్టు తీర్పు మరోలా ఉంటే ఆర్టీసీ, ప్రభుత్వంగానీ.. సుప్రీంకోర్టుకు వెళ్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కేసు సుప్రీంకోర్టుకు వెళ్తే... అక్కడ విచారణ మరింత ఆలస్యమవుతుందని తద్వారా కార్మికులకు ఒరిగేదేమీ ఉండదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.

సంసిద్ధత లేఖలు ఇవ్వోచ్చు

ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా విధుల్లో చేరాలనుకునే కార్మికులు.. తాము పనిచేస్తున్న డిపో మేనేజర్లకే కాకుండా.. పలుచోట్ల సంసిద్ధత లేఖలు ఇవ్వొచ్చని ఆర్టీసీ ఇన్​ఛార్జీ ఎండీ సునీల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. కార్మికులు ఆయా జిల్లా కలెకర్‌, ఎస్పీ, ఆర్డీఓ, డీఎస్పీ, డీవీఎం లేదా రీజినల్‌ మేనేజర్‌ కార్యాలయంలో ఇవ్వవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పనిచేసే కార్మికులు బస్‌భవన్ లేదా ఈడీ కార్యాలయాల్లో లేఖలు అందించవచ్చని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల రాత్రి వరకు వచ్చిన లేఖలన్నీ హైదరాబాద్ చేరుకుంటాయన్న ఆయన.. వాటిని ప్రభుత్వానికి పంపనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని కార్మికులు వినియోగించుకోవాలని.. విధుల్లో చేరే కార్మికులకు అన్ని రకాల రక్షణ కల్పించనున్నట్లు పునరుద్ఘాటించారు.

రాజీనా.. పోరాటమా?

ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రాజీ పడి ఉద్యోగాల్లో చేరతారా? లేదంటే డిమాండ్ల సాధన కోసం మరింత ఉధృతంగా పోరాడతారా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు చర్చించుకుంటున్నారు. సమ్మె ప్రభావం ఇరు రాష్ట్రాల ప్రయాణికులపై పడుతున్న పరిస్థితుల్లో.. అసలు తెలంగాణ ఆర్టీసీలో ఇవాళ ఏం జరగబోతోందన్నది.. ఆసక్తికరంగా మారింది.

ఇవీ చూడండి:

అబ్దుల్లాపూర్‌మెట్‌లో విషాదం... తహసీల్దార్ దారుణ హత్య

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఏం చేయబోతున్నారు?

అర్ధరాత్రిలోగా విధుల్లో చేరని.. RTC కార్మికులను ఎట్టిపరిస్థితుల్లో ఉద్యోగంలో చేర్చుకోవద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విధుల్లో చేరేందుకు ఇచ్చిన అవకాశం ఉపయోగించుకుని... ఉద్యోగాలు కాపాడుకోవడమా లేక ఉద్యోగాలు కోల్పోయి కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసుకుంటారో కార్మికులే తేల్చుకోవాలని సూచించింది. గడువులోగా చేరకుంటే మిగిలిన 5వేలమార్గాల్లోనూ ప్రైవేట్‌ వాహనాలకు అనుమతులివ్వాలని... అప్పుడు రాష్ట్రంలో ఆర్టీసీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సీనియర్​ అధికారులతో సమీక్ష

ఆర్టీసీ సమ్మె, సమ్మెవిషయంలో ఈనెల 7న హైకోర్టు విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్‌ ఎస్​కే జోషి, అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారావు సహా... సీనియర్ అధికారులతో సమీక్షించారు. సమ్మెవిచారణ సందర్భంగా అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు.

అర్ధరాత్రితో గడువు ముగింపు

కార్మికచట్టాలు, కేంద్ర రవాణా చట్టాన్ని పరిశీలించడంతో పాటు న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నారు. కార్మికుల కుటుంబాల భవిష్యత్‌.. కార్మికుల చేతుల్లోనే ఉందని సమావేశం అభిప్రాయపడింది. సమ్మె చట్ట విరుద్ధమైనదని.. కార్మిక శాఖ నివేదిక ఇచ్చినా మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఇచ్చిన అవకాశం వినియోగించుకోకుంటే అర్థంలేదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. గడువులోగా కార్మికులు విధుల్లో చేరకుంటే, మిగిలిన ఐదువేల మార్గాల్లోనూ ప్రైవేట్ వాహనాలకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని.. ఐదో తేదీ అనగా ఇవాళ అర్ధరాత్రి తర్వాత ఆ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపింది.

