ఎన్డీయేలో చేరతామన్న మంత్రి బొత్స వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుబట్టారు. లౌకికవాద పార్టీ అంటూ అధికారంలోకి వచ్చి...ఇప్పుడు ఎన్డీయేలో ఎలా చేరుతారని ప్రశ్నించారు. ప్రజావ్యతిరేక బిల్లులకు పార్లమెంటులో వైకాపా మద్దతిచ్చి ఓటు వేసిందని గుర్తు చేశారు. ఇప్పుడేమో ఎన్డీయేలో చేరడానికి ఉబలాటపడుతోందని విమర్శించారు. భాజపాతో జతకట్టడమంటే..దళితులు, మైనార్టీలను మోసం చేయడమేనని వ్యాఖ్యానించారు. బొత్స వ్యాఖ్యలను మంత్రులు అంజాద్బాషా, నారాయణస్వామి ఖండించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : 'రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా గడ్డం పట్టుకుని బతిమిలాడుతాం'