దానికి కార్మికులే కారణం

అదే జరిగితే రాష్ట్రం.. ఆర్టీసీ రహిత రాష్ట్రంగా మారుతుందని... ఆ పరిస్థితికి ముమ్మాటికీ కార్మికులే కారణమవుతారని వ్యాఖ్యానించింది. హైకోర్టులో విచారణను చూపి కార్మిక సంఘాల నేతలు కార్మికులను మభ్యపెడుతున్నారని... న్యాయనిపుణుల అభిప్రాయం ప్రకారం సమ్మెవిషయంలో న్యాయస్థానం... ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదని సమావేశం అభిప్రాయపడింది.

హైకోర్టు తీర్పు మరోలా ఉంటే ఆర్టీసీ, ప్రభుత్వంగానీ.. సుప్రీంకోర్టుకు వెళ్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కేసు సుప్రీంకోర్టుకు వెళ్తే... అక్కడ విచారణ మరింత ఆలస్యమవుతుందని తద్వారా కార్మికులకు ఒరిగేదేమీ ఉండదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.

సంసిద్ధత లేఖలు ఇవ్వోచ్చు

ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా విధుల్లో చేరాలనుకునే కార్మికులు.. తాము పనిచేస్తున్న డిపో మేనేజర్లకే కాకుండా.. పలుచోట్ల సంసిద్ధత లేఖలు ఇవ్వొచ్చని ఆర్టీసీ ఇన్​ఛార్జీ ఎండీ సునీల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. కార్మికులు ఆయా జిల్లా కలెకర్‌, ఎస్పీ, ఆర్డీఓ, డీఎస్పీ, డీవీఎం లేదా రీజినల్‌ మేనేజర్‌ కార్యాలయంలో ఇవ్వవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పనిచేసే కార్మికులు బస్‌భవన్ లేదా ఈడీ కార్యాలయాల్లో లేఖలు అందించవచ్చని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల రాత్రి వరకు వచ్చిన లేఖలన్నీ హైదరాబాద్ చేరుకుంటాయన్న ఆయన.. వాటిని ప్రభుత్వానికి పంపనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని కార్మికులు వినియోగించుకోవాలని.. విధుల్లో చేరే కార్మికులకు అన్ని రకాల రక్షణ కల్పించనున్నట్లు పునరుద్ఘాటించారు.

రాజీనా.. పోరాటమా?

ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రాజీ పడి ఉద్యోగాల్లో చేరతారా? లేదంటే డిమాండ్ల సాధన కోసం మరింత ఉధృతంగా పోరాడతారా అని తెలుగు రాష్ట్రాల ప్రజలు చర్చించుకుంటున్నారు. సమ్మె ప్రభావం ఇరు రాష్ట్రాల ప్రయాణికులపై పడుతున్న పరిస్థితుల్లో.. అసలు తెలంగాణ ఆర్టీసీలో ఇవాళ ఏం జరగబోతోందన్నది.. ఆసక్తికరంగా మారింది.

ఇవీ చూడండి:

అబ్దుల్లాపూర్‌మెట్‌లో విషాదం... తహసీల్దార్ దారుణ హత్య

Intro:tg_nlg_211_18_jk_bioplack_vidhanam_pkg_TS10117
యాంకర్: ఆలోచనలకు పదును పెట్టి శాస్త్రీయతను జతచేసి సాగు చేస్తే లాభాల పంట పండాల్సిందే. బయోప్లాక్ అనే వినూత్న పద్దతిలో చేపల పెంపకానికి శ్రీకారం చుట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు నల్గొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన రైతు. ఈ తరహా విధానం తెలంగాణలో ఇదే మొదటిది కావడం విశేషం...look
vo1: నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రానికి చెందిన కొద్దిరోజుల క్రితం వరకు దేశ సరిహద్దుల్లో జవాన్ గా పనిచేసారు. ఉద్యోగం వదిలేసాక వ్యవసాయం మీద మక్కువతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కన నార్కట్పల్లి వద్ద వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసి బయో ప్లాక్ పద్దతిలో చేపల పెంపకాన్ని ప్రారంభించారు. చేపల సాగులో వివిధ పద్దతులు ఉన్నాయి. చెరువులు కుంటలు తవ్వి పెంచటం ,వలలు ఏర్పాటు చేసి చేపలు పెంచటం వంటి పద్దతులు ఉపయోగిస్తారు. కానీ బయో ప్లాక్ పద్దతి ఇందుకు భిన్నం. నీటిని కలుషితం చేసే వ్యర్థాలు, మిగిలిన ఆహరం వంటివి విషపదార్థాలుగా మరి చేపలకు హాని కలగకుండా చేయడమే బయో ప్లాక్ విధానం.ఈవిధానంలో మాటిమాటికి నీటిని మార్చకుండా వ్యర్థాలను కూడా ఆహారంగా మార్చే ప్రక్రియ ఉంటుంది. చేపల వ్యర్థ పదార్థాలు అమ్మోనియం రూపంలో నీటి ఉదజాని సూచికను ప్రభావితం చేస్తాయి. ఈ తరుణంలో ప్రో బియోటిక్స్ న్యూట్రిషన్ తో బయో ప్లాక్ వృద్ధి చేసి చేపల ట్యాంక్ లలో కలిపితే ప్రోటీన్లు క్షయకరణం జరిగి వ్యర్థాలు కూడా వినియోగంలోకి వస్తాయి.
byte, రామచంద్రారెడ్డి, రైతు
vo2: ఈ రోజుల్లో వ్యవసాయం అయిన.. వ్యాపారం అయిన కూలీల కొరత ఎంత తీవ్రంగా ఉందొ తెలిసిందే. ఆ ఇబ్బంది లేకుండా తక్కువ నీటిని ఉపయోగించి తక్కువ కులీలతో బయో ప్లాక్ పద్దతిలో చేపలు సాగు చేయొచ్చని చెబుతున్నారు రామచంద్ర రెడ్డి.10 గుంటల భూమి లీజుకు తీసుకొని సాగు ప్రారంభించారు.ఆ ప్రదేశంలో కానీ పరిసరాల్లో కాని నీటి వనరులు లేవు కేవలం బోరుబావి మీద ఆధారపడి చేపలు సాగు చేయటం సాహసమే. వ్యవసాయంలో తనకున్న అనుభవానికి శాస్ట్రియతను జోడించి తక్కువ ఖర్చుతో చేపలు సాగు చేయొచ్చని.. చేపక్ల్5సాగుకు పుష్కలంగా నీరు అవసరం అనేది కేవలం అపోహ మాత్రమే అని నిరూపిస్తున్నారు ఈ ఆదర్శ రైతు.
vo3: చేపల పెంపకమ్ కోసం మొత్తం27ట్యాంకులు ఏర్పాటు చేశాడు. ఒక్కో ట్యాంకు 3 మీటర్ల వ్యాసంలో 3500 లీటర్ల నీటి నిల్వ సామర్థ్యము కలిగి ఉంటాయి. ఈ ట్యాంకులన్నింటిని టార్పాలిన్ కవర్ తో చుట్టేస్తారు. నీటిని నింపడానికి, తొలగించటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తూ ..వ్యవసాయ క్షేత్రంలో ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు షెడ్ నెట్ ఏర్పాటు చేశారు.
vo4: బయో ప్లాక్ విధానంలో స్థానిక సంప్రదాయ రకాలైన చేపలకు భిన్నంగా ఎగుమతి కి అవకాశం ఉన్న పంగాసియస్, వనామి, దేశిమాగుర్, కొర్రమీను వంటివి సాగు చేస్తున్నారు. ఈ పద్దతిలో పంగాసియస్ అనే రకం చేపలు నెలల కాలంలో గరిష్టంగా కిలో బరువు పెరుగుతాయి. ఈ చేప పిల్లలను నెల్లూరు జిల్లా కోడూరు నుంచి తెప్పించారు. దేశిమాగుర్ చేప పిల్లలు పశ్చిమ గోదావరి జిల్లా బలరాంపూర్ లోని icir కేంద్రం నుంచి సేకరించారు. కాకినాడ నుంచి కొర్రమీను తీసుకొచ్చి పెంచుతున్నారు. కొర్రమీను మినహా మిగతా అన్ని రకాలు కలకత్తా కు ఎగుమతి చేయనున్నారు. వీటి ధర కిలో 400 వరకు పలుకుతుంది. ప్రస్తుతం ట్యాంకులో చేపక్ పిల్లలు 300 గ్రాముల బరువు ఉన్నాయని మరో 5 నెలల్లో కిలో వరకు అవుతాయని చెబుతున్నారు రామచంద్ర రెడ్డి.
evo: మరో విశేషమేమంటే బయో ప్లాక్ పద్దతిలో చేపల పెంపకానికి రామచంద్రారెడ్డి కి సామాజిక మద్యమమే గురువుగా ఆసరాగా నిలిచింది. ఇప్పటి వరకు రాష్ట్రములో చ్చెరువులలో సాగు తప్ప బయో ప్లాక్ పద్దతి రాష్ట్రంలో లేదు. యూట్యూబ్ లో చూసి మెలకువలు తెలుసుకొని సాగు చేయటం అభినందనీయం.




Body:shiva shankar


Conclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.